న్యూ ఇయర్ వేళ ‘గోవింద’ నామస్మరణతో మారుమోగిన తిరుమల

తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

Read More

అక్రమ కంటెంట్‌తో కోట్ల బిజినెస్..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ వెబ్‌సైట్ ద్వారా భారీగా ఆదాయం సంపాదించినట్టు కస్టడీ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.కామ్‌కార్డ్ ప్రింట్‌కు ఒక్క ధర, హెచ్‌డీ ప్రింట్‌కు మరో ధరగా వసూలు చేసినట్టు విచారణలో తేలింది. ఒక్క కామ్‌కార్డ్ ప్రింట్‌కు రూ.100, హెచ్‌డీ ప్రింట్‌కు రూ.200 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రతినెలా బ్యాంక్ ఖాతాల్లోకి సగటున రూ.13.40 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్…

Read More

జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలా..?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. జనవరి నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు పూర్తయ్యాక తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే…

Read More

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్‌ను ముమ్మరం చేయనున్నారు. గుంపులుగా రోడ్లపై తిరగవద్దని పోలీసులు సూచించారు. పబ్‌లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగనుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దింపారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో…

Read More

ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివి

ప్రేమ వివాహాల్లో ఒడిదుడుకులు సహజమన్న హైకోర్టు ధర్మాసనం తమను కాదని వెళ్లిన కూతురి కోసం కోర్టుకెక్కిన వృద్ధ తల్లిదండ్రులు యువతి మేజర్ అయినందున ఆమె నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని సూచన ప్రేమ వివాహాలపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివని, వాటిలో లాభనష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తిరుచ్చికి చెందిన ఓ నర్సు అదృశ్యంపై దాఖలైన…

Read More

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం?..

సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపునకు యోచన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల…

Read More

మందుబాబులూ జాగ్రత్త… సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇకపై ఎవరి పేర్లు, పరిచయాలు పనిచేయవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వెంటనే కొందరు “మా డాడీ ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా?”, “నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?” అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బెదిరింపులకు, రికమండేషన్లకు తన దగ్గర ఎలాంటి స్థానం లేదని సజ్జనార్ తేల్చిచెప్పారు….

Read More

వైకుంఠం ఏకాదశి శుభాకాంక్షలు

కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐 తిరుమల సమాచారం 🚩 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం . 🚩 లక్కీ డిప్ లో సెలెక్ట్ అయి, టోకెన్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతి. 🚩 రెండంచెల తనిఖీనీ (Double checking) పాటిస్తున్న టీటీడీ. 🚩 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,631 🚩 18,609…

Read More

మాధవీలతపై కేసు..

సాయిబాబాపై అనుచిత కామెంట్స్ చేశారంటూ నటి మాధవీలతపై HYD సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సాయిబాబాపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. సాయిబాబా అఫ్గాన్ ముస్లిమని, ఆయనను పూజించేవారికి బుద్ధిలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Read More

పీపీపీ (PPP) మోడల్ ఒక రక్షణ కవచం

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వైద్యులను తయారు చేస్తున్న దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఆ ప్రతిభ దేశానికి ఉపయోగపడటం లేదు. ప్రతి సంవత్సరం సుమారు 70,000 నుండి 80,000 మంది ఎంబీబీఎస్ పట్టభద్రులు బయటకు వస్తుంటే, వారిలో దాదాపు 10,000 మంది వైద్యులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు తరలిపోతున్నారు. మరోవైపు, దేశంలో సీట్లు దొరకక అండర్ గ్రాడ్యుయేషన్ (UG) కోసమే వేలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతున్నారు. ఈ పరిణామం అటు దేశ ఆరోగ్య వ్యవస్థను,…

Read More