
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ వెబ్సైట్ ద్వారా భారీగా ఆదాయం సంపాదించినట్టు కస్టడీ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు.
కామ్కార్డ్ ప్రింట్కు ఒక్క ధర, హెచ్డీ ప్రింట్కు మరో ధరగా వసూలు చేసినట్టు విచారణలో తేలింది. ఒక్క కామ్కార్డ్ ప్రింట్కు రూ.100, హెచ్డీ ప్రింట్కు రూ.200 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రతినెలా బ్యాంక్ ఖాతాల్లోకి సగటున రూ.13.40 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా రూ.1.58 కోట్ల ఆదాయం వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ డబ్బులో కొంత మొత్తాన్ని రోజువారీ ఖర్చులకు, మరికొంతను లావాదేవీల ద్వారా ఇతరులకు పంపినట్టు కస్టడీ రిపోర్ట్లో పేర్కొన్నారు. మొత్తం 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని పోలీసుల కస్టడీలో విచారించనున్నట్టు తెలిపారు.
ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

