Breaking News

భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి

మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులు భూ పత్రాలు, హద్దులు చూపించి సహకరించాలి పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నంబర్ 77లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రోవర్ పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, క్షేత్రస్థాయిలో…

Read More

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

ఆరోగ్య సూపర్‌వైజర్లకు డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచనలు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, కొత్తగూడెం కార్యాలయ సమావేశ మందిరంలో ఆరోగ్య సూపర్‌వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. తుకారామ్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ భూక్యా రామ్ దాస్, డాక్టర్ టీ. ప్రతాప్, డాక్టర్ దినేష్, సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై స్టే.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఏమిటి?

పేదింటి ఆడబిడ్డల పెళ్లి సాయంపై న్యాయపరమైన ప్రతిష్టంభన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు పథకం రద్దు కాలేదా? స్టే మాత్రమేనా? అసలు వివాదం ఏమిటి? నిజామాబాద్, ఆగస్టు 17: E6tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ లో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు ప్రస్తుతం రాజకీయ, న్యాయపరమైన చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పథకాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇటీవల మధ్యంతర…

Read More

గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని హండె కేలూర్ గ్రామస్తుల వినతి

మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండె కేలూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామానికి కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రంలో గ్రామస్తులు పేర్కొన్న వివరాల ప్రకారం, బీసీ కాలనీలో గడ్డివార్ వీరేశంకు అక్రమ నిర్మాణం పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారని తెలిపారు. అయితే అదే ప్రాంతంలో తాము గత 20 ఏళ్లుగా…

Read More

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాల పంపిణీ

జుక్కల్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాలను సోమవారం పంపిణీ చేశారు.జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఈ గోడ గడియారాలను అందజేసినట్లు గ్రామ సర్పంచ్  వి. రమణా సురేష్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా…

Read More

ఇందూరు ఊర పండుగలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ – బీజేపీ కార్పొరేటర్లు

నిజామాబాద్, ఆగస్టు 2: E6 tv NEWS శివ ఠాకూర్ నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన సాంప్రదాయ ఇందూరు ఊర పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని పలు దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులతో కలిసి ఎమ్మెల్యే పండుగ ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు…

Read More

నిజామాబాద్ ‘ఊర పండుగ’ – తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీక

ఇందూరు ఆగస్టు 2: E6 tv NEWS (శివ ఠాకూర్). నిజామాబాద్, ఆగస్టు 2: తెలంగాణ జానపద సంస్కృతి, గ్రామదేవతల ఆరాధన, సర్వ సమాజ్ ఐక్యతకు ప్రతీకగా నిలిచే నిజామాబాద్ (ఇందూర్) ఊర పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రోజునే జరిగే ఈ ఉత్సవం శతాబ్దాల చరిత్రను కలిగి ఉండి, నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసం, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఊర పండుగ…

Read More

ముధోల్ శిశు మందిర్‌లో రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్‌కు సన్నాహాలు పూర్తి

ముధోల్, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ (విజ్ఞాన మేళా)ను ఆగస్టు 30, 31 మరియు సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్మల్ జిల్లా ముధోల్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ తెలిపారు.ఈ సైన్స్ ఫేర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శిశు మందిరాల నుంచి సుమారు 500…

Read More

రాత్రి వరకు తెలంగాణపై డిప్రెషన్ ప్రభావం.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!

తదుపరి 12-18 గంటలు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుల సూచన.. హైదరాబాద్, జూలై 30: (E6 tv NEWS: ప్రతినిధి).తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతున్న డిప్రెషన్ ప్రభావం రాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 12 నుంచి 18 గంటలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో…

Read More

కోర్ డిప్రెషన్ ఎఫెక్ట్.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

36 గంటల్లో 300–450 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం.. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు నిజామాబాద్ జూలై 29: E6 tv NEWS (శివ ఠాకూర్).  బంగాళాఖాతంలో ఏర్పడిన కోర్ డిప్రెషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే 36 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వాగులు, వంకలు…

Read More