జగన్ మాటలను అతని కుటుంబం కూడా నమ్మదు – మంత్రి అనగాని సత్యప్రసాద్



E6TV NEWS

జగన్ మాటలను అతని కుటుంబం కూడా నమ్మదు – మంత్రి అనగాని సత్యప్రసాద్

కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ఆధారమూ చూపించకుండా ప్రజల సమయాన్ని వృథా చేశారని అన్నారు. “జగన్‌కు నిజం చెప్పడం శాపమైందేమో” అంటూ ఎద్దేవా చేశారు.

జగన్ ఆరోపణలకు ఒక్క ఆధారమూ లేదు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు —
జగన్ జీవితమంతా అబద్ధాల మీద నడిచిందని, వైసీపీ అబద్ధాల పునాదుల మీద నిర్మితమైన పార్టీ అని అన్నారు.
లండన్ నుంచి వచ్చి బెంగళూరులో విశ్రాంతి తీసుకుని, తాడేపల్లికి వచ్చి “పార్ట్ టైమ్ విజిటర్” లా అబద్ధాల స్క్రిప్టు చదివారని విమర్శించారు.

గూగుల్ గురించి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం

జగన్ గూగుల్ రాష్ట్రానికి వచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదమని, ఆ మాటలు అతని కుటుంబ సభ్యులు కూడా నమ్మరని సత్యప్రసాద్ అన్నారు.


బాబాయ్ హత్య కేసులో జగన్ వైఖరిపై విమర్శలు

జగన్ బాబాయ్ హత్య కేసులో మొదట గుండెపోటు అని, తర్వాత సీబీఐ విచారణ కోరి, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు.
సీబీఐ విచారణకు అడ్డుకట్ట వేసి, హంతకులను శిక్షించలేకపోయారని అన్నారు.

కల్తీ మద్యం వల్ల 30 వేల మంది మృతి

గత ఐదేళ్లలో కల్తీ మద్యం తయారుచేసి భారీగా డబ్బు సంపాదించారని, దీని కారణంగా 30 వేల మంది మృతిచెందారని, 3 లక్షల మంది ఆసుపత్రిపాలయ్యారని ఆధారాలతో వెల్లడించారు.
“కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ మోహన్ రెడ్డి” అని ఘాటుగా విమర్శించారు.
బలహీన వర్గాలపై జగన్ అణచివేత

సుధాకర్ బాబు నుంచి సలామ్ కేసు వరకు తప్పు చేసిన వారిని కాపాడిన చరిత్ర జగన్‌దే అని అన్నారు.
రాష్ట్ర ప్రజలపై కోపంతో అబద్ధాల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు–లోకేష్ పర్యటనలతో పెట్టుబడులు వస్తున్నాయి

ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు (యూఏఈ) మరియు నారా లోకేష్ (ఆస్ట్రేలియా) పర్యటనల ద్వారా పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు తీసుకువస్తున్నారని తెలిపారు.
జగన్ లండన్ ట్రిప్ వెనుక ఉద్దేశం ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు.
నకిలీ మద్యం పై ఉక్కుపాదం

నకిలీ మద్య తయారీలో పాలుపంచుకున్న వారెవరైనా శిక్షార్హులేనని హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉన్న ‘J బ్రాండ్స్’ మద్యాలలో ప్రమాదకర రసాయనం “వాల్‌కెనిన్” ఉందని, దానివల్లే వేలమంది మరణించారని తెలిపారు.
ప్రస్తుతం క్యూఆర్ కోడ్ విధానం ద్వారా నకిలీ మద్యాన్ని అరికడుతున్నామని వివరించారు.
అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం

మోదీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ పర్యటనలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు.
విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా, బెంగళూరు–ఓర్వకల్లును ఏరోస్పేస్ జోన్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

తప్పుడు ప్రచారం చేసే మీడియాపై చర్యలు
ఆధారాలు లేకుండా బురదజల్లే ప్రయత్నాలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూదం ఎక్కడ జరిగినా కూటమి ప్రభుత్వం వదలదని స్పష్టం చేశారు.
రేపల్లె డాన్ మాటలు అవాస్తవం

రేపల్లె ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని, తాను “డాన్” కాదని సత్యప్రసాద్ తెలిపారు.
తాను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతానని అన్నారు.
“జగన్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. నిజాలు ఆధారాలతో చెప్పగలిగే ధైర్యం చూపాలి.” — మంత్రి అనగాని సత్యప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *