Breaking News

ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్‌

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. రాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన దువ్వాడ, ఈ కుట్ర వెనుక వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని అన్నారు. హత్య కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Read More

అదిత్య-L1 డేటా విశ్లేషణకు శాస్త్రవేత్తలకు ISRO ఆహ్వానం.

భారతదేశ తొలి సౌర పరిశోధనా మిషన్ అదిత్య-L1 రెండో వార్షికోత్సవం సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊపునిచ్చే కీలక ప్రకటన చేసింది ఇస్రో. అదిత్య-L1 మిషన్ ద్వారా సేకరించిన డేటా విశ్లేషణ కోసం భారతీయ శాస్త్రవేత్తల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ (AO) విడుదల చేసింది.ప్రస్తుతం అదిత్య-L1 మిషన్‌కు సంబంధించి 23 టెరాబైట్లకు పైగా డేటా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉందని, ఇప్పటికే అనేక కీలక శాస్త్రీయ ఫలితాలు అంతర్జాతీయ పియర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని…

Read More

మహిళా సంఘాలకు శుభవార్త..

మహిళా సంఘాలకు శుభవార్త.. కొత్త పథకం ప్రారంభం.. 70 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా డబ్బులు. కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా 70 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు/ఆవులు అందిస్తారు. రాష్ట్రంలో పాల కొరత తీర్చడంతో పాటు మహిళా సాధికారత,…

Read More
ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ | ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ అనుమానాస్పద స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, రూం బయట ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడని డీజీపీ వెల్లడించారు. గన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన నేపథ్యంలో, పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు పోలీసులు గట్టిగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. “రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే అక్కడున్న ప్రజల ప్రాణాలు పోయే…

Read More

ఆళ్లకు జగన్ షాక్..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం వెంటాడుతోంది. కేసులతోపాటు అరెస్టులు జరుగుతుండడంతో దూకుడు కలిగిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడిపోతున్నారు. వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి.. ఒక ఆట ఆడేసుకున్న నేతలు సైతం ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. అటువంటి వారిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి. ఈ ఇద్దరు…

Read More

హైదరాబాద్ లో మంచినీళ్లు, ప్రసాదాల్లో విషం.. బయటపడ్డ భయంకర ఉగ్రకుట్ర

దేశంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ లే వేశారు. దీని కోసం పెద్ద నగరాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో పేలిన కారు బాంబే ఇందుకు నిదర్శనం.దీని తరువాత ఫరీదాబాద్ లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడడం ద్వారా మరిన్ని ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఫ్లానే బయటపడింది.Voice overతాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఒక హైదరాబాద్ డాక్టర్ సయ్యద్…

Read More

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి…

Read More

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం..

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరయ్యారు.యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు “తెలుగు జాతికి తిరుగే లేదు… ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలుస్తుంది” అని సీఎం చంద్రబాబు…

Read More

మందుబాబులూ జాగ్రత్త… సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇకపై ఎవరి పేర్లు, పరిచయాలు పనిచేయవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వెంటనే కొందరు “మా డాడీ ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా?”, “నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?” అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బెదిరింపులకు, రికమండేషన్లకు తన దగ్గర ఎలాంటి స్థానం లేదని సజ్జనార్ తేల్చిచెప్పారు….

Read More