Breaking News

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బోణి: పతకం ఖాయం చేసిన లవ్లీనా బొర్గోహైన్!

గ్లాస్గో :

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌ తొలి పతకాన్ని ఖరారు చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది.

డ్రా తో కలసివచ్చిన అదృష్టం

కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే ఉన్న డ్రాలో లవ్లీనాకు మొదటి రౌండ్‌లో ‘బై’ (Bye) లభించింది. దీనితో ఆమె నేరుగా టాప్-4 (సెమీఫైనల్స్)కి ప్రవేశించింది. కామన్వెల్త్ బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీస్ చేరిన బాక్సర్లకు పతకం ఖాయం కానుంది.

  • సెమీఫైనల్ పోరు: జూలై 31న జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా తువాలు (Tuvalu) దేశానికి చెందిన ‘టికెబిపి తాఫాకి’తో తలపడనుంది.
  • ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లవ్లీనా గోల్డ్ మెడల్ బౌట్‌కు (ఫైనల్‌కు) అర్హత సాధిస్తుంది.

కెరీర్‌లో మిగిలివున్న ఏకైక పతకం ఇదే!

28 ఏళ్ల అసెం బాక్సర్ లవ్లీనా సుదీర్ఘ అద్భుత కెరీర్‌లో కామన్వెల్త్ పతకం సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఆసియా గేమ్స్, ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన లవ్లీనా.. ఇప్పుడు కామన్వెల్త్‌లో గ్యారెంటీ అయిన కాంస్య పతకాన్ని పసిడిగా మార్చుకోవడమే లక్ష్యంగా రింగ్‌లోకి దిగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *