ఒకవైపు కీలకమైన మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్ వంటి పేద, మధ్యతరగతి ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు.

సామాన్య ప్రజల మధ్య కలిసిపోతూ, టీ దుకాణంలో దోసెలు వేయడం, ఓ గృహిణి ఇంట్లో బియ్యం చెరగడం వంటి దృశ్యాలు ఆమె వినయాన్ని, ప్రజలతో సాన్నిహిత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
పగలు ఇంటింటి ప్రచారం, సాయంత్రం రోడ్షోలు, రాత్రివేళల్లో కార్నర్ మీటింగ్లు — ఇలా ఎటువంటి విరామం లేకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్ల సమస్యలు విని, పరిష్కార మార్గాలను వివరించడంలో ఆమె చూపుతున్న నిబద్ధత ప్రజల మనసులు గెలుచుకుంటోంది.
సీతక్క చెబుతున్న “గడీల బిడ్డ వద్దు, గల్లీల బిడ్డ కావాలి” అనే నినాదం ప్రజల్లో సానుకూల స్పందన తెచ్చింది. “గరీబోళ్ల బిడ్డ నవీన్ యాదవ్ గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుంది” అని ఆమె ప్రసంగాలు గుండెలను తాకుతున్నాయి.

