కర్నూలు బస్సు ప్రమాదం మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది
కర్నూలు జిల్లా ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ పరిహారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కర్నూలు సమీపంలో జరిగిన ఈ విషాద ఘటనపై సీఎం గాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


