Breaking News

జగన్ మాటలపై బాలయ్య రియాక్షన్..

E6TV News : నందమూరి బాలకృష్ణ గురించి చెప్పనవసరం లేదు. ఆయన తన మనసులో ఉన్న మాటనే చెబుతారు. ఏది ఉంచుకోరు కూడా. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోనే ఉతికి ఆరేశారు. వాడు సైకో గాడు అంటూ చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడారు. సినీ పరిశ్రమను అగౌరవపరిచారు అంటూ చెప్పే క్రమంలో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో.. జగన్మోహన్ రెడ్డి పై బాలకృష్ణ కామెంట్స్ పక్కకు వెళ్లిపోయాయి. అయితే బాలకృష్ణను మాత్రం జగన్మోహన్ రెడ్డి మరిచిపోలేకపోతున్నారు. తనను…

Read More

దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం: కురసాల కన్నబాబు ఆరోపణలు

అమరావతి:చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అడ్డగోలు ఎదురుదాడులకు దిగుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఊరూరా, వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం ఊపిరి సలపనట్టుగా మారిందని ఆయన అన్నారు.ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి చంద్రబాబు ప్రభుత్వాన్ని కలవరపెడుతోందని, దీనికి నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలేనని కన్నబాబు పేర్కొన్నారు. మరోవైపు వైఎస్సార్…

Read More

వరంగల్‌లో ఉబర్ బైక్ (Uber Bike) సేవలు ప్రారంభం.. తొలి రైడ్ ఉచితం!

వరంగల్ / హైదరాబాద్: దేశీయ ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్ ‘ఉబర్’ (Uber) ఇప్పుడు చారిత్రక నగరమైన వరంగల్‌లో తన ‘ఉబర్ బైక్’ సేవలను అధికారికంగా ప్రారంభించింది. నగరవాసులకు మరింత వేగవంతమైన, చౌకైన మరియు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయని సంస్థ వెల్లడించింది. ఉద్యోగాలు, చదువులు, దైనందిన అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ బైక్ ట్యాక్సీలు ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటు, స్థానిక డ్రైవర్లకు అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్య విశేషాలు…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి,లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్, జూలై 28: (E6 tv NEWS) రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్…

Read More

బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…

Read More

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు… వాడి గ్రామానికి ఇంకా రోడ్డు లేదు!

జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ “మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి): కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని,…

Read More

కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం

బాసర జూలై 2: E6 న్యూస్. బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల మిశ్రమ బంగారం,…

Read More

ప్రభుత్వ భూమి కబ్జాయత్నంపై గ్రామస్తుల ఆందోళన, పోతంగల్ హంగర్గా ఫారంలో ఉద్రిక్తత.

పొతంగల్, జూలై 2:(E6 న్యూస్: ఔరాద్ అశోక్) నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని హంగార్గా ఫారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం జరిగిందంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఏకమై నిలిచామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గైక్వాడ్ భీమ్రావు అనే వ్యక్తి తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నించి ఆక్రమించుకునే ప్రయత్నం…

Read More

మెగా డీఎస్సీ-2025 అక్రమాలపై పార్లమెంట్‌లో రచ్చ: స్వతంత్ర విచారణకు వైఎస్సార్‌సీపీ ఎంపీల డిమాండ్!

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన ‘మెగా డీఎస్సీ-2025’ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా నిరసన గళం విప్పారు. ఈ వ్యవహారంపై అత్యవసర చర్చ జరిపాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్‌లో నోటీసులు – నోరు విప్పిన ఎంపీలు డీఎస్సీపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఇవే: సీబీఐ (CBI) విచారణకు వైఎస్ జగన్ డిమాండ్ ఇప్పటికే…

Read More