బిల్లుల ప్రాబ్లమ్స్ – రేవంత్ శాశ్వత పరిష్కారం చూడాల్సిందే!
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బిల్లుల సమస్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు, ఆస్పత్రులకు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా స్పందించారు. సమ్మెకు దిగిన కాలేజీలకు గట్టి హెచ్చరికలు జారీ చేసి, వారిని తిరిగి దారికి తెచ్చిన రేవంత్ ఇప్పుడు రాజకీయంగా బలమైన సంకేతాలు ఇస్తున్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తమపై కుట్రలు చేస్తే ఎదురుదాడికి సిద్ధమని ఆయన చెప్పడంతో ప్రతిపక్షం…

