కవితపై అవినీతి బాణం ..?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హరీశ్‌రావు–కవిత మధ్య వార్‌ మరోపారి చర్చనీయాంశమైంది.

తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. కవిత మెదక్‌లో చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్‌ అని.. కానీ కవిత కారణంగానే పార్టీ నష్టపోయిందని బీఆర్‌ఎస్‌ నేత మల్లికార్జునగౌడ్‌ సంచలన ఆరోపణ చేశారు. కవిత అక్రమ సంపాదనపై నిగ్రహం లేకుండా వ్యవహరించడంతో, కుటుంబ పాలన ముద్రను బీఆర్‌ఎస్‌ తొలగించవలసిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కవిత వ్యవహారమే పార్టీని బ్రష్టు పట్టిందని ఆరోపించడం ఇప్పటి రాజకీయ దృశ్యాన్ని కలవరపరిచింది. తన మాటల్లో పార్టీలో అవినీతిని కవిత నవీకరించిందని, హరీశ్‌రావుపై కూడా ఆరోపణలు చేయడం ద్వారా కుటుంబంలోనే విభేదాలు పెరిగాయా..? అన్న సందేహం మిగిలింది.

బీఆర్‌ఎస్‌ ప్రెస్‌మీట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పార్టీలోనే దొంగలు ఉన్నారు. హరీశ్‌ రెంటు నుంచి కోట్లకు వెళ్లాడు, అదే నోరు అప్పటి ఆరోపణలకు ఉండలేదా. ? వంటి ప్రశ్నలు వేస్తున్నారు. ‘లిక్కర్‌ స్కాం నిజమైతే గత ధర్నాలు, నిప్పు–సద్దుల్లో నిజమెక్కడ? అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి పార్టీ నైతికతను ప్రశ్నిస్తున్నాయి. పార్టీలో ఉన్నప్పుడు పూజలు, బైటకు వెళితే నిందలా అని నిలదీస్తున్నారు. కార్టూను స్టైల్‌ లో సారు+కారు= ఇక రారు మీమ్స్‌ పోస్టు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయ్కత్వంపై లిక్కర్‌ స్కాం జరగలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు కవిత విషయంలో స్కాం జరిగిందని, కవిత స్కాం చేసిందని ధ్రువీకరిస్తున్నారు. అందుకే పార్టీ నాశనం అయిందని, పేర్కొంటున్నారు. కుటుంబ పాలనపై ప్రతిపక్ష విమర్శలకు కవిత వ్యవహారమే బలంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *