Breaking News

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

భీంగల్, జూలై 27: E6 tv NEWS, (T, గంగాధర్.)

భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ (తండ్రి: నాగయ్య) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు.విషయాన్ని పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుడికి రూ.3,00,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేయించారు. సంబంధిత ఎల్‌ఓసీ పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, పేద మరియు నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సకు దూరం కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ఈ పథకం ద్వారా సహాయం అందేలా తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయడంపై చిలివేరి నాగేష్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ముత్యాల సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *