Sports
భీంగల్ కొత్త బస్టాండ్లో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు
బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు సమయాలు తెలియక ప్రయాణికుల అవస్థలు భీంగల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో కంట్రోలర్ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్లో రోజూ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు కంట్రోలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. భీంగల్ కొత్త బస్టాండ్ నుంచి వేల్పూర్,…
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
అక్రమ ఇసుక, పశు రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యమైన దర్యాప్తుతో సత్వర పరిష్కారం చూపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి,…
భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భూ రీ సర్వే పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం మండలం చిట్టిరామవరం తండాలో జరుగుతున్న డిజిటల్ భూ రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగం, భూముల కొలతలు, వివరాల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల…
సాయుధ రైతాంగ పోరాటం అజరామరం
అమరుల ఆశయాల సాధనకు సమరశీల ఉద్యమాలు నిర్మించాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సుజాతనగర్, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమని, నాటి వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో నిర్వహించారు. రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద…
వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
డీజేలకు అనుమతి లేదు.. మండపాల వద్ద గొడవలకు నిర్వాహకులదే బాధ్యత: ఎస్ఐ నరేష్ హుజూర్నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని భక్తి భావంతో పండుగను నిర్వహించుకోవాలని హుజూర్నగర్ ఎస్ఐ చలికంటి నరేష్ సూచించారు. మండపాలను రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి పొందాలని తెలిపారు. మండపాల వద్ద అశ్లీల పాటలు, నృత్యాలు నిర్వహించరాదని, డీజే సౌండ్ సిస్టమ్కు ఎలాంటి…
పేదలకు రూ.230కే సిమెంట్
తక్కువ ధరకే స్టీల్ అందించేందుకు చర్యలు: మంత్రి పొంగులేటి హైదరాబాద్,సెప్టెంబర్ 11:(E6tv NEWS). ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేదలకు సిమెంట్ను తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320 వరకు ఉన్న సిమెంట్ బ్యాగును లబ్ధిదారులకు కేవలం రూ.230కే అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్ను కూడా తక్కువ ధరకే…
హుజూర్నగర్లో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం
నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి హుజూర్నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). హుజూర్నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు….
గుండెపోటుతో జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ మృతి
జుక్కల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన విఠల్రావు పాటిల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించే సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా విధులు నిర్వహిస్తున్నారు.తోటి న్యాయవాదులతో కలిసి రాజస్థాన్లోని సోమ్నాథ్ యాత్రకు వెళ్లిన విఠల్రావు పాటిల్ తిరుగు ప్రయాణంలో గురువారం జైపూర్ సమీపంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందారు….
మట్టి గణపతులను పూజిద్దాం
ఏర్గట్ల, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితిని పురస్కరించుకొని ఏరుగట్లలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి గణపతుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఆకృతుల్లో ఎంతో అందంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మట్టి గణపతుల ప్రాశస్త్యంతో పాటు వినాయక చవితి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను వినియోగించడం ఎంతో ముఖ్యమని సూచించారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి…
అవుట్సోర్సింగ్కు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
పాల్వంచ, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). YTPS AHP, CHP విభాగాలను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ TGPEJAC ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్ ప్లాంట్లలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని KTPS VII STGలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. KTPS VII STG చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు….

