Breaking News

మానవతా దృక్పథం చాటిన ఎస్పీ నరసింహ

MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి రూ.20 వేల ఆర్థిక సహాయం సూర్యాపేట, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదని, పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందు NEETలో మంచి ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందడంతో ఆమెకు తన వంతు సహాయంగా రూ.20…

Read More

డాక్టర్ శ్రీనివాసరెడ్డిని సత్కరించిన కొత్వాల

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కొత్తగూడెం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డిని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం వచ్చిన సందర్భంగా శుక్రవారం విద్యానగర్‌లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ…

Read More

నేడే జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్

కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టుల్లో శనివారం (సెప్టెంబర్ 12) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత తెలిపారు.జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు తదితర కేసులను లోక్…

Read More

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

అక్రమ ఇసుక, పశు రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యమైన దర్యాప్తుతో సత్వర పరిష్కారం చూపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి,…

Read More

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

ఆసుపత్రుల సమయపాలన, మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి: డీఎంహెచ్‌ఓ పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచించారు. శుక్రవారం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రుల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలు, మాతా-శిశు ఆరోగ్యం, అసంక్రమిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల…

Read More

భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భూ రీ సర్వే పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం మండలం చిట్టిరామవరం తండాలో జరుగుతున్న డిజిటల్ భూ రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగం, భూముల కొలతలు, వివరాల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల…

Read More

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రకృతి సిద్ధమైన విగ్రహాలతో అలరించిన విద్యార్థులు పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పట్టణంలోని ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆకులు, బంకమట్టి, క్లే, ధాన్యాలు, పప్పుధాన్యాలు, గోధుమ పిండితో స్వయంగా తయారు చేసిన వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి మిర్చాల మాట్లాడుతూ వినాయక చవితి జ్ఞానం, శ్రేయస్సు, అభ్యుదయానికి ప్రతీక అన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నహర్తగా వినాయకుడిని…

Read More

సాయుధ రైతాంగ పోరాటం అజరామరం

అమరుల ఆశయాల సాధనకు సమరశీల ఉద్యమాలు నిర్మించాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సుజాతనగర్, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి).  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమని, నాటి వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో నిర్వహించారు. రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద…

Read More

వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

డీజేలకు అనుమతి లేదు.. మండపాల వద్ద గొడవలకు నిర్వాహకులదే బాధ్యత: ఎస్‌ఐ నరేష్ హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని భక్తి భావంతో పండుగను నిర్వహించుకోవాలని హుజూర్‌నగర్ ఎస్‌ఐ చలికంటి నరేష్ సూచించారు. మండపాలను రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి పొందాలని తెలిపారు. మండపాల వద్ద అశ్లీల పాటలు, నృత్యాలు నిర్వహించరాదని, డీజే సౌండ్ సిస్టమ్‌కు ఎలాంటి…

Read More

హుజూర్‌నగర్‌లో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం

నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). హుజూర్‌నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్‌కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు….

Read More