Breaking News

మున్నూరుకాపు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ప్రత్యేక శిబిరం.

400 ఓటరు దరఖాస్తుల పూరణ – శిబిరాన్ని సందర్శించిన తహసీల్దార్, సూపర్‌వైజర్లు. ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).ముధోల్ మండల కేంద్రంలోని జీఎం ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మున్నూరుకాపు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో భాగంగా ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ ఓటరు దరఖాస్తులను తీసుకువచ్చి బీఎల్‌వోల సమక్షంలో యువ వాలంటీర్ల సహాయంతో సుమారు 400 ఫారాలను పూర్తి చేశారు….

Read More

SIR ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

అపోహలు తొలగించడంలో BLAలదే కీలక పాత్ర: ఆర్మూర్ సదస్సులో పిలుపుఆర్మూర్ (నందిపేట్), జూన్ 29 (E6TV వెబ్ న్యూస్):ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో ఉన్న అపోహలను, సందేహాలను తొలగించడంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఫ్రంట్‌లైన్ వారియర్స్ లాగా చొరవ చూపాలని ఆయన స్పష్టం…

Read More

ఇందిరమ్మ ఇళ్ల ఇసుక అక్రమ దారి మళ్లింపు కేసులో చర్య

ఇసుకను అక్రమంగా దారి మళ్లించిన మెండోరా ఆర్.ఐ సస్పెన్షన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో ఇసుక మళ్లించినట్లు ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు మైనింగ్ ఏడీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట కేటాయించిన ఇసుకను అక్రమంగా దారి మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) సదానంద్‌ను సస్పెండ్…

Read More

“సుపరిపాలనకు
“సుపరిపాలనకు రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

అయోధ్య, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. రాముడి పాలన, అంటే “రామరాజ్యం,” సుపరిపాలనకు ఒక బెంచ్‌మార్క్ అని ఆయన పేర్కొన్నారు.

రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాముడి పాటించిన విలువలు ఎప్పటికీ ప్రేరణగా నిలిచే విధంగా ఉన్నాయని, వాటిని ఆధునిక పాలనకు మార్గదర్శకంగా తీసుకోవచ్చని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మందిరం అనేక వివాదాల తర్వాత నిర్మించబడినప్పటికీ, ప్రజల కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఆలయం నిర్మాణంతో పాటు యూపీ ప్రభుత్వం సుపరిపాలనలో మంచి పని చేస్తోందని కూడా ఆయన ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, అయోధ్య రామ మందిరం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యం సాధించడంలో యూపీ, బీహార్ కీలక పాత్రలు పోషిస్తాయని అన్నారు.

చంద్రబాబు ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) రాసినట్టుగా, “శ్రీరాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ప్రేరణ ఇస్తాయి. రాముని విలువలు సుపరిపాలనకు మార్గదర్శకంగా ఉంటాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు కొత్త శక్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు.రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

Read More

తెలంగాణలో 1.05 కోట్ల కుటుంబాలకు ‘స్మార్ట్ రేషన్ కార్డ్స్’.. ఆగస్టులో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం!

హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ (QR Code) సదుపాయంతో కూడిన కొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డ్’లను అందుబాటులోకి తేనుంది. ఈ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, జిల్లాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15…

Read More

సంస్కరణల సారథికి సత్కారం: మంత్రులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. పనుల్లో స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం!

అమరావతి (E6TV ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో, అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల సెక్రటరీలు మరియు హెచ్‌వోడీలకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు సీఎం పనితీరును, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని కొనియాడారు.మంత్రుల ప్రసంగాల్లోని కీలక అంశాలు:పరుగులెత్తిస్తున్న చంద్రబాబు – మంత్రి టీజీ భరత్:పరిశ్రమల స్థాపన విషయంలో సీఎం మమ్మల్ని…

Read More

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి: ఇందిరా పార్క్ వద్ద ఎస్‌కెఎం భారీ ధర్నా!

హైదరాబాద్: అమెరికా-భారత్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగం పాలిట శాపంగా మారిందని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నేతలు మండిపడ్డారు. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.ముఖ్య అంశాలు:రైతుల జీవితాల్లో చీకటి: కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కుదుర్చుకున్న ఈ ఒప్పందం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి, అన్నదాతల జీవితాలు అంధకారమవుతాయని నేతలు ఆందోళన…

Read More

భారతదేశ భవిష్యత్తు శిల్పులు జనగణన యజ్ఞంలో మీ సేవలకు అపురూప గౌరవం

భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే మహాత్కార్యం మొదలైంది దేశ సరిహద్దులు దాటి ప్రతి ఇంటి గడపను తడుతూ కోట్లాది మంది భారతీయుల ఆశలను రికార్డు చేసే జనగణన ప్రక్రియలో పాల్గొనడం కేవలం విధి మాత్రమే కాదు అదొక దేశ సేవ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములయ్యే ప్రభుత్వ యోధులకు ప్రభుత్వం అందిస్తున్న రాజ మర్యాదలు మరియు ప్రోత్సాహకాలు ఇవేశ్రమకు తగిన గౌరవం ఆర్థిక ప్రయోజనాలుమీ కష్టానికి ప్రతిఫలం కేవలం గుర్తింపు మాత్రమే కాదు ఆకర్షణీయమైన గౌరవ వేతనం కూడాగౌరవ…

Read More

SIR ప్రక్రియలు భాగస్వాములైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా, ఆర్, భూపతిరెడ్డి.

ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేసిన ఎమ్మార్వో, బీఎల్‌వోలు ఏ ఒక్క ఓటు పోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి : ఎమ్మెల్యే నిజామాబాద్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో వినయ్ సాగర్‌తో పాటు బీఎల్‌వోలు రజిత, లావణ్య, నరేష్‌లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్యూమరేషన్…

Read More

పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…

Read More