ఈరోజు స్వర్గస్తులైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పిన్నమనేని సాయి బాబా గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పడి గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీపతి సతీష్ గారు పాల్గొన్నారు.
అలాగే హైదరాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకులు నాగు నగేష్ గారు, మాజీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శులు సాంబశివరావు గారు, సంధ్య పోగు రాజశేఖర్ గారు, రవీంద్ర చారి గారు, సిటీ పార్టీ నాయకులు నల్లెలా కిషోర్ గారు, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు ఆనంద్ గారు నివాళులర్పించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విజయ శ్రీ గారు, తెలుగు యువత నాయకులు శివ గారు, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు జోగేంద్ర సింగ్ గారు, బాలాజీ గురుస్వామి గారు, స్థానిక పార్టీ నాయకులు తదితరులు హాజరై సాయి బాబా గారి సేవలను స్మరించుకున్నారు.
పిన్నమనేని సాయి బాబా మృతి… కన్నీటి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

