Telangana
ఫాం పాండ్ల నిర్మాణంతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం
మద్నూర్లో ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం మద్నూర్, జూలై 28: (E6 tv NEWS ప్రతినిధి). వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఫాం పాండ్లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ వీఓఏలు (VOAలు), సీసీలు (CCలు) పాల్గొన్న సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, సురేష్ హాజరై ఫాం పాండ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిల్వలను…
స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు… వాడి గ్రామానికి ఇంకా రోడ్డు లేదు!
జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ “మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి): కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని,…
1983 తర్వాత తెలంగాణ ఎసిబి ఆల్-టైమ్ రికార్డు.. ఒకే త్రైమాసికంలో అత్యధిక కేసులు నమోదు!
హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 రెండవ త్రైమాసికంలో (Q2) అవినీతి అధికారుల పై వరుస దాడులు, విచారణలు చేపట్టి 1983 సంవత్సరం తర్వాత ఒక నిర్దిష్ట త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు బ్యూరో వెల్లడించింది. మంగళవారం ఎసిబి డైరెక్టర్ జనరల్ చారూ సిన్హా, డైరెక్టర్ అవినాష్ మహంతిలతో కలసి బ్యూరో నమోదు చేసిన కేసులు, పురోగతిపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండవ త్రైమాసికంలో నమోదు…
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. వికసిత్ భారత్-జీ రామ్ జీ (VB-G RAM G) పనుల విస్తరణపై వినతి!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు. ఎల్ నినో (El Nino) ప్రభావం మరియు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల రైతులకు, కూలీలకు చేయూతనిచ్చేందుకు వికసిత్ భారత్-జీ రామ్ జీ (VB-G RAM G) ఉపాధి హామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని సీఎం కోరారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, భూముల ఉత్పాదకతను పెంచడం మరియు ప్రకృతి…
జూలై 31 నుంచి TGICET 2026 కౌన్సెలింగ్.. విడుదలైన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే!
హైదరాబాద్: తెలంగాణలోని సాంకేతిక, వ్యాపార విద్యా కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TGICET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 31వ తేదీ (జూలై 31) నుంచి ప్రారంభం కానున్నట్లు ఐసెట్ అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యామండలి కమిషనర్ ఎ. శ్రీదేవసేన వెల్లడించారు. ఈ ఏడాది అర్హత సాధించిన 46,654 మంది అభ్యర్థులకు రెండు…
కోతుల బెడదకు చెక్ పెట్టిన యువకుడు
చింపాంజీ వేషంతో పంటలు, ఇళ్లను కాపాడుతున్న బాలాజీ నిర్మల్, జూలై 28: E6 tv NEWS(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదకు ఓ యువకుడు వినూత్న పరిష్కారం చూపి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చింపాంజీ వేషం ధరించి కోతులను తరిమేస్తూ రైతులకు, గ్రామస్తులకు అండగా నిలుస్తున్నాడు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉండటంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు….
నిజామాబాద్ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి ఇందల్వాయి, జానకంపేట ఆర్ఓబీల మంజూరుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు న్యూఢిల్లీ/నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న,…
టౌన్-3 పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, డ్రగ్స్పై విస్తృత అవగాహన కల్పించాలి నిఘా వ్యవస్థ పటిష్టం చేసి ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి నిజామాబాద్, జూలై 28 (E6 tv NEWS ప్రతినిధి): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ…
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి,లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్, జూలై 28: (E6 tv NEWS) రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్…
ఎస్సారెస్పీ (SRSP) ప్రాజెక్ట్లో విషాదం.. నలుగురు యువకులు నీటమునిగి మృతి, ముగ్గురి మృతదేహాలు లభ్యం!
నిజామాబాద్ / హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ జలాశయ ప్రాంతంలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాటికి ముగ్గురు యువకుల మృతదేహాలను నీటి నుంచి వెలికితీయగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన వివరాలు & ప్రాంతాలు: ఎస్సారెస్పీ…

