Medak
భీంగల్ కొత్త బస్టాండ్లో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు
బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు సమయాలు తెలియక ప్రయాణికుల అవస్థలు భీంగల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో కంట్రోలర్ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్లో రోజూ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు కంట్రోలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. భీంగల్ కొత్త బస్టాండ్ నుంచి వేల్పూర్,…
బోధన్లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
లారీ డ్రైవర్పై కేసు నమోదు బోధన్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) బోధన్ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని (TS16UB3690) అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. లారీలో 523 బస్తాల బియ్యం ఉండగా, వాటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు డ్రైవర్ వద్ద లేకపోవడంతో లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సివిల్ సప్లైస్ అధికారులకు…
మానవతా దృక్పథం చాటిన ఎస్పీ నరసింహ
MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి రూ.20 వేల ఆర్థిక సహాయం సూర్యాపేట, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదని, పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందు NEETలో మంచి ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందడంతో ఆమెకు తన వంతు సహాయంగా రూ.20…
డాక్టర్ శ్రీనివాసరెడ్డిని సత్కరించిన కొత్వాల
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కొత్తగూడెం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డిని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం వచ్చిన సందర్భంగా శుక్రవారం విద్యానగర్లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ…
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు
ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్న విద్యార్థులు భద్రాచలం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఎకో క్లబ్, ఎన్ఎస్ఎస్, కల్చరల్ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి ప్రతిమలను రూపొందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ.. మట్టి వినాయక ప్రతిమలను వినియోగించడం వల్ల నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు….
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రకృతి సిద్ధమైన విగ్రహాలతో అలరించిన విద్యార్థులు పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పట్టణంలోని ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆకులు, బంకమట్టి, క్లే, ధాన్యాలు, పప్పుధాన్యాలు, గోధుమ పిండితో స్వయంగా తయారు చేసిన వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి మిర్చాల మాట్లాడుతూ వినాయక చవితి జ్ఞానం, శ్రేయస్సు, అభ్యుదయానికి ప్రతీక అన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నహర్తగా వినాయకుడిని…
సాయుధ రైతాంగ పోరాటం అజరామరం
అమరుల ఆశయాల సాధనకు సమరశీల ఉద్యమాలు నిర్మించాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సుజాతనగర్, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమని, నాటి వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో నిర్వహించారు. రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద…
పేదలకు రూ.230కే సిమెంట్
తక్కువ ధరకే స్టీల్ అందించేందుకు చర్యలు: మంత్రి పొంగులేటి హైదరాబాద్,సెప్టెంబర్ 11:(E6tv NEWS). ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేదలకు సిమెంట్ను తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320 వరకు ఉన్న సిమెంట్ బ్యాగును లబ్ధిదారులకు కేవలం రూ.230కే అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్ను కూడా తక్కువ ధరకే…
అటవీ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
అటవీ సంపదతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ నేరాల నియంత్రణ కొత్తగూడెం,సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్రోడ్స్లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్…
హుజూర్నగర్లో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం
నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి హుజూర్నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). హుజూర్నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు….

