తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో దట్టమైన పొగమంచు

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో దట్టమైన పొగమంచు
తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. దీని నేపథ్యంలో గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *