Breaking News

“డైరెక్టర్ సీట్లలో యంగ్ హీరోలు.. టాలీవుడ్‌లో కొత్త రేంజ్ ప్రయోగాలు!”

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. దర్శక నిర్మాతల కథల కోసం వేచి చూడకుండా, తమ ఐడియాలను స్వయంగా తెరకెక్కించేందుకు యంగ్ హీరోలు మెగాఫోన్ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు, కార్తికేయలు తమ స్వీయ దర్శకత్వంలో కథానాయకులుగా నటిస్తూ సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విశ్వక్ సేన్ (‘కల్ట్’), రామ్ పోతినేని (RAPO 23), కిరణ్ అబ్బవరం తమ సొంత ప్రాజెక్టులతో దర్శకులుగా మారుతున్నట్లు ప్రకటించారు. హీరోలు దర్శకులుగా…

Read More

వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…

వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…

Read More

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్  ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్  దీర్ఘాయుష్షుతో ప్రజలకు…

Read More

నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?

జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…

Read More

నీట్ వివాదంపై బాలీవుడ్ మద్దతు: విద్యార్థుల ఆందోళనలకు సోనూ సూద్, వీర్ దాస్, దియా మీర్జా అభయం!

న్యూఢిల్లీ / ముంబై: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ (NEET) పరీక్షల అక్రమాలు, విద్యా వ్యవస్థ సంస్కరణల వివాదంపై విద్యార్థులు చేపట్టిన పోరాటానికి బాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. విద్యార్థుల ఆవేదనను, ఆందోళనలను సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ వారి తరఫున గళమెత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపిన ప్రముఖులు ప్రముఖ నటులు సోనూ సూద్, వీర్ దాస్, దియా మీర్జా, సోహా అలీ ఖాన్, అదితి రావు హైదరీ,…

Read More

ఆర్మూర్‌లో రాజకీయ వేడి.. సవాళ్లు – ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంకాపూర్ లో ఉద్రిక్త వాతావరణం, అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఆర్మూర్, జూలై 20: E6 tv NEWS, (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో బీజేపీ నిర్వహించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రణభేరి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే…

Read More

తండ్రికి తగ్గ తనయుడు… ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పోచారం భాస్కర్ రెడ్డి.

కోటగిరి, జూలై 19: E6 tv NEWS (శివ ఠాకూర్).బాన్సువాడ నియోజకవర్గ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న పోచారం భాస్కర్ రెడ్డి పేరు ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు లభిస్తోందని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ప్రజలతో మమేకమవడం, అవసరమైన సమయంలో అండగా నిలవడం, ఎక్కువగా మాటలు…

Read More

E6TV బ్రేకింగ్ న్యూస్ గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తీరని లోటు..

  భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి (శిష్ట్లా జానకి) శనివారం కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న జానకి అమ్మ, వయోసహజ అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె…

Read More

ముగిసిన మరో శకం.. గాన కోకిల ఆశా భోస్లే ఇక లేరు.

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన శకం ముగిసింది. లెజెండరీ సింగర్, పద్మవిభూషణ్ ఆశా భోస్లే (92) ఇక లేరు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12, 2026) కన్నుమూశారు.ఈ విషాద వార్తను ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మృతితో యావత్ సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. E6TV వెబ్ న్యూస్ ప్రత్యేక కథనం:సంగీత సరస్వతి ఆశా భోస్లే ప్రస్థానంఆశా భోస్లే కేవలం…

Read More

నా 30వ పుట్టినరోజు ఇలా జరిగింది: రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక 30వ బర్త్‌డే వేడుకలు: పెళ్లి తర్వాత ఫస్ట్ పుట్టినరోజు.. విజయ్ దేవరకొండతో కలిసి కూర్గ్‌లో సందడి! హైదరాబాద్/కూర్గ్: స్టార్ హీరోయిన్, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును అత్యంత వైభవంగా, అంతే ఎమోషనల్‌గా జరుపుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నటుడు విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో, ఈ వేడుకను తన సొంతూరు కర్ణాటకలోని కూర్గ్లో జరుపుకోవడం…

Read More