జమ్మూకశ్మీర్లో ఘోరం: అనంతనాగ్లో ఉగ్రవాదుల కాల్పులు.. అమర్నాథ్ యాత్ర విధుల్లో ఉన్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ బలి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. అనంతనాగ్ పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే లాల్ చౌక్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు విధుల్లో ఉన్న పోలీసులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అమర్నాథ్ యాత్ర విధుల్లో ఉండగా దారుణం ప్రస్తుతం కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో భాగంగా మోహరించిన పోలీసు బృందంపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆశిక్ హుస్సేన్ ఖురేషి (35) అనే హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా…

