You Tube
You Tube Channel
తెలంగాణలో చెదురుమదురు జల్లులు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
నిజామాబాద్ జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్రంలో గత 24 గంటలుగా పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విస్తృతంగా కాకుండా పరిమిత ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. టీజీడీపీఎస్ (TGDPS) వివరాల ప్రకారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో 17 మిల్లీమీటర్లు, నారాయణపేట…
మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్తోనే పూర్తి చేస్తాం
రైతులకు శాశ్వత సాగునీరే లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు డిజైన్ ఆధారంగానే పూర్తి చేసి రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.గురువారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని కొండెం–మంచిప్ప…
బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…
బాజిరెడ్డి గోవర్ధన్కు ప్రజలే గుణపాఠం చెబుతారు
మహాధర్నా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటు: కాంగ్రెస్ నాయకుడు కొట్టం మనోహర్ కోటగిరి, జూలై 16 : E6 న్యూస్ అశోక్ కాంబ్లేమాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పదేళ్ల పాలనలో బాన్సువాడ నియోజకవర్గం, కోటగిరి మండల ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ ప్రశ్నించారు. మహాధర్నా పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆయన అన్నారు.కోటగిరి మండల కేంద్రంలో…
నిజాంసాగర్ కు వెంటనే నీరు అందించాలి
హల్దీ వాగు ద్వారా నీటి విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి కోటగిరిలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మహాధర్నా.. అధికారులకు వినతిపత్రం కోటగిరి, జూలై 15: ఈ సిక్స్ న్యూస్ అశోక్ కాంబ్లేవర్షాభావ పరిస్థితులతో నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వేలాది ఎకరాల పంటలు ఎండుముఖం పడుతున్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే…
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యం
PM RAHAT, PM RAH-VEER పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి : పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్లో సకాలంలో వైద్యసేవలు అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం PM RAHAT మరియు PM RAH-VEER పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…
ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
వసతులు మేము కల్పిస్తాం.. మెరుగైన వైద్యం మీరందించండి : ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జీజీహెచ్ అభివృద్ధి సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. కలెక్టర్ ఇలా…
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి : ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం.. రూ.5 వేల నగదు ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు…
బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూరు, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బీజేపీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒడ్డెట్పల్లి, అమ్రాద్, బోర్గం, మాణిక్బండారు, గొట్టుముక్కల, మంతాపూర్ గ్రామాల్లో మరణించిన బీజేపీ…
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జూలై 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపు ఇందూరు జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్లోని ధర్నా చౌక్ వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్…

