గీత దాటితే కటకటాలే

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి…

Read More

పద్ధతి మార్చుకోని రాజేంద్రప్రసాద్… మళ్లీ వివాదాల దారిలో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దశాబ్దాలుగా వినోదానికి చిరునామాగా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్, గత కొంతకాలంగా తన ప్రవర్తనతో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.యువకుడిగా ఉన్నప్పుడు హుందాతనం, పద్ధతి, మాట్లాడే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. అయితే తాజాగా ఆయన మాట్లాడే విధానం, స్టేజ్‌పై ప్రవర్తన — పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఇటీవల నితిన్–శ్రీలీల జంటగా నటించిన “రాబిన్‌హుడ్” ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి.ఆ సినిమా స్పెషల్…

Read More

నెల్లూరు జిల్లా – వారసత్వ భూమిపై వివాదం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య తన కుటుంబానికి చెందిన వారసత్వ భూమిపై ఇతరులు ఆక్రమణ యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి పేరున సర్వే నంబర్ 102/2లో 2.50 సెంట్ల భూమి ఉందని, తల్లిదండ్రుల మరణానంతరం అది వారసులైన తమకే చెందాలని తెలిపారు. అయితే గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మ తమ పొలంపై హక్కులు ఉన్నట్లుగా చూపుతూ, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దొంగతనంగా తయారు చేశారని ఆయన ఆరోపించారు….

Read More

ఇండియా కూటమిలో చీలిక.. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటరిపోరు..!

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మహారాష్ట్రలో ఇండియా కూటమికి బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ తమ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్.. అధిష్ఠానానికి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలిపారు. దానికి అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ముంబైతో పాటు…

Read More

బీఆర్ఎస్: సోషల్‌మీడియాలో హైప్ – గ్రౌండ్‌లో డీలా!

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కాసేపటి వరకూ సోషల్ మీడియాలో హడావుడి చేసిన బీఆర్ఎస్ సైనికులు తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, రిగ్గింగ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. ఆ పార్టీ బలం, బలహీనత సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం ఉద్ధృతంగా చేయడమే. కానీ గ్రౌండ్ లో మాత్రం ఆ ప్రచారం ప్రభావం ఎంత అన్నది మాత్రం వారు అర్థం చేసుకోలేకయారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను…

Read More

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం చేయూత..

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇళ్లకు కేంద్రం తన వాటాను అందించనుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున నిధులు సమకూరనున్నాయి. రాష్ట్రం ఆశించిన స్థాయిలో కాకపోయినా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 4.13 లక్షల…

Read More

200 ఐఈడీ బాంబులతో దేశవ్యాప్తంగా పేలుళ్లు… ఉగ్రవాదుల కుట్ర!

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబయి తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,…

Read More

అణ్వస్త్ర నిల్వల్లో భారత్ ముందంజ

ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పోటీ కొత్త ఆందోళనలకు తెరలేపుతున్న తరుణంలో, దక్షిణాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అణు వార్‌హెడ్‌ల సమీకరణలో భారత్ తన పొరుగు దేశం పాకిస్థాన్‌ను అధిగమించింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటుండగా, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య ఉన్న కీలక అణు నియంత్రణ ఒప్పందం ముగింపు దశకు రావడం ప్రపంచ భద్రతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) తాజా అంచనాల ప్రకారం, 2025…

Read More

పిన్నమనేని సాయి బాబా మృతి… కన్నీటి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

ఈరోజు స్వర్గస్తులైన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పిన్నమనేని సాయి బాబా గారి పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పడి గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీపతి…

Read More

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని…

Read More