నగర కాంగ్రెస్లో ధర్మపురి సంజయ్కు కీలక పదవి ఎప్పుడు..?
బీసీ నేతకు ప్రాధాన్యం దక్కడం లేదా..?
సీనియర్ నాయకుడు మౌనం వెనుక వ్యూహమేంటి..?
నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
E6 న్యూస్ స్పెషల్ స్టోరీ | నిజామాబాద్ (శివ ఠాకూర్)
పార్టీ కోసం కష్టపడుతున్నారు… ప్రజల మధ్యే ఉంటున్నారు… కాంగ్రెస్ కార్యక్రమమంటే ముందుంటున్నారు… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు… అయినా కీలక పదవి విషయంలో మాత్రం ఇంకా నిరీక్షణేనా..?
నిజామాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు నగర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఒకప్పుడు నగర ప్రథమ పౌరుడిగా పనిచేసిన అనుభవం… ప్రజలతో నేరుగా సంబంధాలు… బీసీ సామాజిక వర్గంలో పరిచయాలు… నగర రాజకీయాలపై పట్టు ఉన్న నాయకుడిగా ధర్మపురి సంజయ్కు గుర్తింపు ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో సంజయ్ చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ, ప్రతిపక్ష విమర్శలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై బహిరంగంగా విశ్వాసం ప్రకటిస్తూ కాంగ్రెస్కు అండగా నిలుస్తున్నారు.
మరి ఇంత చేస్తున్న సంజయ్కు కీలక పదవి ఎందుకు దక్కడం లేదు..?
ఇదే ఇప్పుడు ఆయన అనుచరులతో పాటు నగర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న.
బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతోందా..?
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, బీసీలకు ప్రాధాన్యం అంటూ పదేపదే చెబుతోంది. ఈ నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ధర్మపురి సంజయ్కు కీలక బాధ్యత అప్పగించాలన్న డిమాండ్ ఆయన వర్గీయుల నుంచి వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ నగరంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న నాయకుల్లో సంజయ్ ఒకరని ఆయన అనుచరులు అంటున్నారు. గత రాజకీయ అనుభవం, మాజీ మేయర్గా పనిచేసిన నేపథ్యం ఉన్నప్పటికీ ఆయన సేవలను పార్టీ నాయకత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోందా..? లేదా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పదవుల పంపకంలో సామాజిక సమీకరణాలే అడ్డుగా మారాయా..?
జిల్లా కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాల ప్రభావం ఉందా..?
లేక సరైన సమయం కోసం అధిష్ఠానం ఎదురుచూస్తోందా..?
ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది.
సంజయ్ మౌనం వెనుక కారణమేంటి..?
అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది.
తనకు పదవి ఇవ్వాలంటూ ధర్మపురి సంజయ్ బహిరంగంగా ఎక్కడా డిమాండ్ చేసినట్లు కనిపించడం లేదు. అసంతృప్తిని బయటపెట్టకుండా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
మరి సంజయ్ మౌనం పార్టీపై విధేయతకు నిదర్శనమా..?
అధిష్ఠానం నుంచి ఏదైనా భరోసా ఉందా..?
లేక రాజకీయంగా సరైన సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారా..?
ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
పదవి లేకున్నా.. ప్రజల మధ్యే..!
“పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తా” అంటూ ధర్మపురి సంజయ్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆయన అనుచరుల ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న నాయకుడికి ఇంకా ఎంతకాలం నిరీక్షణ..?
బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేతకు కీలక పదవి ఇచ్చి కాంగ్రెస్ గౌరవిస్తుందా..?
రాబోయే పదవుల భర్తీలో ధర్మపురి సంజయ్ పేరు తెరపైకి వస్తుందా..?
ఇప్పుడు నిజామాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.
ధర్మపురి సంజయ్ మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… కానీ ఆయన మౌనం వెనుక రాజకీయ వ్యూహం ఉందా..? పార్టీ అధిష్ఠానం నుంచి భరోసా ఉందా..? అన్నది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తికరమే.
పార్టీ కోసం కష్టం చేస్తున్న బీసీ నేతకు కాంగ్రెస్ ఎలాంటి గుర్తింపు ఇస్తుందో… వేచి చూడాల్సిందే..!
E6 NEWS SPECIAL STORY
ఉమ్మడి జిల్లా ప్రతినిధి శివ ఠాకూర్.


