తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిజాయితీ: భక్తుడికి 100 గ్రాముల బంగారు ఆభరణాల సంచి అందజేత!
తిరుపతి:తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు పొరపాటున వదిలేసిన 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న సంచిని టీటీడీ (TTD) విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది భద్రంగా అతనికి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఘటనఅందిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11:35 గంటల ప్రాంతంలో అలిపిరి చెక్పాయింట్ వద్ద సెక్యూరిటీ స్క్రీనింగ్ జరుగుతుండగా, ఒక భక్తుడు తన బ్యాగ్ను అక్కడే మరిచిపోయి వెళ్లాడు. గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఆ…

