200 ఐఈడీ బాంబులతో దేశవ్యాప్తంగా పేలుళ్లు… ఉగ్రవాదుల కుట్ర!

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబయి తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,…

Read More

భారత్ లో ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ మరోసారి ప్రధాన మార్పు దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల విలీనం రెండో దశ (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే దేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్…

Read More

ప్రధాని మోదీ రహస్యాలన్నీ అమిత్ షాకు తెలుసు..

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటనలో కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ హోం శాఖ మంత్రిగా అమిత్ షాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అభివర్ణించారు. దేశంలో గత కొన్నేళ్లుగా జరిగిన భద్రతా…

Read More

ఇండియా కూటమిలో చీలిక.. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటరిపోరు..!

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మహారాష్ట్రలో ఇండియా కూటమికి బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ తమ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్.. అధిష్ఠానానికి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలిపారు. దానికి అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ముంబైతో పాటు…

Read More

పార్లమెంట్‌లో విద్యార్థులతో రాహుల్ గాంధీ…

పార్లమెంట్‌లో విద్యార్థులతో ఆహ్లాదకరమైన భేటీ ఈరోజు పార్లమెంట్‌లో పాఠశాల విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. జనరేషన్ Z యువతే భారతదేశ భవిష్యత్తు — వాళ్లలో ఉత్సాహం, కలలు, కొత్త ఆలోచనలు నిండుగా ఉన్నాయి. వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలు వినడం ఎప్పుడూ ప్రేరణగా ఉంటుంది. వారి జిజ్ఞాస, సృజనాత్మకత చూసి మన దేశ భవిష్యత్తుపై మరింత నమ్మకం వస్తుంది. ఇలాంటి సమావేశాలు యువతకు ప్రోత్సాహం ఇస్తాయి, దేశాన్ని మరింత బలంగా, ప్రకాశవంతంగా మార్చే దిశగా ముందుకు…

Read More


“రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు

E6TV WEB NEWS | హైదరాబాద్ “రైతుల కష్టాలు కనిపించవా రేవంత్ రెడ్డి గారూ?” — డీకే అరుణ మండిపాటు హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు….

Read More