Breaking News

హైదరాబాద్‌లో దారుణం: ఎయిర్‌లైన్ సిబ్బందిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!

హైదరాబాద్:
రాజధాని నగరంలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) విధులకు వెళ్తున్న ఒక ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ సభ్యురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి 23 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్జన ప్రదేశానికి తరలించి దారుణం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 20వ తేదీ రాత్రి బాధితురాలు విమానాశ్రయంలో విధులకు హాజరయ్యేందుకు క్యాబ్ ఎక్కింది. ఎయిర్‌పోర్టుకు నేరుగా వెళ్లకుండా, డ్రైవర్ వాహనాన్ని దారి మళ్లించి శంషాబాద్ శివార్లలోని నిర్మాణంలో ఉన్న ఒక పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్
బాధితురాలు ఆ తర్వాత ఆర్‌జీఐఏ పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు.
సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక ఆధారాల సహాయంతో నిందితుడిని ప్రశాంత్ కుమార్ (23)గా గుర్తించిన పోలీసులు మంగళవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, అతనిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *