
హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు….అన్వేష్పై BNS సెక్షన్ 67 IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, నిరాధారపోనాలతో కూడిన వీడియోలు పోస్ట్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు…వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అన్వేష్ చేసిన వీడియోల వల్ల సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు….ఇకపై ఇలాంటి కంటెంట్పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలంటూ సూచించారు

