Mahaboobnagar
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష
మద్నూర్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మద్నూర్ ఎస్ఐ మోహన్రెడ్డి హెచ్చరించారు. మద్నూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆరుగురు పట్టుబడ్డారు. పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను బిచ్కుంద కోర్టు–II మేజిస్ట్రేట్ చంద్రకళ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు…
ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలు
24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీ లాంటి వారని, వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారని నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. రమాదేవి అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. బాలు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమం…
పాల్వంచ–కొత్తగూడెం వేదికగా జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్
ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహణకలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం పలికిన జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కొత్తగూడెం, సెప్టెంబర్ 12: (E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్రెడ్డి తెలిపారు. శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్రెడ్డి సహకారంతో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్లో దేశంలోని వివిధ…
గ్రామగ్రామాన గణేషుడు.. 300కు పైగా విగ్రహాల ఉచిత పంపిణీ
హుజూర్నగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హుజూర్నగర్ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని భక్తులకు 300కు పైగా గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.భక్తి, సేవ, ఐక్యత అనే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత, భక్తులు…
యోగ సేవలకు గుమలాపురం సత్యనారాయణకు సన్మానం
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేత భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). యోగ రంగంలో విశేష సేవలు అందిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, పట్టణ ప్రముఖ యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఘనంగా సన్మానించారు. తెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ (TYTCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది.యోగ ద్వారా ప్రజలకు ఆరోగ్యం, ఆనందంతో పాటు…
పినపాక నియోజకవర్గానికి రూ.186 కోట్ల హెచ్ఏఎం నిధులు
బీటీ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీగా నిధుల మంజూరు దసరాలోపే పనులు ప్రారంభం.. 15 ఏళ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే పినపాక, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం హెచ్ఏఎం నిధుల నుంచి సుమారు రూ.186 కోట్లు మంజూరైనట్లు పినపాక ఎమ్మెల్యే తెలిపారు. మంజూరైన నిధులతో నియోజకవర్గంలోని అవసరమైన రహదారులు, వంతెనల అభివృద్ధి…
16వ వార్డులో పారిశుధ్యంపై నిర్లక్ష్యం
అభివృద్ధికి నోచుకోని స్థితిలో వార్డు ప్రజలు: పుల్లూరి ప్రశాంత్ జమ్మికుంట, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పారిశుధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి, సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ ఆరోపించారు. వార్డులో వీధులు సక్రమంగా శుభ్రం చేయడం లేదని, రోడ్ల వెంట పెరిగిన పచ్చిక గడ్డిని తొలగించడం లేదని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదని పేర్కొన్నారు.వార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో…
ఏర్గట్లలో నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు మొత్తం 1,419 నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వీటి ద్వారా సుమారు 4,200 కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మండలంలోని ఏర్గట్లకు 550, దోంచందకు 75, గుమ్మిర్యాల్కు 150, తడపకల్కు 190, బట్టాపూర్కు 132,…
ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్లో షార్ట్ సర్క్యూట్
తప్పిన పెను ప్రమాదం.. పలు రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం ఇల్లెందు, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. బస్టాండ్ ఆవరణలోని కంట్రోలర్ గదిలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. అయితే ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కంట్రోలర్ గదిలో ఉన్న పలు రికార్డులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది….
బోధన్లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
లారీ డ్రైవర్పై కేసు నమోదు బోధన్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) బోధన్ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని (TS16UB3690) అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. లారీలో 523 బస్తాల బియ్యం ఉండగా, వాటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు డ్రైవర్ వద్ద లేకపోవడంతో లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సివిల్ సప్లైస్ అధికారులకు…

