ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం చేయూత..
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇళ్లకు కేంద్రం తన వాటాను అందించనుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున నిధులు సమకూరనున్నాయి. రాష్ట్రం ఆశించిన స్థాయిలో కాకపోయినా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 4.13 లక్షల…

