Breaking News

భీంగల్‌లో జల శక్తి అభియాన్–జన భాగీదారి కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన “క్యాచ్ ది రైన్” కార్యక్రమంతో భూగర్భ జలాల పరిరక్షణకు పిలుపు సీజనల్ వ్యాధుల నివారణపై మున్సిపల్ కమిషనర్ సూచనలు భీంగల్, జూలై 28: E6 tv NEWS,(T, గంగాధర్)కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “జల శక్తి అభియాన్–జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ…

Read More

తెలంగాణలో 1 లక్ష దాటిన షోరూమ్‌ వెహికల్ రిజిస్ట్రేషన్లు.. ఆర్‌టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే!

హైదరాబాద్: వాహన కొనుగోలుదారులకు రవాణా శాఖ అందించిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ (Dealer Point Registration) విధానం కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో ప్రారంభించిన ఈ సేవల ద్వారా షోరూమ్‌లలోనే పూర్తయిన నాన్-కమర్షియల్ (సొంత) వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 1 లక్ష దాటింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఆర్‌టీఏ (RTA) కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరిగే అవసరం లేకుండా, షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్‌సి…

Read More

తెలంగాణలో పుష్కలంగా ఎరువుల నిల్వలు.. అక్రమార్కులపై కఠిన చర్యలు: కేంద్రమంత్రి జేపీ నడ్డా!

హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో (2026) తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్‌లో వెల్లడించారు. లోక్‌సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఎరువుల నల్లబజారు (బ్లాక్ మార్కెటింగ్), దారి మళ్లింపును అరికట్టేందుకు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (EC Act, 1955) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్…

Read More

తెలంగాణలో మంగళవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో 76.8 మిమీ వర్షపాతం నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 51 మిమీ, కందిలో 42.5 మిమీ, కడ్పాల్‌లో 41.3 మిమీ వర్షపాతం రికార్డైంది. రాబోయే…

Read More

సర్కారీ బడుల చేరికల్లో ‘మంచిర్యాల’ భేష్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం!

మంచిర్యాల: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను (ఎన్‌రోల్‌మెంట్) పెంచే లక్ష్యంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి రికార్డు సృష్టించింది. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 శాతం అదనపు చేరికలు సాధించాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో మంచిర్యాల ఏకంగా 95.72 శాతం ప్రగతిని సాధించింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య జులై 25న విడుదల చేసిన ‘యు-డైస్’ (U-DISE) పోర్టల్ నివేదిక ద్వారా ఈ…

Read More

తెలంగాణలో 1.05 కోట్ల కుటుంబాలకు ‘స్మార్ట్ రేషన్ కార్డ్స్’.. ఆగస్టులో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం!

హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ (QR Code) సదుపాయంతో కూడిన కొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డ్’లను అందుబాటులోకి తేనుంది. ఈ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, జిల్లాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15…

Read More

తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…

Read More

వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…

వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…

Read More

సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో తొలి ‘రోబో టీచర్’: విద్యార్థులకు ఏఐ ఆధారిత పాఠాలు!

హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు కూడా అత్యాధునిక టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గీతానగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) కు ఒక హ్యూమనాయిడ్ రోబో టీచర్ (Humanoid Robot Teacher) ను బహుకరించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన మద్దతుతో ఈ రోబో టీచర్‌ను పాఠశాలకు…

Read More

కేంద్ర నిధులతో రోడ్డు భద్రతకు పెద్దపీట

నిజామాబాద్, జగిత్యాల బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్ల కేటాయింపు లోక్‌సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం నిజామాబాద్, జూలై 23 (E6 tv NEWS): తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్…

Read More