E6TV న్యూస్ : జగిత్యాల
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. మోతె రోడ్డులో నిర్వహించనున్న ఈ సభకు దాదాపు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లు, పార్కింగ్, భద్రత వంటి అంశాలపై ఆయన అధికారులతో మరియు పార్టీ శ్రేణులతో చర్చించారు.
ఇదిలా ఉండగా, ఈ సభలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. దీంతో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగింది.
జగిత్యాలలో కేసీఆర్ భారీ సభకు సన్నాహాలు… సభా స్థలాన్ని పరిశీలించిన జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుazలు

