Breaking News

తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిజాయితీ: భక్తుడికి 100 గ్రాముల బంగారు ఆభరణాల సంచి అందజేత!

తిరుపతి:
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు పొరపాటున వదిలేసిన 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న సంచిని టీటీడీ (TTD) విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది భద్రంగా అతనికి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఘటన
అందిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11:35 గంటల ప్రాంతంలో అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సెక్యూరిటీ స్క్రీనింగ్ జరుగుతుండగా, ఒక భక్తుడు తన బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయి వెళ్లాడు. గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
సీసీటీవీల ఆధారంగా యజమాని గుర్తింపు
అందులోని వస్తువులను తనిఖీ చేయగా సుమారు 100 గ్రాముల మేర బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, సదరు భక్తుడిని హైదరాబాద్‌కు చెందిన మహేష్‌గా నిర్ధారించారు. అప్పటికే తన బ్యాగ్ పోయిందన్న విషయాన్ని కూడా గమనించని ఆ భక్తుడిని విజిలెన్స్ సిబ్బంది వెంటనే సంప్రదించి సమాచారం అందించారు.
సరియైన గుర్తింపు కార్డులు సరిచూసుకున్న అనంతరం, మంగళవారం ఆ బంగారు నగలున్న బ్యాగ్‌ను మహేష్‌కు భద్రంగా అప్పగించారు. ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి, విజిలెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తికి, నిజాయితీకి భక్తుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *