Breaking News

తెలంగాణకు రేవంత్ రెడ్డే సరైన నాయకుడు

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదు సబ్బండ వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే మాజీ మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ జులై 10: E6 న్యూస్, నిజామాబాద్(శివ ఠాకూర్)తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి ఆయనే సరైన నాయకుడని మాజీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మున్నూరు కాపు జిల్లా…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

భీంగల్, జూలై 27: E6 tv NEWS, (T, గంగాధర్.) భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ (తండ్రి: నాగయ్య) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు.విషయాన్ని పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుడికి రూ.3,00,000 విలువైన…

Read More

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…

Read More

విద్యార్థుల్లో విద్యాసామర్ధ్యాల పరిశీలన

లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలి పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించిన తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ ముధోల్ జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను…

Read More

నర్సాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్) కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోడెండ్ల సంజీవ్ కుమారుడికి ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే కువైట్ గంగాధర్ కుమార్తె ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల శేఖర్ తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి…

Read More

ఇందిరమ్మ ఇళ్ల ఇసుక అక్రమ దారి మళ్లింపు కేసులో చర్య

ఇసుకను అక్రమంగా దారి మళ్లించిన మెండోరా ఆర్.ఐ సస్పెన్షన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో ఇసుక మళ్లించినట్లు ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు మైనింగ్ ఏడీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట కేటాయించిన ఇసుకను అక్రమంగా దారి మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) సదానంద్‌ను సస్పెండ్…

Read More

బీజేపీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరిన తూంపల్లి సర్పంచ్ రాజేందర్

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సర్పంచ్‌తో పాటు పలువురు కార్యకర్తలు నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామ సర్పంచ్ జింక రాజేందర్, పలువురు కార్యకర్తలతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో…

Read More

క్షేత్ర సందర్శనతో విద్యార్థులకు పోస్టల్ సేవలపై అవగాహన

ముధోల్ పోస్టాఫీసును సందర్శించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ 4వ తరగతి విద్యార్థులు ముధోల్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో బోధించాలనే ఉద్దేశ్యంతో ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు శనివారం స్థానిక పోస్టాఫీసును క్షేత్రస్థాయిలో సందర్శించారు. విజ్ఞానశాస్త్రం బోధనలో భాగంగా నిర్వహించిన ఈ విద్యా పర్యటనలో విద్యార్థులు పోస్టాఫీసు పనితీరు, ప్రజలకు అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను…

Read More

జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి: ఎంపీ ధర్మపురి అరవింద్.

జగిత్యాల, జూలై 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. అయితే, కేంద్ర విద్యాలయ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. కేంద్ర విద్యాలయ సంఘం (కేవీఎస్) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే అయినప్పటికీ, మెట్రో…

Read More

నిజామాబాద్‌లో నూతన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఘన సన్మానం.

నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఇటీవల పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన డి. అరుణ్ కుమార్ ను టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ ప్రతినిధులు, శాఖా సిబ్బంది ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌లోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ కేంద్ర ఉపాధ్యక్షులు కె. అరుణ్ కుమార్, డీపీఈఓ (DPEO) కార్యాలయ ఏఏఓ వి. నరసయ్య పాల్గొని నూతన అసిస్టెంట్…

Read More

#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత

#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిమాండ్** జాబ్ క్యాలెండర్ అమలు చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి * **దిల్‌సుఖ్‌నగర్ నిరుద్యోగుల ధర్నాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక**దిల్‌సుఖ్‌నగర్, జూన్ 29:**నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగుల ధర్నాలో ఆమె స్వయంగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా…

Read More

అమెరికాలో అదరగొట్టిన తెలుగు బాలిక: కూచిపూడి నృత్యంతో అలరించిన జయరెడ్డి!

హౌస్టన్ (టెక్సాస్):విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హౌస్టన్ వేదికగా నిర్వహించిన భారతదేశ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక జయరెడ్డి తన అద్భుత కూచిపూడి నృత్య ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి కుమార్తె అయిన జయరెడ్డి, ఇంత చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో ఎంతో చక్కటి ప్రతిభను కనబరిచింది. ఆమె…

Read More

చాగంటి రాకతో రూరల్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం

ప్రవచన చక్రవర్తికి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హృదయపూర్వక స్వాగతం నిజామాబాద్, జూలై 23: E6 tv NEWS (శివ ఠాకూర్). ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ నెల 24న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి విచ్చేయనున్న సందర్భంగా ఆయనకు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న “గోమాత వైభవం” కార్యక్రమానికి ముఖ్య…

Read More

నందిపేట్‌లో జర్నలిజం ముసుగులో పర్సంటేజీల దందా..?

విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఏజెన్సీల నుంచి శాతం % వసూళ్ల ఆరోపణలు నందిపేట్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ నందిపేట్ మండలంలో ఓ ప్రముఖ పత్రికలో  సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేఖరిపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, మండల కేంద్రంలో ఉన్న ప్రజల వద్ద నుండి  పర్సంటేజీలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. స్వతహాగా నందిపేట్ నివాసి అయిన విలేకరి నందిపేట్ మండల కేంద్రం నుండి నిజామాబాద్ నగరానికి, నగరం నుండి నందిపేట్ మండల కేంద్రానికి ప్రతిరోజూ…

Read More

భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం

భీంగల్, జూలై 27: (E6 tv NEWS, T, గంగాధర్) భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు, కుటుంబానికి అండగా ఉంటామని…

Read More

ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్.

జులై 03: E6 న్యూస్ నిజామాబాద్ (శివ ఠాకూర్).  ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సోలమన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్‌తో పాటు నిజామాబాద్–2 డిపోను సందర్శించిన ఆయన, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్‌లో మొత్తం 89 ఎలక్ట్రిక్ బస్సులు…

Read More

ఏపీ కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ (SEC)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.నీలం సాహ్ని పదవీకాలం గత నెల 31తో ముగియడంతో, ఖాళీగా ఉన్న ఈ కీలక స్థానంలో పునేఠాను ప్రభుత్వం నియమించింది.అనిల్ చంద్ర పునేఠా ప్రస్థానం:అనుభవం: పునేఠా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.గత పదవులు: 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో…

Read More

తానూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం

రూ.98.12 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తానూర్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నాబార్డ్ (NABARD) నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులను, అలాగే రూ.42.12 లక్షలతో ఏర్పాటు చేసిన…

Read More

కోతుల బెడదకు చెక్ పెట్టిన యువకుడు

చింపాంజీ వేషంతో పంటలు, ఇళ్లను కాపాడుతున్న బాలాజీ నిర్మల్, జూలై 28: E6 tv NEWS(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదకు ఓ యువకుడు వినూత్న పరిష్కారం చూపి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చింపాంజీ వేషం ధరించి కోతులను తరిమేస్తూ రైతులకు, గ్రామస్తులకు అండగా నిలుస్తున్నాడు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉండటంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు….

Read More

రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలభిషేకం.

జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.6 వేల…

Read More

లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరులో “గోమాత వైభవం” ప్రవచనం భక్తులను అలరించింది చాగంటి సేవలు సనాతన ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయం: ఎమ్మెల్యే గోవు మహిమను, భారతీయ సంస్కృతి విలువలను అద్భుతంగా వివరించిన చాగంటి ఇందూరు, జులై 24: E6 tv NEWS (శివ ఠాకూర్). లక్షలాది మంది ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ సనాతన ధర్మ విలువలను సమాజానికి చేరవేస్తున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కొనియాడారు.ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా…

Read More

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు… వాడి గ్రామానికి ఇంకా రోడ్డు లేదు!

జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ “మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి): కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని,…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన కులస్పూర్ గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ రెడ్డి

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ మోపాల్ మండలంలోని కులస్పూర్ గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరగా, ఎమ్మెల్యే ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విశ్వసించి పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో…

Read More

నిజామాబాద్ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి ఇందల్వాయి, జానకంపేట ఆర్‌ఓబీల మంజూరుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు న్యూఢిల్లీ/నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న,…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

తిర్మాన్‌పల్లి మైనారిటీ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షల నిధులు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS (శివ ఠాకూర్). అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయగా, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను…

Read More

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు

హైదరాబాద్: పవిత్రమైన బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన గౌతమ బుద్ధుని బోధనల ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు.ముఖ్యమంత్రి సందేశంలోని ముఖ్యాంశాలు:మానవాళికి మార్గదర్శనం: బుద్ధ భగవానుడు అందించిన కరుణ, దయ, సహనం, మరియు శాంతి మార్గాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని సీఎం పేర్కొన్నారు.అమూల్యమైన బోధనలు: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధుని బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని కొనియాడారు.సమ్యక్ జీవనం:…

Read More

కేంద్ర నిధులతో రోడ్డు భద్రతకు పెద్దపీట

నిజామాబాద్, జగిత్యాల బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్ల కేటాయింపు లోక్‌సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం నిజామాబాద్, జూలై 23 (E6 tv NEWS): తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్…

Read More

రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం.. మెరుగైన సౌకర్యాలు కల్పించాలి పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. పేద విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యత పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. శుక్రవారం భైంసాలోని…

Read More

దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

23 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా జూలై 10: E6 న్యూస్: తిరుపతి గౌడ్ అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Read More

పెళ్లి చేసుకుంటానని 9 ఏళ్లు నమ్మించి మోసం చేశాడు, సర్పంచ్‌పై యువతి ఆరోపణలు

సహజీవనం, బలవంతపు గర్భస్రావాలు, పెళ్లికి నిరాకరణ అంటూ ఫిర్యాదు – ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టిపారేసిన సర్పంచ్ దస్తగిరి బోధన్, జూలై 8: E6 న్యూస్, నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామ సర్పంచ్ దస్తగిరిపై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమ పేరుతో తనను నమ్మించి, సర్పంచ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి చివరకు మోసం చేశాడని బాధితురాలు సీమ ఆరోపించింది. తనకు న్యాయం…

Read More

E6TV బిగ్ బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ స్కామ్ కమ్మర్‌పల్లి నకిలీ వైద్య సామ్రాజ్యం గుట్టురట్టు

అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠా అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠాఅधिकारियोंల జేబుల్లో నోట్ల కట్టలు జనం ప్రాణాలకు లేవా విలువలు డీఎంహెచ్‌ఓ గారు సమాధానం చెప్పండికమ్మర్‌పల్లి నిజామాబాద్ జిల్లాఅక్కడ బోర్డు చూస్తే కార్పొరేట్ రేంజ్ బిల్డింగ్ కనిపిస్తుంది….

Read More

బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం

మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూరు, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బీజేపీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒడ్డెట్‌పల్లి, అమ్రాద్, బోర్గం, మాణిక్‌బండారు, గొట్టుముక్కల, మంతాపూర్ గ్రామాల్లో మరణించిన బీజేపీ…

Read More

నిజామాబాద్ – బెంగళూరు లహరి బస్సు కు కొత్త బోర్డింగ్ పాయింట్లు

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ సీటర్ & స్లీపర్ బస్సు సర్వీసుకు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నగరంలో మెడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల…

Read More

అశోక్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

లారీ ఢీకొని తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్, జూలై 12 (E6 క్రైమ్ న్యూస్):నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జానకంపేట్ గ్రామానికి చెందిన మారా కమల తన కుమారుడు అవీష్‌తో కలిసి…

Read More

గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది: అమరవేణి నర్సాగౌడ్ హుస్నాబాద్ జూలై 11: E6 న్యూస్ గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ” జాతీయ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు.గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ”…

Read More

చెహలమ్ అర్బయీన్: ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల రద్దీ

E6TV డిజిటల్ డెస్క్: చెహలమ్ అర్బయీన్ పురస్కరించుకుని ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వద్ద యాత్రికుల సందడి మొదలైంది. ఇరాన్ నుండి ఇరాక్ వెళ్లే వేలాది మంది ఇరానియన్ యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ నుండి వచ్చే యాత్రికుల ప్రవేశం కోసం ప్రత్యేక సరిహద్దు మార్గాలను అధికారులు కేటాయించారు. చెహలమ్ అర్బయీన్ ప్రయాణ సమాచారం ఇరాన్ నుంచి ఇరాక్ వైపు వెళ్తున్న వేలాది మంది యాత్రికులు మెహ్రాన్ సరిహద్దు వద్దకు చేరుకోవడంతో అధికారులు ఇమ్మిగ్రేషన్…

Read More

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ చోరీ కేసును చేదించిన పోలీసులు.

10 రోజుల్లోనే నిందితుల అరెస్ట్ – వెండి ఆభరణాల స్వాధీనం బాసర, జూలై 2: E6 న్యూస్ తిరుపతి గౌడ్ నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఆలయంలో చోరీ జరిగిన వెంటనే పోలీసులు…

Read More

తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి

తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు.. బాన్సువాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుగా పోచారం భాస్కర్ రెడ్డి

Read More

విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఘన స్వాగతం పలికిన కూటమి 🤍!

విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు!

​ప్రజల చెంతకు లోకేష్: అర్జీలు స్వీకరిస్తూ, సమస్యల పరిష్కారానికి హామీ!

​రేపు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న విద్యాశాఖ మంత్రి.

​వివరాళ్లతో కూడిన వార్తా కథనం (News Content)

​విశాఖపట్నం (E6TV ప్రతినిధి):

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ విమానాశ్రయంలో కూటమి ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

​పర్యటనలో భాగంగా, తనను కలవడానికి వచ్చిన ప్రజల నుండి మంత్రి లోకేష్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్న ఆయన… సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలకు బలమైన హామీ ఇచ్చారు.

​రేపటి షెడ్యూల్:

రేపు విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (केंद्रीय जनजातीय विश्वविद्यालय) స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Read More

పార్లమెంట్‌లో ‘నీట్’ లీకేజ్ సెగ.. నల్ల దుస్తుల్లో విపక్షాల రచ్చ, లోక్‌సభ వాయిదా!

న్యూఢిల్లీ:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ (NEET) పేపర్ లీకేజీ సెగ తీవ్ర రూపం దాల్చింది. ఈ అంశంపై బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నిరసనకు దిగాయి. విపక్ష ఎంపీల తీవ్ర నినాదాలు, ఆందోళనల నడుమ సభ నడవకపోవడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.నల్ల దుస్తులతో పార్లమెంట్ వద్ద ఎంపీల భారీ నిరసనమరోవైపు పార్లమెంట్ పరిసరాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై జంతర్…

Read More

టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి నిఘా వ్యవస్థ పటిష్టం చేసి ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి నిజామాబాద్, జూలై 28 (E6 tv NEWS ప్రతినిధి): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ…

Read More

శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో విషాదం

నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం – మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య – వర్షాకాలంలో జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి నిజామాబాద్, జూలై 26: E6 tv NEWS: శివ ఠాకూర్. ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని లక్ష్మి కెనాల్‌లో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన…

Read More

మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్‌తోనే పూర్తి చేస్తాం

రైతులకు శాశ్వత సాగునీరే లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు డిజైన్ ఆధారంగానే పూర్తి చేసి రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.గురువారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని కొండెం–మంచిప్ప…

Read More

తెలంగాణ టూ నార్వే: పెట్టుబడుల వెల్లువకు ‘వర్కింగ్ గ్రూప్’ ప్లాన్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశలో మంత్రి శ్రీధర్ బాబు మరో కీలక అడుగు వేశారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నార్వే కంపెనీలకు తెలంగాణ స్వర్గధామమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పిలుపునిచ్చారు.గురువారం సచివాలయంలో నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు,…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

జిల్లా భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 22 (E6 tv NEWS ప్రతినిధి): జిల్లా శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ క్రమశిక్షణ, మహిళల భద్రత, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో…

Read More

రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలభిషేకం.

జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.6 వేల…

Read More

మాదిగల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాం: డా,పేరుమాండ్ల రామకృష్ణ

నిజామాబాద్, జూలై 1: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో సంస్థ ముఖ్య సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేయడం, మాదిగ సమాజ హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని విస్తరించడంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల…

Read More

నేరాల నియంత్రణపై ఉక్కుపాదం

రాబోయే పండుగలకు పటిష్ట బందోబస్తు పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పెంచాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పోలీస్ అధికారులకు సీపీ సాయి చైతన్య ఆదేశాలు నిజామాబాద్, జూలై 10:E6 న్యూస్ క్రైమ్: శివ ఠాకూర్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. రాబోయే…

Read More

కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బిఆర్ఎస్ నేతలు

కోటగిరి జూలై 12 :E6 న్యూస్:కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించి, రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని…

Read More

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. పరీక్షలు వాయిదా వేయాల్సిందే!

ప్రభుత్వం మొండివైఖరి వీడాలి: AISF రాష్ట్ర కమిటీ డిమాండ్ ​హైదరాబాద్ (E6TV వెబ్ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సెగ విద్యాశాఖకు తాకింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, సమ్మె నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్, డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని AISF (అఖిల భారత విద్యార్థి సమాఖ్య) డిమాండ్ చేసింది. ఈ మేరకు AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట…

Read More

సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

ముధోల్, జూలై 8: E6 న్యూస్ (తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఆచార్యులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భైంసా పట్టణంలోని శ్రీకర్ హాస్పిటల్‌కు చెందిన పిల్లల వైద్య నిపుణులు డా. దయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన ఆహారం, తాగునీటి వినియోగం వంటి అంశాలపై…

Read More

ప్రతి అర్హుడికి ఓటు హక్కు చేరేలా SIR పరిశీలన

అచ్చంపేట్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నిజాంసాగర్, జూలై 8: E6 న్యూస్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న…

Read More

గుజరాత్ ATS భారీ ఆపరేషన్.. రెండు విడతల్లో 13 మంది జైష్ ఉగ్రవాదుల అరెస్ట్

పాకిస్థాన్ హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు.. ఐఈడీ పేలుళ్లకు కుట్ర.. దేశంలో ఉగ్ర నెట్‌వర్క్ విస్తరణ యత్నాన్ని భగ్నం చేసిన ATS నిజామాబాద్ జూలై 18 : E6 న్యూస్, ఫ్యూచర్ ఆర్టికల్, శివ ఠాకూర్. దేశ భద్రతకు ముప్పుగా మారే మరో ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (JeM)తో సంబంధాలు కొనసాగిస్తూ, గుజరాత్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాపై…

Read More

బిగ్ బ్రేకింగ్: లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు!

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి కీలక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లుకు సరిపడా మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఓటింగ్ సరళి: ఎందుకు వీగిపోయింది? రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన సభ్యులలో మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ తప్పనిసరి. కానీ,…

Read More

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి,లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్, జూలై 28: (E6 tv NEWS) రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్…

Read More

రైతు భరోసా సంబరాలు

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్, జూలై 8:E6సిక్స్ న్యూస్ (శివ ఠాకూర్). రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 124.85 లక్షల ఎకరాలకు సంబంధించిన 68.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7,490.72 కోట్లను జమ చేసిన సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ…

Read More

ఫాం పాండ్‌ల నిర్మాణంతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం

మద్నూర్‌లో ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం మద్నూర్, జూలై 28: (E6 tv NEWS ప్రతినిధి). వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఫాం పాండ్‌లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ వీఓఏలు (VOAలు), సీసీలు (CCలు) పాల్గొన్న సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, సురేష్ హాజరై ఫాం పాండ్‌ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిల్వలను…

Read More

నిర్ణీత గడువులోగా ఆలయపుణ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పనుల పరిశీలన భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో అన్ని వసతులు కల్పించాలి భైంసా సబ్ కలెక్టర్ ఆదేశం బాసర జూలై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు….

Read More

భీంగల్‌లో వైభవంగా ఊర పండుగ

రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ముక్కోటి దేవతలను వేడుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే భీంగల్, జూలై 13: E6 న్యూస్ తాటికొండ గంగాధర్  నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తున్న “ఊర పండుగ” మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నియోజకవర్గ ప్రజల…

Read More

అంకాపూర్ వెళ్లకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు హౌస్ అరెస్ట్

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్‌పాల్ తీవ్ర విమర్శలు నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్‌కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…

Read More

ఉప ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు  పటేల్. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ – బుద్ధ విహారాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్ లైటింగ్‌కు హామీ.

ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్). ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో బుద్ధ విహారాల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, పలు దేవాలయాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అవసరమైన…

Read More

ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్

చట్ట ప్రకారం సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు నిజామాబాద్, జూలై 13: E6 క్రైమ్ న్యూస్ శివ ఠాకూర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టబద్ధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజల నుంచి 39 ఫిర్యాదులను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను కమిషనర్ స్వయంగా కలిసి…

Read More

లింబాద్రిగుట్టలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న న్యాయమూర్తులు – కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు భీంగల్, జూలై 26: (E6 tv NEWS: T, గంగాధర్) భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మణ్ నారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి ఆలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

Read More

ఉద్యమకారులపై లాఠీచార్జి కాంగ్రెస్ ప్రభుత్వ పథకానికి నాంది: కల్వకుంట్ల కవిత

ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులా?.. మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమని మండిపాటు జూలై 2: (E6 న్యూస్- శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే వారిపై లాఠీచార్జీ చేసి, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

ఈశాన్య తెలంగాణలో నేడు విస్తృత వర్షాలు

నిజామాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – హైదరాబాద్‌లో సాయంత్రం జల్లులు నిజామాబాద్, జూలై 19: E6 tv NEWS. రాష్ట్రంలో నేడు (జూలై 19) ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల,…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టా?

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరిని ఖండించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 22:E6 tv NEWS శివ ఠాకూర్: విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరిగే శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7 లక్షల ఎల్ఓసీ అందజేత

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండగా నిలిచిన ముత్యాల సునీల్ కుమార్ భీంగల్, జూలై 25: (E6 tv NEWS: T,గంగాధర్) భీంగల్ మండల కేంద్రంలోని బోయిగల్లికి చెందిన పల్లేర్ల వైశ్విక్ (తండ్రి: అరుణ్ బాబు) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

Read More

ఉప ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు  పటేల్. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ – బుద్ధ విహారాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్ లైటింగ్‌కు హామీ.

ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్). ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో బుద్ధ విహారాల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, పలు దేవాలయాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అవసరమైన…

Read More

దొంగనే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ–బీఆర్ఎస్ తీరు

ప్రతిపక్షాల ఆరోపణలు ఆధారరహితం – కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శ నిజామాబాద్, జూలై 21 (E6 tv NEWS ప్రతినిధి) బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం “దొంగనే దొంగా దొంగా అన్నట్లు” ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు…

Read More

వ్యూహకర్త నుంచి కేబినెట్ మంత్రి వరకు.. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తెలుగు తేజం ‘ఎస్. కీర్తన’!

E6TV చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళ వెట్రి కళగం’ (TVK) మంత్రివర్గంలో ఒక యువ కిరణం మెరిసింది. కేవలం 30 ఏళ్ల వయసులోనే కీలకమైన మంత్రి పదవిని దక్కించుకుని, ఆధునిక రాజకీయాల్లో నైపుణ్యమే అసలైన అర్హత అని చాటిచెప్పారు మన తెలుగు ఆడపడుచు ఎస్. కీర్తన. ​వ్యూహకర్తగా ప్రస్థానం: డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్‌పై ఉన్న అపారమైన పట్టుతో ‘షోటైమ్ కన్సల్టింగ్’ సంస్థలో పొలిటికల్ కన్సల్టెంట్‌గా కీర్తన తన…

Read More

నిజాంసాగర్ కు వెంటనే నీరు అందించాలి

హల్దీ వాగు ద్వారా నీటి విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి కోటగిరిలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మహాధర్నా.. అధికారులకు వినతిపత్రం కోటగిరి, జూలై 15: ఈ సిక్స్ న్యూస్ అశోక్ కాంబ్లేవర్షాభావ పరిస్థితులతో నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వేలాది ఎకరాల పంటలు ఎండుముఖం పడుతున్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే…

Read More

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్  శివ ఠాకూర్ వచ్చే ఏడాది 2027 సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పుష్కర…

Read More

నివాస ప్రాంతంలో వాణిజ్య అరాచకాలు.. ప్రశ్నించినందుకు కాకతీయ హిల్స్ అసోసియేషన్ ప్రతినిధులపై దౌర్జన్యం!

కాకతీయ హిల్స్‌లో నివాసితుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని కాకతీయ హిల్స్ కాలనీ పూర్తిగా నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందినప్పటికీ, ఇటీవల కొంతమంది వాణిజ్య సంస్థలు, చిన్న హోటళ్లు, చికెన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (KHWA) ప్రతినిధులు తెలిపారు. నివాసితుల ఫిర్యాదుల ప్రకారం, కొన్ని హోటళ్లలో కట్టెల…

Read More

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, రక్షణ చట్టం అమలు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్.జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టి, అనంతరం…

Read More

హైదరాబాద్‌లో దారుణం: ఎయిర్‌లైన్ సిబ్బందిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!

హైదరాబాద్:రాజధాని నగరంలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) విధులకు వెళ్తున్న ఒక ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ సభ్యురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి 23 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిర్జన ప్రదేశానికి తరలించి దారుణంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 20వ తేదీ రాత్రి బాధితురాలు విమానాశ్రయంలో విధులకు హాజరయ్యేందుకు క్యాబ్ ఎక్కింది. ఎయిర్‌పోర్టుకు నేరుగా వెళ్లకుండా, డ్రైవర్ వాహనాన్ని దారి…

Read More

అంగన్వాడి పోస్టుల్లో రిజర్వేషన్ రగడ…!

బీసీ మహిళలకు దక్కని అవకాశం..? సొంత గ్రామ నిబంధనతో దరఖాస్తుకే నోచుకోని నిరుద్యోగ మహిళలు పక్క గ్రామంలో పోస్టు ఉన్నా అప్లై చేయలేని పరిస్థితి..! ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ మహిళలకు నిరాశేనా..? రిజర్వేషన్ ప్రక్రియపై పునరాలోచించాలంటున్న బీసీ సంఘాలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూపులు స్పెషల్ స్టోరీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా విడుదలైన అంగన్వాడీ…

Read More

సుందరీకరణను పాడుచేస్తే ఊరుకోం: ఫ్లెక్సీల అరాచకంపై జోనల్ కమిషనర్‌కు సామల్ కార్తీక్ ఫిర్యాదు

హైదరాబాద్ (శేరిలింగంపల్లి):నగర సుందరీకరణను దెబ్బతీస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ డిమాండ్ చేశారు. సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై ఆగ్రహంశేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, కాలనీ రోడ్లు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ గోడలపై ఇష్టారాజ్యంగా వెలిసిన వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలపై కార్తీక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు….

Read More

వైయస్సార్ 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

భీమ్‌గల్, జూలై 8: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతినిధి-శివ ఠాకూర్). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు….

Read More

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం, ఏబీవీపీ ఆందోళన, ఎంఈఓ విచారణ

చందూరు, జూలై 2:నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఆర్పీని…

Read More

ప్రతి అర్హుడికి ఓటు హక్కు చేరేలా SIR పరిశీలన

అచ్చంపేట్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నిజాంసాగర్, జూలై 8: E6 న్యూస్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న…

Read More

ప్రతి భారతీయుడికి గర్వకారమైన క్షణం.

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం. న్యూఢిల్లీ/జకార్తా: E6 న్యూస్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన **’బింటాంగ్ ఆదిపూర్ణ’**ను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఘనంగా ప్రదానం చేశారు. భారత్–ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పరస్పర సహకారం విస్తరణకు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని…

Read More

ప్రభుత్వ భూమి కబ్జాయత్నంపై గ్రామస్తుల ఆందోళన, పోతంగల్ హంగర్గా ఫారంలో ఉద్రిక్తత.

పొతంగల్, జూలై 2:(E6 న్యూస్: ఔరాద్ అశోక్) నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని హంగార్గా ఫారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం జరిగిందంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఏకమై నిలిచామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గైక్వాడ్ భీమ్రావు అనే వ్యక్తి తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నించి ఆక్రమించుకునే ప్రయత్నం…

Read More

కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్: “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకుంటావా.. ఇదేనా నీ సంస్కృతి?”

కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్: “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకుంటావా..

Read More

తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!

జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…

Read More

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి

డీఈవో అశోక్‌కు ప్రెస్ క్లబ్ వినతి – సానుకూల స్పందన ఒకటి, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ కార్యదర్శి…

Read More

గౌడ, యాదవ కులాలపై వ్యాఖ్యల వివాదం

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి: గౌడ జన హక్కుల పోరాట సమితి నిర్మల్, జూలై 16: E6 న్యూస్ తిరుపతి గౌడ్ గౌడ, యాదవ సమాజాలపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి…

Read More

E6TV బ్రేకింగ్ న్యూస్ గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తీరని లోటు..

  భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి (శిష్ట్లా జానకి) శనివారం కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న జానకి అమ్మ, వయోసహజ అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె…

Read More

ఉత్తరాంధ్రలో క్లీన్ ఎనర్జీ విప్లవం: అనకాపల్లిలో రూ.5,400 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో అనకాపల్లి జిల్లా మరోసారి గ్లోబల్ హాట్ స్పాట్‌గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, తాజాగా రెన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధన) రంగంలో భారీ పెట్టుబడులను సాకారం చేస్తోంది. ప్రముఖ సంస్థ ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్’ రాంబిల్లిలో ఏర్పాటు చేయనున్న మెగా ఎనర్జీ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమి పూజ చేయనున్నారు.ముఖ్య విశేషాలు:మొత్తం పెట్టుబడి: రూ.5,400 కోట్లు.ఉపాధి అవకాశాలు: సుమారు 2,100 మందికి…

Read More

ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్.

జులై 03: E6 న్యూస్ నిజామాబాద్ (శివ ఠాకూర్).  ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సోలమన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్‌తో పాటు నిజామాబాద్–2 డిపోను సందర్శించిన ఆయన, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్‌లో మొత్తం 89 ఎలక్ట్రిక్…

Read More

బబన్‌సా పహాడ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు,152 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం

ఒక వ్యక్తి అరెస్టు.. పల్సర్ ద్విచక్ర వాహనం సీజ్ నిజామాబాద్, జూలై 14: E6 క్రైమ్ న్యూస్నిజామాబాద్ SHO పోలీస్ స్టేషన్ పరిధిలోని బబన్‌సా పహాడ్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి 152 గ్రాముల ఎండు గంజాయితో పాటు…

Read More

మహిళా బిల్లు ముసుగులో బీజేపీ ‘డీలిమిటేషన్’ కుట్ర బట్టబయలు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో ఉత్తర భారతంలో సీట్లు పెంచుకుని, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ పన్నిన ‘డీలిమిటేషన్’ దొంగ అజెండా దేశం ముందు బహిర్గతమైందని ఆయన మండిపడ్డారు.రాజకీయ పరాభవం – ప్రజాస్వామ్య విజయంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ…

Read More

అమరులైన విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళి

నీట్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి ముధోల్, జూలై 25: (E6 tv NEWS, తిరుపతి గౌడ్).నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు సంఘీభావంగా ముధోల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి అమరులైన విద్యార్థులకు…

Read More

ఆరావళి పర్వతాల రక్షణపై సూచనలు ఆహ్వానించిన సుప్రీంకోర్టు కమిటీ.. 21 రోజుల గడువు!

ఆరావళి సరిహద్దుల నిర్ధారణపై అభిప్రాయాలు కోరిన ఉన్నతాధికార కమిటీప్రజలు, పర్యావరణవేత్తలు, మైనింగ్ వర్గాల నుంచి వినతులకు అవకాశంకమిటీ స్వతంత్రత, తటస్థతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు ఆరావళి పర్వత శ్రేణుల రక్షణ, సరిహద్దుల నిర్ధారణ (Delineation) అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన ఉన్నతాధికార ‘ఆరావళి కమిటీ’ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి ప్రాంత సమస్యలు, పరిరక్షణపై ప్రజలు, పర్యావరణవేత్తలు, వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, వినతులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ​21 రోజుల్లోగా సూచనలు పంపాలి కేంద్ర పర్యావరణ…

Read More

భారత్ అంతరిక్ష రంగంలో మరో చరిత్ర… విక్రమ్-1 విజయంతో కొత్త శకం!

న్యూఢిల్లీ / శ్రీహరికోట, జూలై 18: E6 tv NEWS.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)సహకారంతో భారత ప్రైవేట్ స్పేస్ రంగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ విజయవంతంగా ప్రయోగమై కక్ష్యలోకి చేరింది. భారత ప్రైవేట్ రంగం నుంచి కక్ష్యలోకి చేరిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని “ఆత్మనిర్భర్ భారత్‌కు…

Read More

వైశ్యులంతా ఐక్యతగా ఉండి రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉత్తర తిరుమలలో ఘనంగా వనభోజన కార్యక్రమం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక రంగంలో వైశ్యుల పాత్ర ఆదర్శనీయం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వనభోజనాలు నిర్వహించడం అభినందనీయం ఇందూరు, జూలై 19 : E6 tv NEWS శివ ఠాకూర్వైశ్యులంతా ఐక్యతగా ఉంటూ సమాజ అభివృద్ధితో పాటు రాజకీయంగానూ మరింత ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర…

Read More

తెలంగాణ తల్లికి ఘోర అవమానం.. చెప్పులతోనే విగ్రహాన్ని శుభ్రం చేసిన సిబ్బంది!

జామాబాద్, జూన్ 29 (E6TV ప్రతినిధి):నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సెంటిమెంట్‌కు ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహానికి తీవ్ర అవమానం జరిగింది. నూతన సమీకృత కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విగ్రహాన్ని శుభ్రం చేసే క్రమంలో.. కొందరు సిబ్బంది కనీస మర్యాద, విచక్షణ మరిచి ప్రవర్తించారు.### **కాళ్లకు చెప్పులతోనే విగ్రహంపైకి..!**తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. తమ కాళ్లకు ఉన్న చెప్పులను విప్పకుండానే…

Read More

పేదల ఆరోగ్యానికి పెద్దపీట నిమ్స్ చికిత్సకు రూ. 5 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

ఇందూరు, జూలై 12: E6 న్యూస్ శివ ఠాకూర్ నియోజకవర్గంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో చికిత్స కోసం ఎల్వోసీలు (LOC) మంజూరు చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటోనగర్‌కు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమె చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్వోసీని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే…

Read More

విజన్ 2047 లక్ష్యం: ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు – విశాఖకు $15 బిలియన్ల గూగుల్ పెట్టుబడి

విజన్ 2047 లక్ష్యం: ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు – విశాఖకు $15 బిలియన్ల గూగుల్ పెట్టుబడిముంబై: ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తుపై తన స్పష్టమైన విజన్‌ను ఆవిష్కరించారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి, సంస్కరణల ద్వారా సంపద సృష్టించి, ఆ సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ఐటీ నుంచి ఏఐ వరకు: గూగుల్ భారీ…

Read More

నిజామాబాద్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తీవ్ర విమర్శలు

నీట్ అంశంపై కాంగ్రెస్ ఆందోళనలను తప్పుబట్టిన అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌తో పాటు కొన్ని రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులతో  తోపులాట ఇందూరు, జూలై 22: E6 tv NEWS శివ ఠాకూర్ నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా తప్పుబడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను…

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

ఎన్‌వోసీ జారీకి రూ.60 వేల లంచం డిమాండ్ – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆదిలాబాద్, జూలై 16: E6 న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో విజయవంతమైన దాడి నిర్వహించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్‌ను రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగేహస్తం పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్…

Read More

మహిళ మెడలో నుంచి మంగళసూత్రం చోరీ.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్, జూలై 11: E6 న్యూస్ క్రైమ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బ ప్రాంతంలో మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న కమిషనర్, దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ…

Read More

నేరాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలి: (బాసర జోన్-2) డిఐజి ఆర్, భాస్కరన్.

నిజామాబాద్‌లో జోన్-2 పరిధి జిల్లా పోలీసు అధికారులతో తొలి సమీక్షా సమావేశం. E6 -క్రైమ్ న్యూస్ (శివ ఠాకూర్). శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బాసర జోన్-2 డీఐజీ ఆర్. భాస్కరన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు డీఐజీకి జిల్లా అధికారులు స్వాగతం పలకగా, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు,…

Read More

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూతహైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజికవర్గ అగ్రనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ఆయన 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి…

Read More

లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భవిత భవనం, కేజీబీవీ మౌలిక సదుపాయాలు, పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం – దివ్యాంగులకు పరికరాల పంపిణీ లోకేశ్వరం, జూలై 16: E6 న్యూస్, తిరుపతి గౌడ్. లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనంను ప్రారంభించి, దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సామగ్రి, ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నాబార్డ్…

Read More

తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిజాయితీ: భక్తుడికి 100 గ్రాముల బంగారు ఆభరణాల సంచి అందజేత!

తిరుపతి:తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు పొరపాటున వదిలేసిన 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న సంచిని టీటీడీ (TTD) విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది భద్రంగా అతనికి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఘటనఅందిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11:35 గంటల ప్రాంతంలో అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సెక్యూరిటీ స్క్రీనింగ్ జరుగుతుండగా, ఒక భక్తుడు తన బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయి వెళ్లాడు. గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఆ…

Read More

విద్యార్థులపై దాడి అమానుషం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్‌లో మహాధర్నా ముధోల్, జూలై 24: E6 tv NEWS తిరుపతి గౌడ్. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. ఏఐసీసీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు…

Read More

ప్రభుత్వ రోడ్డు కబ్జా కతనంపై ముందుకు సాగని అధికారులు,

ప్రభుత్వ స్థలంలో మహిళా భవనం ఏర్పాటు చేయాలని స్థానిక మహిళల డిమాండ్ నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్): నగరంలోని 35వ డివిజన్‌లో ప్రభుత్వ రోడ్డు కబ్జాకు సంబంధించిన అంశంపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వ రోడ్డు ఆక్రమణపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత శాఖలు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత ప్రైవేట్ పాఠశాల క్రీడా ప్రాంగణంగా ఎలా వినియోగిస్తారనే…

Read More

చరిత్ర సృష్టించడానికే మనం ఇక్కడ ఉన్నాం: మంత్రి నారా లోకేష్
‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు!

చరిత్ర సృష్టించడానికే మనం ఇక్కడ ఉన్నాం: మంత్రి నారా లోకేష్‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్’లో ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు!అమరావతి: “మనం ఇక్కడ ఉన్నది కేవలం పాలన సాగించడానికి కాదు.. చరిత్ర సృష్టించడానికి!” అంటూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డు అందుకున్న సందర్భంగా, అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల…

Read More

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

Read More

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిజామాబాద్ పోలీసుల ఉక్కు పాదం.

మూడు వారాల్లో 559 కేసులు నమోదు – రూ.52.80 లక్షల జరిమానా 31 మందికి వారం రోజుల జైలు శిక్ష నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్)నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. గత మూడు వారాల కాలంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 559 మంది వాహనదారులు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,…

Read More

గోదావరి పుష్కరాలు–2027కు పటిష్ట కార్యాచరణతో ముందుకుసాగాలి

భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పుష్కర ఘాట్ల వద్ద భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష సీసీ కెమెరాలు, డ్రోన్లతో 24 గంటల నిఘా ఏర్పాటు వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం నిజామాబాద్, జూలై 22: (E6 tv NEWS ప్రతినిధి): గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ…

Read More

బాసరలో ఘనంగా అన్నప్రసాద వితరణ: గురు మార్గంలో నడవాలని భక్తుల పిలుపు

**బాసర (ఈ6టీవీ వెబ్ న్యూస్):**నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోదావరి నది సమీపంలో ఉన్న ఓం శ్రీ వరలక్ష్మి ఆశ్రమం ఆధ్వర్యంలో భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఆశ్రమ ఉత్తరాధికారి నర్సూరి శ్రీనాథ్ రావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి మరుసటి రోజున శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజు పుణ్యతిథిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా పుణ్యతిథిని పురస్కరించుకొని పవిత్ర గోదావరి నది పుష్కర మొదటి ఘాట్ వద్దకు…

Read More

ఏపీ అభివృద్ధి మరియు ప్రాజెక్టులపై ఢిల్లీలో సీఎం చంద్రబాబు ముమ్మర కసరత్తు

న్యూఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు మరియు యువతకు సాంకేతిక శిక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు.ఢిల్లీ పర్యటన ముఖ్యాంశాలు:కేంద్ర మంత్రులతో భేటీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లతో ముఖ్యమంత్రి విడివిడిగా సమావేశమయ్యారు. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల విడుదలపై అమిత్ షాకు…

Read More

సన్‌రైజర్స్ ‘అన్‌సంగ్ హీరో’ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో కీ రోల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అయితే ఈ విజయాల వెనుక ట్రావిస్ హెడ్ మెరుపులు, క్లాసెన్ సిక్సర్లు ఎంత ఉన్నాయో.. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ జట్టును గెలిపిస్తున్న మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పాత్ర అంతకు మించి ఉంది. బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తూ, బాల్‌తో కీలక వికెట్లు తీస్తూ.. సన్‌రైజర్స్‌కు అసలైన ‘అన్‌సంగ్ హీరో’గా నిలుస్తున్నాడు ఈ ఆంధ్ర ఆల్ రౌండర్.  నితీష్ ‘ఆల్…

Read More

ఈ నెల 16 నుంచి 24 వరకు ఇస్కాన్ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్రలు

ఇస్కాన్ రథయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలి జూలై 15 నిజామాబాద్: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇస్కాన్ (ISKCON) ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా శ్రీ జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రథయాత్ర జరిగే ప్రాంతాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని రామానంద రాయ్ గౌర దాస్ విజ్ఞప్తి చేశారు. రథయాత్రల షెడ్యూల్…

Read More

వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…

వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…

Read More

మంచిప్ప గ్రామాన్ని ముంపు నుండి రక్షించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే సర్పంచ్ తూర్పు గంగామణి లక్ష్యం

మంచిప్ప గ్రామాన్ని ముంపు నుండి రక్షించి అభివృద్ధి పథంలో నిలపడమే తన ధ్యేయమని సర్పంచ్ తూర్పు గంగామణి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప రిజర్వాయర్ ముంపు ముప్పును అధిగమిస్తూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఆమె కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో గ్రామంలో అంతర్గత రోడ్ల విస్తరణ మురుగు కాలువల ఆధునీకరణ మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు గృహజ్యోతి వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఇప్పటికే…

Read More

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సంచలన నిజాలు!

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు జైలులో అందుతున్న వైద్య చికిత్సపై ఆయన కుమారులు సులైమాన్ ఖాన్, ఖాసిమ్ ఖాన్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడియాలా జైలులో ఉన్న తన తండ్రికి కంటి సంబంధిత సమస్యకు సరైన వైద్యం అందడం లేదని, ఇది కేవలం “కనీస స్థాయి” చికిత్స మాత్రమేనని వారు ఆరోపించారు.  ముఖ్యాంశాలు:కంటి చూపుపై ఆందోళన: ఇమ్రాన్ ఖాన్‌కు కుడి కంటిలో సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్ (CRVO)…

Read More

బ్రాహ్మణ సమాజ ఐక్యతకు భారీ వేదిక : ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు

బ్రాహ్మణ సమాజ ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి: ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావుహైదరాబాద్, జూలై 12 (E6TV): హైదరాబాద్‌లోని మల్లాపూర్-VNR గార్డెన్‌లో బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వశిష్టా కల్యాణ వేదిక, రాజతోత్సవ వేడుకలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు శ్రీ హార్కర వేణుగోపాల్ రావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు…

Read More

పలాస ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!

పలాస ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!పలాస (ఉద్దానం):శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సుముఖంగా ఉందన్న ఆయన.. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ఉద్దాన ప్రాంత ప్రజలు, రైతులు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా…

Read More

తండ్రికి తగ్గ తనయుడు… ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పోచారం భాస్కర్ రెడ్డి.

కోటగిరి, జూలై 19: E6 tv NEWS (శివ ఠాకూర్).బాన్సువాడ నియోజకవర్గ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న పోచారం భాస్కర్ రెడ్డి పేరు ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు లభిస్తోందని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ప్రజలతో మమేకమవడం, అవసరమైన సమయంలో అండగా నిలవడం, ఎక్కువగా మాటలు…

Read More

అబద్ధపు ప్రచారాలు మానేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయాలి: భీంగల్ బీఆర్ఎస్ నాయకులు

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ భీంగల్ పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్ డిపో, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అసత్య ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2022 జూన్ నెలలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి…

Read More

పార్టీ కోసం కష్టం.. పదవి విషయంలో నిరీక్షణ..!

నగర కాంగ్రెస్‌లో ధర్మపురి సంజయ్‌కు కీలక పదవి ఎప్పుడు..? బీసీ నేతకు ప్రాధాన్యం దక్కడం లేదా..? సీనియర్ నాయకుడు మౌనం వెనుక వ్యూహమేంటి..? నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ E6 న్యూస్ స్పెషల్ స్టోరీ | నిజామాబాద్ (శివ ఠాకూర్) పార్టీ కోసం కష్టపడుతున్నారు… ప్రజల మధ్యే ఉంటున్నారు… కాంగ్రెస్ కార్యక్రమమంటే ముందుంటున్నారు… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు… అయినా కీలక పదవి విషయంలో మాత్రం ఇంకా నిరీక్షణేనా..? నిజామాబాద్…

Read More

ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలంతా భాగస్వాములు కావాలి: టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి

ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలంతా భాగస్వాములు కావాలి: టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డికంది, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ క్రియాశీల భాగస్వాములు కావాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కంది మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఆమె వివిధ పథకాల అమలు తీరును…

Read More

తెలంగాణ రక్షక సేన నాయకులను బైండోలు చేసిన పోలీసులు

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: తెలంగాణ రక్షణ సేన E6 న్యూస్: నిజామాబాద్(శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. జూలై 2న హైదరాబాద్ ఉప్పల్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ భూ పోరాట కార్యక్రమం నిర్వహించినట్లు…

Read More

నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?

జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…

Read More

టీజీట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారుల మెరుపు దాడులు!

హైదరాబాద్:తెలంగాణ ట్రాన్స్‌కో (TGTRANSCO) డిప్యూటీ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణకు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.15 ప్రాంతాల్లో ఎనిమిది బృందాల తనిఖీలులభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 ప్రాంతాల్లో ఎనిమిది ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. వెంకటరమణతో పాటు ఆయన…

Read More

జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి: ఎంపీ ధర్మపురి అరవింద్.

జగిత్యాల, జూలై 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. అయితే, కేంద్ర విద్యాలయ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. కేంద్ర విద్యాలయ సంఘం (కేవీఎస్) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే అయినప్పటికీ, మెట్రో…

Read More

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

బోగస్ ఓట్ల తొలగింపునకు ఇదే మంచి అవకాశం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా,E6 న్యూస్, తిరుపతి గౌడ్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, గ్రామాల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. బోగస్ ఓట్ల తొలగింపునకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. గురువారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీజేపీ…

Read More

నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చోరీ బైక్, బంగారు గొలుసుతో నిందితుడు పట్టివేత.

నిజామాబాద్, జూలై 18 : E6 tv NEWS (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్‌లో చోరీకి గురైన మోటార్ సైకిల్‌తో పాటు బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ట్రాఫిక్…

Read More

బోడుప్పల్ భూ పోరాటం సందర్భంగా తెలంగాణ రక్షక సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్

బోడుప్పల్, జూలై 2: E6 న్యూస్ బోడుప్పల్‌లో నిర్వహించిన భూపోరాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపోరాటం సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు…

Read More

ప్రాణాలు వదిలిన డ్రైవర్ శంకర్ గౌడ్.. వరంగల్‌లో మిన్నంటిన రోదనలు!

ప్రాణాలు వదిలిన డ్రైవర్ శంకర్ గౌడ్.. వరంగల్‌లో మిన్నంటిన రోదనలు! తెలంగాణ ఆర్టీసీలో పెను విషాదం నెలకొంది. చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ​ముఖ్యాంశాలు: ​E6TV స్పెషల్ రిపోర్ట్: ​”ప్రభుత్వ మొండి వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సమ్మె పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడం, చర్చలు విఫలం కావడంతో శంకర్ గౌడ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే…

Read More

అనధికారికంగా వ్యవహరిస్తున్న పోచంపాడ్ ఎంహెచ్‌ఓ..?

రెండు నెలలుగా విధులకు గైర్హాజరని మెడికల్ ఆఫీసర్ వెల్లడి బుధవారం వచ్చి రిజిస్టర్‌లో సంతకం.. మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఆరోపణ గురువారం మళ్లీ విధులకు డుమ్మా అనుమతులు లేకుండానే విధులకు దూరం: డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి నిజామాబాద్/పోచంపాడ్, జూలై 09 (E6 న్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి శివ ఠాకూర్): అంతా తన ఇష్టం.. రావాలనుకుంటే విధులకు వస్తారు.. లేకుంటే రారు..! అధికారుల అనుమతులు లేకుండానే నెలల తరబడి విధులకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు..!…

Read More

నీట్ పేపర్ లీక్‌పై నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ మైనారిటీ ర్యాలీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ నిర్మల్, జూలై 24 E6 tv news Md అమీనుద్దీన్: నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ మైనారిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ నాయకుడు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్ల మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల…

Read More

గృహనిర్బంధంతో గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్గల్ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలని డిమాండ్ ఆర్మూర్/భీమ్గల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని, జైల్లో పెట్టినా ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే…

Read More

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం: పోతన్న యాదవ్

ముధోల్, జూలై 23: E6 tv NEWS (తిరుపతి గౌడ్) నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, విద్యార్థుల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం…

Read More

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం వేల్పూర్, జూలై 2: E6 న్యూస్– T, గంగాధర్ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Read More

అమెరికా రక్షణ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం!

హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం ఒక కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో అమెరికాకు చెందిన ‘యూఎస్ నేషనల్ వార్ కాలేజీ’ (US National War College) ఉన్నత స్థాయి బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది.ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు:పెట్టుబడి అవకాశాలు: తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ (రక్షణ), మరియు స్పేస్ (అంతరిక్ష) రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అనుకూలతలను…

Read More

*మార్కెట్ కమిటీలో ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు**

*కేక్ కట్ చేసి, కార్మికులకు పండ్ల పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి** *హాజరైన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు.* *మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని వెల్లడి.** (ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్)తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప…

Read More

SIR ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా నింపాలి

ప్రజలకు అవగాహన కల్పించిన బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు విధానంపై వివరాలు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత చేసి గడువులోగా సమర్పించాలని సూచన. బిచ్కుంద, తేదీ జూలై 7: E6 న్యూస్  (ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్). ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి కుటుంబం తప్పనిసరిగా, సక్రమంగా పూర్తి చేయాలని బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్ సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు…

Read More

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు ఢిల్లీకి సీఎం చంద్రబాబు!

అమరావతి:విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 1న జరగనున్న ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.ఢిల్లీ పర్యటన షెడ్యూల్సీఎం చంద్రబాబు ఉదయం 7:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు పియూష్…

Read More

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ శివ ఠాకూర్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ మరియు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో, TOMCOM సౌజన్యంతో గురువారం నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా జనార్దన్ గార్డెన్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన నగర మేయర్ ఉమారాణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన…

Read More

తెలంగాణ టార్గెట్ గ్లోబల్ ఏరోస్పేస్ హబ్ మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ టార్గెట్ గ్లోబల్ ఏరోస్పేస్ హబ్ మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు ఈరోస్పేస్ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణప్రస్తుత సవాళ్లు మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకో సిస్టం అభివృద్ధిఆర్అండ్ డీ అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్ పై ప్రత్యేక దృష్టిది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుభవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: ముత్యాల సునీల్ కుమార్

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి, ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమయ్యారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. భీంగల్ మండల కేంద్రంలోని ప్రతిపాదిత 100 పడకల ఆసుపత్రి వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 జూన్ 18న రూ.35 కోట్ల అంచనా వ్యయంతో…

Read More

విద్యార్థుల్లో చైతన్యం నింపిన పోలీస్ కళాబృందం

ప్రేమ మోసాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం బిక్కనూర్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు బిక్నూర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్…

Read More

సైబర్ నేరలపై అవగాహన కల్పించిన మాక్లూర్ పోలీసులు.

మాక్లూర్, జూలై 5: E6 న్యూస్ (శివ ఠాకూర్). సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లూర్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో పలు సూచనలు చేశారు. పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారి ఆన్‌లైన్ వినియోగాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలు, కేవైసీ అప్‌డేట్, లాటరీలు, బహుమతులు తదితర పేర్లతో వచ్చే తప్పుడు ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించారు. అలాగే…

Read More

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్  ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్  దీర్ఘాయుష్షుతో ప్రజలకు…

Read More

మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ భేటీ!

మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఘన స్వాగతం.. ఏపీ కూటమి ప్రభుత్వానికి ఎన్‌ఆర్‌ఐల ‘మెగా’ మద్దతు!మెల్బోర్న్ (ఆస్ట్రేలియా):ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం ప్రవాసాంధ్రుల కోలాహలంతో సందడిగా మారింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం ఇక్కడ అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.కేక్ కట్ చేసి సంబరాలు.. శాలువాలతో సత్కారం!నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లందరూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పదవులు పొందిన ప్రతినిధులందరినీ…

Read More

అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి

ఎల్ ని నో పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పీఎం ఫసల్ బీమా అమలు, నిజాంసాగర్‌కు నీటి సరఫరాపై ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఇందూరు, జూలై 20: E6 tv NEWS శివ ఠాకూర్.ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

Read More

దరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ: అమెరికా దిగ్గజం ‘ప్రోటోల్యాబ్స్’ జీసీసీ ఏర్పాటు

హైహైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCC) కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ (Protolabs) హైదరాబాద్‌లో తన ప్రపంచ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో వెల్లడించారు.ముఖ్య విశేషాలు:నిరుద్యోగులకు వరం: ఈ కేంద్రం ఏర్పాటుతో దాదాపు 300 మంది నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు…

Read More

స్వగ్రామంలో SIR పత్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ సోమ రాజేశ్వరరావు

కుటుంబ సభ్యుల ఫారాలను బీఎల్‌ఏ, బీఎల్‌ఓ, సూపర్వైజర్లకు అందజేత మోర్తాడ్, జూలై 11: E6 న్యూస్ శివ ఠాకూర్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముందుగా స్వయంగా…

Read More

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం… ఏబీవీపీ ఆందోళన, ఎం ఈ ఓ విచారణ.

చందూరు, జూలై 2:(E6 న్యూస్- ఔరాద్ అశోక్)నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన…

Read More

బాజిరెడ్డి గోవర్ధన్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు

మహాధర్నా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటు: కాంగ్రెస్ నాయకుడు కొట్టం మనోహర్ కోటగిరి, జూలై 16 : E6 న్యూస్ అశోక్ కాంబ్లేమాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పదేళ్ల పాలనలో బాన్సువాడ నియోజకవర్గం, కోటగిరి మండల ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ ప్రశ్నించారు. మహాధర్నా పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆయన అన్నారు.కోటగిరి మండల కేంద్రంలో…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాంనగర్ సర్పంచ్ స్వామి

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. 100 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌లో చేరిక నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.శుక్రవారం నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ మండలం రాంనగర్ గ్రామ సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్…

Read More

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత NTAకు UPSC తరహాలో స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని సూచన జూలై 26: E6 tv NEWS శివ ఠాకూర్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం…

Read More

పోతంగల్ మంజీరా నదిలో నుండి అక్రమ ఇసుక రవాణా…?

రాత్రివేళల్లో జోరుగా తరలింపు జరుగుతోందని స్థానికుల ఆరోపణలు అధికారులు నిఘా పెంచాలని ప్రజల డిమాండ్ కోటగిరి జూలై 13: E6 న్యూస్:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్ మంజీరా నది లో నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి ఇసుక రవాణా ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతోందని వారు చెబుతున్నారు. పోతంగల్ నుంచి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు, స్థానిక ట్రాక్టర్ల ద్వారా,…

Read More

రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం: గణేష్ బిగాల

హైదరాబాద్, జూలై 4 (E6 ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, పలు శాఖల్లో మంత్రిగా, పీసీసీ…

Read More

బ్రేకింగ్ న్యూస్: డిప్యూటీ సీఎం సీపీఆర్వో, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ కన్నుమూత

బ్రేకింగ్ న్యూస్ అలర్ట్ హైదరాబాద్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (CPRO), సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ (52) గారు సోమవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మధుసూదన్ మృతి పట్ల రాజకీయ, మీడియా రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జర్నలిజం రంగంలో తీరని లోటు: మధుసూదన్ అకాల మరణంపై మంత్రుల సంతాపం హైదరాబాద్, ఏప్రిల్ 27, 2026:తెలంగాణ…

Read More

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

28వ డివిజన్‌లో ప్రత్యేక పరిశీలన.. ఓటర్లందరూ ఎస్ఐఆర్‌లో భాగస్వాములు కావాలని పిలుపు ఇందూరు, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు. బుధవారం నగరంలోని 28వ డివిజన్‌లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులపై జిల్లా స్థాయి శిక్షణ

పీహెచ్‌సీ స్థాయిలోనే వ్యాధుల నమోదు – డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన 8 జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులను సమర్థవంతంగా గుర్తించడం, నమోదు చేయడం, పర్యవేక్షించడం లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్‌గా…

Read More

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

జూలై 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపు ఇందూరు జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్‌లోని ధర్నా చౌక్ వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్…

Read More

ప్రత్యేక ఓటర్ సమయ పై కాంగ్రెస్ సమీక్ష సమావేశం.

నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్)పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు వివిధ మండలాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. సమావేశంలో నగేష్ రెడ్డి మాట్లాడుతూ,…

Read More

SIR పై పూర్తి అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యవసరం అర్హులంతా తప్పనిసరిగా వివరాలు ధృవీకరించుకోవాలి – ఎమ్మార్వో సూచన భీంగల్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు వివరాలను తప్పులులేకుండా రూపొందించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR)…

Read More

తెలంగాణకు వరుణుడి నిరీక్షణ జులై చివరి 10 రోజులే కీలకం!

దేశవ్యాప్తంగా ఎల్-నినో తరహా ప్రభావం బలహీనంగా రుతుపవనాలు.. పెరుగుతున్న వర్షపాతం లోటు జూలై చివరికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరే అవకాశం చివరి పది రోజుల్లో వర్షాలు కురవకపోతే.. ఆగస్టుపైనే ఆశలు స్పెషల్ స్టోరీ: నిజామాబాద్ జులై 11: (E6 న్యూస్) శివ ఠాకూర్ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు పడటం లేదన్న ప్రశ్న ప్రస్తుతం రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ…

Read More

జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం!

ప్రస్తుతం పొడి వాతావరణం.. 15 నుంచి పరిస్థితుల్లో మార్పు జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం! జూలై 15: E6 న్యూస్ స్పెషల్ ఆర్టికల్: శివ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పొడి వాతావరణం, తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు త్వరలో కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…

Read More

గోదావరి పుష్కరాలు–2027కు పోలీసుల ముందస్తు సన్నాహాలు

డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమగ్ర సమీక్ష నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్) గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ,…

Read More

దశల వారిగా గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం మహిళా సమైక్య భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ, జలసిరి కార్యక్రమానికి శ్రీకారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు – విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే బైంసా, జూలై 23: E6 tv NEWS తిరుపతి గౌడ్. దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను,…

Read More

మహబూబాబాద్‌లో ఉద్రిక్తం: పోలీసుల పహారాలో బస్సుల నిలిపివేత.. ఆర్టీసీ కార్మికులకు అండగా సిపిఐ నేత తక్కెళ్ళపల్లి!

మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహారా మధ్య బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నించగా, సిపిఐ నేతలు కార్మికులతో కలిసి వాటిని అడ్డుకున్నారు.**గత పాలకుల గతే పడుతుంది – తక్కెళ్ళపల్లి హెచ్చరిక:**ఈ కార్యక్రమంలో పాల్గొన్న **సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు** మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరి వీడి…

Read More

బోడుప్పల్ భూ పోరాటం సందర్భంగా తెలంగాణ రక్షక సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్

బోడుప్పల్, జూలై 2: బోడుప్పల్‌లో నిర్వహించిన భూపోరాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపోరాటం సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు…

Read More

ఉద్యమకారులపై లాఠీచార్జి కాంగ్రెస్ ప్రభుత్వ పథకానికి నాంది: కల్వకుంట్ల కవిత

ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులా?.. మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమని మండిపాటు జూలై 2: (E6 న్యూస్- శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే వారిపై లాఠీచార్జీ చేసి, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల్లో 10% ఛార్జీల తగ్గింపు

నిజామాబాద్, జూలై 7: E6 న్యూస్(శివ ఠాకూర్). ప్రయాణికులు, వ్యాపారులు, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ఛార్జీలపై 10 శాతం తగ్గింపు అమలు చేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు, వ్యాపారులు వినియోగించుకొని తక్కువ ఖర్చుతో కార్గో, పార్సిల్ సేవలను పొందాలని ఆయన సూచించారు. అదేవిధంగా, నిజామాబాద్-1 డిపో కార్గో కార్యాలయంలో ఉన్న క్లెయిమ్ చేయని (Unclaimed) పార్సిళ్ల వేలంను జూలై 7, 2026న…

Read More

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి

పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సదస్సుకుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెరగాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ, అనంతరం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్…

Read More

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసా: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసా: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Read More

E6 న్యూస్ కథనానికి స్పందన, అనుమతులు లేని ఆసుపత్రి పై DMHO అధికారుల చర్యలు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి. నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా…

Read More

శ్రీనగర్–జాకోర గ్రామాల్లో 31 సీసీ కెమెరాల ప్రారంభం.

‘ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం’ – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో ప్రజల అప్రమత్తతే కీలకమని పిలుపు. ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం. వర్ని, జూలై 8: E6 క్రైమ్ (శివ ఠాకూర్).  ప్రజల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో మొత్తం 31 సీసీ…

Read More

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీస్ చేయాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్.

బోధన్, జూలై 2: E6 న్యూస్ ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేసి, విద్యార్థుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్టీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, బోధన్ పట్టణంలోని యూనిక్ హై స్కూల్‌కు చెందిన AP20TB6907 నంబర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బండారుపల్లి–శ్రీనివాస్ క్యాంప్…

Read More

జర్నలిస్టుల కుటుంబాలకు ‘వెల్నెస్’ భరోసా నిజామాబాద్‌లో ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ!

జర్నలిస్టుల కుటుంబాలకు ‘వెల్నెస్’ భరోసా: నిజామాబాద్‌లో ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ!

Read More

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచి 100 శాతం పూర్తి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి

భీంగల్‌లో పోలింగ్ బూత్‌ల పరిశీలన.. కాంగ్రెస్ నాయకులకు కీలక సూచనలు భీంగల్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో భీంగల్ పట్టణం వెనుకబడిన నేపథ్యంలో ఆయన శుక్రవారం అత్యవసరంగా భీంగల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి…

Read More

రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలభిషేకం.

జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.6 వేల…

Read More

విద్యా వ్యవస్థను కాపాడుకుందాం! విద్యార్థి సంఘాల పిలుపు.

బోధన్: E6 న్యూస్ (ఔరాద్ అశోక్). బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వీ (BRSV), బీవీఎఫ్ (BVF), జీవీఎస్ (GVS) గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ, బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాయని తెలిపారు. అయితే కొందరు విద్యార్థి సంఘాల నాయకులు స్వప్రయోజనాల…

Read More

ఖాకీ విధుల్లో.. ‘మానస’ మార్క్

అక్రమ మద్యంపై కోరడ జూలిపిస్తున్న యువ అధికారిని క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పెద్దపీట మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్సై బి. మానసకు ప్రత్యేక గుర్తింపు స్పెషల్ స్టోరీ: ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ మోర్తాడ్ : E6 న్యూస్ చేతిలో అధికారం ఉందని హడావుడి చేయరు.. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలకే పరిమితం కారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెడుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మోర్తాడ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి….

Read More

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్: నేడు బాధ్యతల స్వీకరణ!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం (మే 1) ఉదయం సరిగ్గా 11:05 గంటలకు ఆయన రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్నటి వరకు డీజీపీగా పనిచేసిన బి. శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో, ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను ఆనంద్‌కు అప్పగించింది.అనుభవజ్ఞుడైన అధికారి.. అంచెలంచెలుగా..1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్, తన సుదీర్ఘ కెరీర్‌లో…

Read More

ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు…

Read More

ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీలో ప్రజలకు అండగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోర్వా శ్యామ్.

బాసరలో ప్రత్యేక ఫారాల భర్తీ శిబిరం – అర్హులైన ప్రతి ఓటరు దరఖాస్తు సమర్పించాలని పిలుపు బాసర, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బాసర మండల కేంద్రంలోని బొర్రా గణేష్ గల్లీలో గణేష్ మందిరం వద్ద మంగళవారం ప్రత్యేకంగా ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీ శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ, ఫారాలను సక్రమంగా నింపించి సంబంధిత బీఎల్‌వోలకు అందజేశారు. ఈ సందర్భంగా…

Read More

మున్నూరుకాపు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ప్రత్యేక శిబిరం.

400 ఓటరు దరఖాస్తుల పూరణ – శిబిరాన్ని సందర్శించిన తహసీల్దార్, సూపర్‌వైజర్లు. ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).ముధోల్ మండల కేంద్రంలోని జీఎం ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మున్నూరుకాపు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో భాగంగా ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ ఓటరు దరఖాస్తులను తీసుకువచ్చి బీఎల్‌వోల సమక్షంలో యువ వాలంటీర్ల సహాయంతో సుమారు 400 ఫారాలను పూర్తి చేశారు….

Read More

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…

Read More

ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క భావోద్వేగ విజ్ఞప్తి: “సమ్మె విరమించండి.. చర్చలకు రండి”మేఘాలయ (షిల్లాంగ్):

ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క భావోద్వేగ విజ్ఞప్తి: “సమ్మె విరమించండి.. చర్చలకు రండి”

Read More

బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు: మానాల మోహన్ రెడ్డి

ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు భీంగల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రస్తుతం రాష్ట్రానికి శాపాలుగా మారాయని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. భీంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి…

Read More

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి కాలం చెల్లిన మందులా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్.

ఒక నెల మందులు ఇవ్వగా 22 రోజుల పాటు వాడినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ తప్పు జరిగిందని వైద్య సిబ్బంది క్షమాపణ చెప్పారని సీతారాం వాదన తల్లి, శిశువుకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి రుద్రూర్ జులై 19: E6tv NEWS (అశోక్ కాంబ్లే). నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ…

Read More

బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం.. 2,500 ఎకరాలకు సాగునీటి శుభవార్త

రైతులకు మేలు చేసే దిశగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చర్యలు బాసర, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్).స్వల్ప వర్షాలతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న బాసర మండల రైతులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుభవార్త అందించారు. బాసర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని శనివారం ప్రారంభించిన ఆయన, ఈ పథకం ద్వారా బాసర పరిసర ప్రాంతాల్లో సుమారు 2,500 ఎకరాల సాగుభూమికి నీరందుతుందని తెలిపారు. దీంతో రైతులు పంటల సాగును సకాలంలో…

Read More

కట్టుదిట్టమైన భద్రత మధ్య బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగం ఎన్నిక – ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి పారదర్శకత మధ్య జరిగింది. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం…

Read More

విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు!

ప్రజల చెంతకు లోకేష్: అర్జీలు స్వీకరిస్తూ, సమస్యల పరిష్కారానికి హామీ!రేపు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న విద్యాశాఖ మంత్రి.వివరాళ్లతో కూడిన వార్తా కథనం (News Content)విశాఖపట్నం (E6TV ప్రతినిధి):రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ విమానాశ్రయంలో కూటమి ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.పర్యటనలో భాగంగా, తనను కలవడానికి వచ్చిన ప్రజల నుండి మంత్రి లోకేష్ స్వయంగా అర్జీలను…

Read More

భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం: బెర్లిన్‌లో జర్మనీ విదేశాంగ మంత్రితో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ

​భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం: బెర్లిన్‌లో జర్మనీ విదేశాంగ మంత్రితో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ ​బెర్లిన్/న్యూఢిల్లీ: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి నిన్న బెర్లిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జర్మనీ విదేశాంగ మంత్రి డాక్టర్ జోహాన్ వాడెఫుల్‌తో ఆయన సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడం, కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ​కీలక అంశాలు: ​ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై కూడా…

Read More

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కమ్మర్‌పల్లి, తేదీ: 04-07-2026 (E6 న్యూస్ తాటిపల్లి గంగాధర్) కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులు అందుకున్న రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల…

Read More

విద్యార్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి

ప్రభుత్వ హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తున్నాం – బీజేపీ విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే నిజామాబాద్ జులై 18: E6 tv NEWS (శివ ఠాకూర్). విద్యార్థులను రెచ్చగొట్టేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్…

Read More

ముధోల్ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి ఫలితమే: ప్రిన్సిపాల్, అధ్యాపకుల కృతజ్ఞతలు స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానున్న అధ్యయన కేంద్రం ముధోల్, జూలై 25: (E6 tv NEWS:తిరుపతి గౌడ్)ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ముధోల్‌తో పాటు పరిసర…

Read More

ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకం..

ప్రైవేట్ స్కూళ్ల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం – ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి. నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్).ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం, విద్యార్థి కేంద్రిత విద్యా విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని…

Read More

అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ డిల్లోడ్ గన్‌రాజ్‌కు పోలీస్ కమిషనర్ సన్మానం

జాతీయ, అంతర్జాతీయ విజయాలతో నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిన యువ క్రీడాకారుడు క్రమశిక్షణ, కఠోర సాధనే విజయానికి మూలం – సీపీ సాయి చైతన్య నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్జాతీయ, అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో వరుస విజయాలు సాధిస్తూ నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తున్న యువ క్రీడాకారుడు డిల్లోడ్ గన్‌రాజ్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల ముంబైలో…

Read More

ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలి

జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ కు ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి…

Read More

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

Read More

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యం

PM RAHAT, PM RAH-VEER పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి : పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో సకాలంలో వైద్యసేవలు అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం PM RAHAT మరియు PM RAH-VEER పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…

Read More

కొత్త పార్టీ పేరు “తెలంగాణ రాష్ట్ర సేన” కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు
గుంటనక్క చేతిలో కేసీఆర్… ఉద్యమ రథం దారితప్పింది

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలుగుంటనక్క చేతిలో కేసీఆర్… ఉద్యమ రథం దారితప్పిందిఇక మనమే అసలైన ప్రతిపక్షంకవిత సంచలన గర్జనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశకోకిల డిజిటల్ మీడియాహైదరాబాద్ న్యూస్ డెస్క్:తెలంగాణ రాజకీయాల్లో భారీ కలకలం రేపే పరిణామంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ వేదికను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. ఆవిర్భావ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా గుంటనక్క చేతిలో కేసీఆర్… ఆయన మన…

Read More

50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు

1976–77 పదవ తరగతి బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా.. గురువులకు ఘన సన్మానం.. మధుర జ్ఞాపకాలతో సందడి నిజామాబాద్, జూలై 26: E6 tv NEWS: (శివ ఠాకూర్).నిజామాబాద్ నగరంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలలో 1976–77 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ ఆత్మీయ కలయికలో పూర్వ విద్యార్థులంతా కుటుంబ సభ్యుల్లా…

Read More

జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!

జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!కేరళలో తీవ్ర సంచలనం సృష్టించిన జీడిపప్పు అభివృద్ధి సంస్థ (KSCDC) అవినీతి కేసులో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ హనీష్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ మేరకు హనీష్ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు…

Read More

ట్రంప్ పగ: “నువ్వు పనికిరాని దానివి!” – మెగిన్ కెల్లీపై నిప్పులు చెరిగిన అమెరికా అధ్యక్షుడు!

మెగిన్ కెల్లీపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు: “ఆమె ఒక ఓవర్‌రేటెడ్ వ్యక్తి” అంటూ సోషల్ మీడియాలో ఫైర్!వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత మెగిన్ కెల్లీ మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్, మెగిన్ కెల్లీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమెను “ఓవర్‌రేటెడ్” (అర్హతకు మించి గుర్తింపు పొందిన వ్యక్తి) అని అభివర్ణిస్తూ, ఆమె ఒక “లూజర్” అని మండిపడ్డారు.వివాదానికి…

Read More

గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి

40 కోట్ల సంతకాల సేకరణలో అందరూ భాగస్వాములు కావాలిఈనెల 27న గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ యాత్రను విజయవంతం చేయండి: రాజ్ పురోహిత్ సింగ్ నిజామాబాద్ జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలోని శ్రీకృష్ణ మందిర్ గోశాల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ జిల్లా ప్రతినిధులు రాజ్ పురోహిత్…

Read More

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 30 ఎంబిబిఎస్ సీట్లు

ఎన్ఎమ్‌సీ నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అధికారిక అనుమతి నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో శుభవార్త లభించింది. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 120 నుంచి 150కు పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్‌సీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం ఈ…

Read More

పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం.

ఐదు రోజులపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు.. 50 ఏళ్లు పైబడిన సిబ్బంది, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బ్రిడ్జ్ గ్యాప్, ఇందూర్ క్యాన్సర్, మేఘనా డెంటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స సాధ్యమని పోలీస్ కమిషనర్ సూచన ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్‌రే, ఆర్‌బీఎస్, పీఎస్‌ఏ సహా పలు ఉచిత వైద్య పరీక్షలు నిజామాబాద్, జూలై 21: E6…

Read More

క్రీడాకారుల సమస్యలపై స్పందించిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

వారం రోజుల్లో ఇండోర్ స్టేడియం ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ. నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ ప్రతినిధి (శివ ఠాకూర్) నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై వెంటనే స్పందించి ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ…

Read More

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం వేల్పూర్, జూలై 2: E6 న్యూస్– T, గంగాధర్ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Read More

హరీష్ రావు ఆరోపణలు పచ్చి అబద్ధం.. గ్రామీణ రోడ్ల అభివృద్ధిని చూసి ఓర్వలేకే విషప్రచారం: మంత్రి సీతక్క ఫైర్!

హైదరాబాద్ (E6TV ప్రతినిధి):హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారుల నిర్మాణపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే హరీష్ రావు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.అసలు వాస్తవాలు ఇవే: మంత్రి సీతక్క క్లారిటీదేశవ్యాప్త నమూనా: HAM విధానం కొత్తదేమీ కాదని, 2016 నుంచే కేంద్ర ప్రభుత్వ సంస్థ NHAI…

Read More

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండేతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల పాల్గొనడం జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ…

Read More

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల వరకు పోరాటం కొనసాగుతుంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

బీజేపీ ఆధ్వర్యంలో ‘ఇందూరు రణభేరి’ నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు ఇందూరు, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిలో కమిషన్లకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ…

Read More

మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రగతి నగర్‌లో ఆల్విన్ మాజీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రగతి నగర్‌లో ఆల్విన్ మాజీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

Read More

మోకుదెబ్బ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి

మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపు గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని బీఎంకే బ్యాంకెట్ హాల్‌లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని…

Read More

సాలూరా మండలంలో మంజీరా నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

సాలూరా, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. సాలూరా మండలంలోని మంధర్నా, తగ్గేలి గ్రామాల పరిసరాల్లో ప్రవహిస్తున్న మంజీరా నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ఇసుకతో నిండిన ట్రాక్టర్లు బోధన్ వైపు తరలిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. తగ్గేలి గ్రామ సమీపంలోని మంజీరా నది గర్భంలో డోజర్ల సహాయంతో రాత్రి సమయంలో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు….

Read More

హైదరాబాద్‌లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!

హైదరాబాద్‌లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!ఈ6TV వెబ్ డెస్క్, హైదరాబాద్:గ్లోబల్ ఐటీ హబ్, ఆధునిక మౌలిక వసతులకు కేరాఫ్ అడ్రస్ అయిన భాగ్యనగరంలో కరెంట్ కోతలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త గాలి వీచినా, వాన పడినా గంటల తరబడి కరెంట్ నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సాంకేతిక లోపాలు ఎందుకు వస్తున్నాయి? TGSPDCL (తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) ఎదుర్కొంటున్న సవాళ్లు…

Read More

ముధోల్‌లో రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళాకు సన్నాహాలు

ముధోల్: జులై 9 : E6 న్యూస్, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా ఏర్పాట్లపై ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో విజ్ఞాన మేళా యోజన బైఠక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం ప్రాంత విజ్ఞాన మేళా యోజన,…

Read More

ఈ నెల 23లోగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలి

S.I.R.లో నమోదు చేయకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి.. ఒకే చోట కూర్చుని ప్రక్రియ నిర్వహించొద్దు: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, జూలై 8:E6 న్యూస్ (తాటికొండ గంగాధర్)బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హ ఓటరు ఈ నెల 23వ తేదీలోగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (S.I.R.) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్…

Read More

తెలంగాణలో చెదురుమదురు జల్లులు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

నిజామాబాద్ జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్రంలో గత 24 గంటలుగా పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విస్తృతంగా కాకుండా పరిమిత ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. టీజీడీపీఎస్ (TGDPS) వివరాల ప్రకారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 17 మిల్లీమీటర్లు, నారాయణపేట…

Read More

అక్రమ సంబంధం, కుటుంబ విభేదాలే హత్యకు కారణం

రూ.6 లక్షల సుపారీతో అస్లాం ఖాన్ హత్య – అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన నిర్మల్ పోలీసులు – ఎస్పీ జానకి షర్మిల నిర్మల్, జూలై 25: E6 tv NEWS, Md అమీనుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అక్రమ సంబంధం, కుటుంబ విభేదాల నేపథ్యంలో…

Read More

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు: ఆర్టీసీ సమ్మె విరమణకు విజ్ఞప్తి మరియు ఉద్యోగుల పెండింగ్ నిధుల సర్దుబాటుకు మంత్రుల జీతాల్లో కోత

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం, కార్మికులు తక్షణమే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందంతో శుక్రవారం చర్చలకు రావాలని కార్మిక…

Read More

నేరాల నియంత్రణపై ఉక్కు పాదం

పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా మరింత పటిష్టం అక్రమ కార్యకలాపాలపై నిరంతర దాడులు.. అవసరమైతే పీడీ యాక్ట్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి పోలీస్ అధికారులకు సీపీ పి. సాయి చైతన్య ఆదేశాలు నిజామాబాద్ జులై 10 : E6 క్రైమ్ న్యూస్, శివ ఠాకూర్ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం…

Read More

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

Read More

రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలభిషేకం.

జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.6 వేల…

Read More

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పాలనలోనూ మునుపెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును దక్కించుకున్న శుభసందర్భంగా అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో డిన్నర్ విత్ ద…

Read More

హుస్నాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి.

పెద్ద ఎత్తున మమేకమై, గౌడ సంఘాల ఐక్యతను చాటాలి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపు నిర్మల్, జూలై 12: E6న్యూస్ తిరుపతి గౌడ్:హుస్నాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గౌడ సంఘం నాయకులు, ప్రతినిధులు, గౌడ సోదరులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు….

Read More

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం

నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు నిజామాబాద్, జూలై 26: (E6 tv NEWS). నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు నీటిలో నలుగురు విద్యార్థులు మునిగిపోగా, వారిలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ…

Read More

6.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 5: E6 న్యూస్ నిజామాబాద్.నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.6.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో మార్కెట్ కమిటీ ఆధునీకరణ, షెడ్ల…

Read More

SIR ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

అపోహలు తొలగించడంలో BLAలదే కీలక పాత్ర: ఆర్మూర్ సదస్సులో పిలుపుఆర్మూర్ (నందిపేట్), జూన్ 29 (E6TV వెబ్ న్యూస్):ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో ఉన్న అపోహలను, సందేహాలను తొలగించడంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఫ్రంట్‌లైన్ వారియర్స్ లాగా చొరవ చూపాలని ఆయన స్పష్టం…

Read More

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం..?

చేయని నేరానికి జరిమానా విధించారని యువకుడి ఆరోపణ రైలు పట్టాలపై విషం తాగి ఆత్మహత్యాయత్నం.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బోధన్, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ విధించిన జరిమానా, వేధింపుల కారణంగానే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెలువడ్డాయి. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తాము చేయని నేరానికి…

Read More

శభాష్ రుద్రూరు పోలీసులు..!

రోడ్డు మరమ్మత్తుల వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ మళ్లింపు – పోలీసుల చొరవకు ప్రజల ప్రశంసలు రుద్రూరు, జూలై 13: E6 న్యూస్, ఔరాద్ అశోక్ నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తుల పనుల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా రుద్రూరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతంలో కాంట్రాక్టర్లు తప్పనిసరిగా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ అవి లేకపోవడంతో పోలీసులు స్వయంగా చర్యలు చేపట్టారు. ప్రమాదాలను…

Read More

మహిళా బిల్లుపై బీజేపీ డ్రామాలు.. అమలులో ఉద్దేశపూర్వక ఆలస్యం: హైదరాబాద్ డీసీసీ చీఫ్ సైఫుల్లా ధ్వజం

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న తీరుపై హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారతపై బీజేపీ చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని కొట్టిపారేశారు.అమలుపై చిత్తశుద్ధి లేదు..2023 సెప్టెంబర్‌లోనే కాంగ్రెస్ మరియు ఇతర మిత్రపక్షాల మద్దతుతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, కేంద్రం దానిని అమలు చేయకుండా కాలయాపన…

Read More

విషమిచ్చి చిరుతపులిని హతమార్చిన ఇద్దరు అరెస్ట్

శరీర భాగాలను విక్రయించి డబ్బు సంపాదించాలన్న యత్నం.. మరో నలుగురు పరారీలో… భీంగల్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని విషమిచ్చి హతమార్చిన ఘటనలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖకు అందిన సమాచారం మేరకు కమ్మర్‌పల్లి రేంజ్ అధికారి కే. అనిత ఆధ్వర్యంలో అధికారులు…

Read More

ఆర్మూర్‌లో రాజకీయ వేడి.. సవాళ్లు – ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంకాపూర్ లో ఉద్రిక్త వాతావరణం, అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఆర్మూర్, జూలై 20: E6 tv NEWS, (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో బీజేపీ నిర్వహించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రణభేరి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే…

Read More

18 ఏళ్లుగా ఇందూరు జిల్లాను ఎడారిగా మార్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే: దినేష్ పటేల్ కులాచారి

సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శ – రైతులను మోసం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలకు హెచ్చరిక నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్). గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇందూరు జిల్లా ఎడారిగా మారుతోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

Read More

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి : ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం.. రూ.5 వేల నగదు ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు…

Read More

SIR ప్రక్రియలు భాగస్వాములైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా, ఆర్, భూపతిరెడ్డి.

ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేసిన ఎమ్మార్వో, బీఎల్‌వోలు ఏ ఒక్క ఓటు పోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి : ఎమ్మెల్యే నిజామాబాద్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో వినయ్ సాగర్‌తో పాటు బీఎల్‌వోలు రజిత, లావణ్య, నరేష్‌లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్యూమరేషన్…

Read More

కొత్త హెచ్ఐవీ కేసులను త్వరగా గుర్తించాలి

నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్: E6 న్యూస్: శివ ఠాకూర్ జిల్లాలో ఇంకా గుర్తించాల్సిన హెచ్ఐవీ కేసులను త్వరితగతిన గుర్తించి, బాధితులను చికిత్స పరిధిలోకి తీసుకురావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు – కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు; ఇది తెలంగాణ రైతాంగ విజయం!by thou uyy

భీంగల్ (నిజామాబాద్ జిల్లా) – E6TV స్పెషల్ రిపోర్ట్ (శివ):కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు హైకోర్టు తీర్పుతో తెరపడిందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్, బీజేపీల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.మండల పార్టీ అధ్యక్షులు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

వసతులు మేము కల్పిస్తాం.. మెరుగైన వైద్యం మీరందించండి : ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జీజీహెచ్ అభివృద్ధి సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. కలెక్టర్ ఇలా…

Read More

విద్యా సంస్థలపై దాడులు, బందులకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు: CP సాయి చైతన్య.

నిజామాబాద్, జూలై 2: నిజామాబాద్. (E6 క్రైమ్ న్యూస్- శివ ఠాకూర్) విద్యాసంస్థలపై దాడులు చేయడం, యాజమాన్యాన్ని బెదిరించడం, విద్యాసంస్థల బంద్‌లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో వ్యక్తులు పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా…

Read More

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉదృతం చేయాలి: పి, రామకృష్ణ.

గాడ్కోల్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి ఘనంగా నిర్వహణ సిరికొండ, జూలై 4: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 80వ…

Read More

రాజకీయ ప్రకంపనలు – ఆప్ కోటలో ‘రాఘవ’ చిచ్చు

న్యూఢిల్లీ / హైదరాబాద్ — దేశ రాజధాని రాజకీయాల్లో పెను తుపాను చెలరేగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి అత్యంత నమ్మకస్తుడు, ఆ పార్టీ ‘పోస్టర్ బాయ్’గా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఊహించని షాక్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు కుడిభుజంగా ఉన్న చద్దా, ఇప్పుడు ఆ చేత్తోనే ‘కమలం’ పువ్వును అందుకున్నారు.హెడ్ లైన్: “ఆప్ క్లీన్ స్వీప్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా! కేజ్రీవాల్ సామ్రాజ్యంలో అతిపెద్ద తిరుగుబాటు!”అర్ధరాత్రి వ్యూహం.. పట్టపగలు విస్ఫోటనం!కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో పొసగడం…

Read More

ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు పంపిణీ.. నిజామాబాద్ జిల్లాలో 99 శాతం లక్ష్యం పూర్తి!

ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు పంపిణీ.. నిజామాబాద్ జిల్లాలో 99 శాతం లక్ష్యం పూర్తి! నిజామాబాద్, జూన్ 29:జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించుకోని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి, వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండో రోజు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, అలాగే…

Read More

తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

జూలై 25: E6 tv NEWS ప్రతినిధి. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం ఉండటంతో భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.ధర్మం,…

Read More

‘ఇందూర్ రణభేరి’ సెగతో కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి డైవర్షన్ రాజకీయమే: బీజేపీ

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే కాంగ్రెస్ లక్ష్యం: దినేష్ పటేల్ కులాచారి బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు రాలేదు.. బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి మద్దతు నిజామాబాద్,జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) ఇందూర్ రణభేరి కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విశేష స్పందనతో కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఎమ్మెల్యే…

Read More

గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

ఏడాదిలో 7 టన్నుల గంజాయి స్వాధీనం – అంతర్‌రాష్ట్ర ముఠాలపై ఉమ్మడి ఆపరేషన్లు NCB, DRI, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంయుక్త దాడులు ఆల్ప్రాజోలమ్, గంజాయి కేసుల్లో భారీ స్వాధీనం – RNCC కఠిన చర్యలు 165 మంది వినియోగదారులకు డీ-అడిక్షన్ చికిత్స – 492 అవగాహన కార్యక్రమాలు యాంటీ డ్రగ్ సోల్జర్”గా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి: పోలీసులు నిజామాబాద్ జూలై 27:E6 tv NEWS శివ ఠాకూర్. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా,…

Read More

కాకతీయ హిల్స్ రోడ్డు నెం.11లో అక్రమ డంపింగ్‌పై అధికారుల స్పందన.. తక్షణ చర్యలకు హామీ!

కాకతీయ హిల్స్ రోడ్డు నెం.11లో అక్రమ డంపింగ్‌పై అధికారుల స్పందన.. తక్షణ చర్యలకు హామీ!కాకతీయ హిల్స్ (Kakatiya Hills):కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Kakatiya Hills Welfare Association – KHWA) చేసిన విజ్ఞప్తికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ (CMC) అధికారులు సానుకూలంగా స్పందించారు. కాలనీలోని రోడ్డు నెం.11లో జరుగుతున్న అక్రమ డంపింగ్ సమస్యను పరిశీలించడానికి CMC డిప్యూటీ కమిషనర్ శ్రీ బాలకృష్ణ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి రూపాదేవి గారు స్వయంగా కాకతీయ హిల్స్‌ను…

Read More

నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి మరో ముందడుగు

రాజీవ్ గాంధీ ఆడిటోరియం, లింబాద్రి గుట్ట, సిద్ధుల గుట్ట అభివృద్ధికి నిధుల మంజూరు నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు వెల్లడించింది. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల…

Read More

అరెస్టులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ నిరసన – కేంద్ర మంత్రుల రాజీనామాకు డిమాండ్ నిర్మల్‌లో ధర్నా, దిష్టిబొమ్మ దహనం – కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు నిర్మల్, జూలై 22 (E6 tv NEWS: Md అమీనుద్దీన్): నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ…

Read More

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్ జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి). కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ…

Read More

కార్మిక లోకానికి సీఎం రేవంత్ రెడ్డి ‘మే డే’ శుభాకాంక్షలు!

హైదరాబాద్: శ్రమనే నమ్ముకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్న కార్మిక సోదరులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. కష్టం చేసే ప్రతి చేతికి విలువనిస్తూ.. సమానత్వం, న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.ముఖ్యమంత్రి సందేశంలోని ముఖ్యాంశాలు:శ్రమకు గౌరవం: “ప్రతి కార్మికుడి చెమట చుక్కలో సమాజ భవిష్యత్తు ఉంది. వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కుల పరిరక్షణే మా ప్రజాప్రభుత్వ లక్ష్యం.”గిగ్ వర్కర్లకు అండ: డెలివరీ బాయ్స్ వంటి గిగ్…

Read More

తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా పావని మరణం గ్రామానికి తీరని లోటు : మానాల మోహన్ రెడ్డి ఏర్గట్ల జూలై 11: E6 న్యూస్ తాటికొండ గంగాధర్బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ కీర్తిశేషులు బెజ్జారం పావని ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పావని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా…

Read More

ఘనంగా కాకతీయ హిందూ మహా సమ్మేళనం

కులాలు ప్రాంతాలు రాజకీయాలను పక్కనపెట్టి  మనం హిందువులమని భావించి జీవించినప్పుడు మన దేశాన్ని, ధర్మాన్ని, ఆలయాన్ని కాపాడుకోగలమని మాడుగుల శశిభూషణ సోమయాజి గురుజి అన్నారు. ప్రగతి నగర్ కాకతీయ హిందూ మహా సమ్మేళన ఉత్సవ సమితి అధ్యక్షులు పవన్ దొడ్డ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాడుగుల శశిభూషణ సోమయాజి గురూజీ , డాక్టర్ భువనేశ్వరి మారేపల్లి, వాసు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ మహాసమ్మేళన ఈ కార్యక్రమంలో చిన్నారుల భరతనాట్యం ,భక్తి పాటలు, హనుమాన్…

Read More

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్: మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు

అమరావతి (E6TV వెబ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.తొలి మహిళా సీజేకు శుభాకాంక్షలుఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై రికార్డు సృష్టించిన జస్టిస్ లీసా గిల్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆమె రాకతో రాష్ట్ర…

Read More

గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స

మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్ జూలై 9: E6 న్యూస్ హెల్త్ :శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన…

Read More

గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స

మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్: E6 న్యూస్ హెల్త్: శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన వైద్యులు…

Read More

రైతు ఆశీర్వాద సభ కాదు కాంగ్రెస్కు రైతుల శాపనార్థాల సభ: వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “రైతు ఆశీర్వాద సభ” వాస్తవానికి రైతుల “శాపనార్థాల సభ”గా మారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. వేల్పూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు బకాయిలు చెల్లించకపోవడం, యూరియా కొరత, వడ్ల కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్…

Read More

భీంగల్‌లో జల శక్తి అభియాన్–జన భాగీదారి కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన “క్యాచ్ ది రైన్” కార్యక్రమంతో భూగర్భ జలాల పరిరక్షణకు పిలుపు సీజనల్ వ్యాధుల నివారణపై మున్సిపల్ కమిషనర్ సూచనలు భీంగల్, జూలై 28: E6 tv NEWS,(T, గంగాధర్)కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “జల శక్తి అభియాన్–జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ…

Read More

హైకోర్టు న్యాయమూర్తులకు నిజామాబాద్‌లో ఘన స్వాగతం

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్‌లు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం…

Read More

ప్రతి జీవితం అమ్మ ప్రేమతోనే మొదలు.. మాతృమూర్తులకు పల్లా శ్రీనివాసరావు

శుభాకాంక్షలు!అమరావతి: మాతృ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని తల్లులందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్య అంశాలు:అమ్మే తొలి గురువు: ప్రతి మనిషి జీవితం అమ్మ ప్రేమ, త్యాగం, లాలనతోనే ప్రారంభమవుతుందని పల్లా పేర్కొన్నారు. కరుణకు మారుపేరుగా, కుటుంబానికి వెన్నుముకగా నిలిచేది తల్లేనని ఆయన కొనియాడారు.సమాజానికి దిశానిర్దేశం: తల్లుల అంకితభావం వల్లే కుటుంబాలు బాగుంటాయని, తద్వారా సమాజానికి సరైన దిశానిర్దేశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మానవత్వం, విలువలు,…

Read More

రణభేరి కాదు.. రాద్ధాంత భేరి: బీజేపీ, బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శలు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్‌ఎస్ బకాయిలను కాంగ్రెస్‌పై నెట్టివేయడం రాజకీయ దివాళాకోరుతనం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపు నిజామాబాద్, జూలై 18 (E6 tv NEWS ప్రతినిధి): బీజేపీ చేపట్టిన కార్యక్రమం “రణభేరి” కాదని, అది కేవలం “రాద్ధాంత భేరి” మాత్రమేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం…

Read More

పోలవరం @ టూరిజం హబ్: 1,500 ఎకరాల్లో మెగా ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు నయా మాస్టర్ ప్లాన్!

పోలవరం @ టూరిజం హబ్: 1,500 ఎకరాల్లో మెగా ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు నయా మాస్టర్ ప్లాన్!

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి MHO.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్). కమ్మర్పల్లి మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం వల్ల వ్యాధులను నివారించవచ్చని సూచించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల వంటశాలలో పనిచేసే వంట…

Read More

కామారెడ్డి జిల్లా RMP, PMP మహిళా విభాగం నూతన కార్యవర్గ ఎన్నిక

కామారెడ్డి జిల్లా RMP, PMP మహిళా విభాగం నూతన కార్యవర్గ ఎన్నిక!****కామారెడ్డి:** జిల్లాలోని RMP, PMP వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం బలోపేతానికి కీలక అడుగు పడింది. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో మహిళా విభాగం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.### **ప్రధాన బాధ్యులు వీరే:**జిల్లా అధ్యక్షులు **నిజ్జన విట్టల్** అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. నూతన కార్యవర్గ సభ్యులు:| పదవి | పేరు ||—|—|| **గౌరవాధ్యక్షురాలు** | చామరం విమల ||…

Read More

ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి.

బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలో నెరవేరుస్తామని స్పష్టం నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష పేరుతో నాటకాలు…

Read More

భీంగల్ పట్టణంలో గాయత్రీ కో-ఆపరేటివ్ బ్యాంక్ కాప్రి గోల్డ్ లోన్ శాఖ ను ప్రారంభించిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి.

భీంగల్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 85వ శాఖతో పాటు కాప్రి గోల్డ్ లోన్ శాఖను రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ప్రారంభమై నేటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 85 శాఖలతో రూ.4,500 కోట్ల టర్నోవర్ సాధించడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు…

Read More

వర్షభావ పరిస్థితుల్లో రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలి

అన్నిరకాల పంటలకు రైతు యూనిట్‌గా పంటల బీమా అమలు చేయాలి: ఏఐయూకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్ ఆర్మూర్, జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి) రాష్ట్రంలో ఏర్పడిన వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు అన్నిరకాల పంటలకు రైతును యూనిట్‌గా తీసుకొని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకెఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆర్మూర్ పట్టణంలోని కుమార్…

Read More

అమృతాపూర్ లో SIR కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి.

జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్). డిచ్‌పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా ఎన్నికల అధికారులు, డిచ్‌పల్లి ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, ఆర్ఐ భూపతి ప్రభు, బీఎల్‌ఓలు కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ దినేష్ పటేల్ కులాచారికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి భారత పౌరుని ప్రాథమిక హక్కు…

Read More

పి.ఆర్.సి. బకాయిలు వెంటనే చెల్లించాలి

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల వినతి భైంసా, జూలై 26: (E6 tv NEWS: తిరుపతి గౌడ్) రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు, పెండింగ్ అలవెన్సులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు,…

Read More

నింగిలో మబ్బుల దుప్పటి.. భారత్‌ను కప్పేసిన వర్ష మేఘాలు: ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో సంచలన దృశ్యాలు!

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు చెందిన శాటిలైట్ తీసిన చిత్రాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తే అసలు భారతదేశ భూభాగమే కనిపించనంతగా.. దాదాపు 95 శాతం దేశాన్ని దట్టమైన మేఘాలు ఆవరించేశాయి.భూమధ్యరేఖకు 36,000 కి.మీ ఎత్తు నుంచి..భారత వాతావరణ శాఖ (IMD) అందించిన వివరాల ప్రకారం.. ఇస్రోకు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహాలు జూలై 22న తెల్లవారుజామున…

Read More

తమిళ గడ్డపై ‘చంద్ర’ బాబు ఎలక్షన్ వార్.. డీఎంకే, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం!

తమిళ గడ్డపై ‘చంద్ర’ బాబు ఎలక్షన్ వార్.. డీఎంకే, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం!తళి (కృష్ణగిరి జిల్లా):తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కృష్ణగిరి జిల్లాలోని తళి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.తమిళనాడు నా సొంత గడ్డ లాంటిదే..సభలో ప్రసంగించిన చంద్రబాబు…

Read More

నిక్షయ మిత్రలుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నమోదు చేపట్టాలి

టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరం: డీఎంహెచ్‌ఓ డా. బి. రాజశ్రీ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS: శివ ఠాకూర్).జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS) విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…

Read More
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన

ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ – వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో వ్యవసాయ సాంకేతిక చర్చలుఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ వ్యవసాయానికి కొత్త మార్గం – ఇన్నోవేషన్ హబ్‌ల ప్రతిపాదన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మూడో రోజు **వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)**ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యవసాయ సాంకేతిక పరిశోధకులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఆధునీకరణ కోసం…

Read More

దేశభక్తి కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఆవిష్కరణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ఇందూరు, జూలై 23:E6 tv NEWS శివ ఠాకూర్ దేశభక్తి, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలను కేంద్రబిందువుగా చేసుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని నిజామాబాద్-2 ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ జయంతినాడే…

Read More

కరెంట్ బిల్లు నెలాఖరులో చెల్లిస్తే వెంటనే కరెంట్ కట్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?

హైదరాబాద్, E6TV ప్రత్యేక కథనం ప్రతి నెల కరెంట్ బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందని చెప్పి, కొంతమంది వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను వెంటనే నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ లైన్‌మెన్‌లు లేదా కాంట్రాక్ట్ సిబ్బంది వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయితే ప్రశ్న ఏమిటంటే… బిల్లు డ్యూ డేట్ దాటిందని వెంటనే కరెంట్ కట్ చేయవచ్చా? చట్టం ప్రకారం సమాధానం – లేదు. విద్యుత్ చట్టం (Electricity Act, 2003) సెక్షన్ 56 ప్రకారం,…

Read More

ఆధునిక నిర్మాణ సాంకేతికతతో నాణ్యమైన భవనాల నిర్మాణం

షేర్ వాల్ టెక్నాలజీతో మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలోనూ ఈ సాంకేతికత అమలుకు కృషి చేస్తామని వెల్లడి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్ వాల్ (Shear Wall) టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…

Read More

ఇస్కాన్ కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతోంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇస్కాన్ కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతోంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ నిజామాబాద్‌లో జగన్నాథుని రథయాత్రకు ఘన ప్రారంభం – జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని సూచన నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తున్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలోని గంజి కమాన్ వద్ద నిర్వహించిన జగన్నాథుని రథయాత్రను ఆయన…

Read More

బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…

Read More

హిట్‌మ్యాన్ బర్త్‌డే జోష్.. చెన్నై గడ్డపై అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్!

ముంబై/చెన్నై: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టులో సందడి నెలకొంది. టీమ్ ఐకాన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ పుట్టినరోజు వేడుకలతో మొదలైన సంబరాలు, ఇప్పుడు చెన్నై వేదికగా జరగనున్న తదుపరి పోరు వరకు చేరాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:అర్ధరాత్రి రోహిత్ బర్త్‌డే సెలబ్రేషన్స్మే 1వ తేదీన రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది సమక్షంలో రోహిత్ కేక్…

Read More

నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*

*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు* *ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* *కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్‌వో అభినందనలు* నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు….

Read More

ఎన్‌టిఆర్ భవన్‌లో అంబరాన్నంటిన చంద్రబాబు జన్మదిన సంబరాలు

76 అడుగుల కటౌట్‌పై డ్రోన్‌ల ద్వారా పూల వర్షం.. ఘనంగా వేడుకలు నిర్వహించిన టీటీడీపీహైదరాబాద్, ఏప్రిల్ 20, 2026:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సోమవారం హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఆకట్టుకున్న డ్రోన్ షో.. పూల వర్షంఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ…

Read More

కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం

బాసర జూలై 2: E6 న్యూస్. బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల మిశ్రమ బంగారం,…

Read More

ఎల్‌నినో ప్రభావం పై రాష్ట్ర కేబినెట్ ఆందోళన.. కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం.

వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణకు మంత్రివర్గం ఆమోదం తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ముందస్తు చర్యలకు ఆదేశాలు ప్రజాభవన్‌లో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు.. రైతులకు ఆరుతడి పంటల సాగుపై సూచనలు ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు.. ట్రాన్స్‌జెండర్లకు మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం హైదరాబాద్, జూలై 18: E6 tv News.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర…

Read More

వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం.

జూలై 28–30 తేదీల్లో బోధన్‌లో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య వెల్లడి బోధన్, జూలై 6: E6 న్యూస్(ఔరాద్ అశోక్). వికలాంగుల పెన్షన్ పెంపు, హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య…

Read More

విద్యా వ్యవస్థను కాపాడుకుందాం! విద్యార్థి సంఘాల పిలుపు.

బోధన్: E6 న్యూస్ (ఔరాద్ అశోక్). బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వీ (BRSV), బీవీఎఫ్ (BVF), జీవీఎస్ (GVS) గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ, బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాయని తెలిపారు. అయితే కొందరు విద్యార్థి సంఘాల నాయకులు స్వప్రయోజనాల…

Read More

నందిపేట్ తహసిల్దార్‌పై సస్పెన్షన్ వేటు..?

నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు – సబ్ కలెక్టర్ విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్య నందిపేట్ జూలై 17 : E6 న్యూస్, శివ ఠాకూర్. నందిపేట్ తహసిల్దార్ సంతోష్ రెడ్డిపై జిల్లా యంత్రాంగం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించడం, లబ్ధిదారులతో కుమ్మక్కై అక్రమ మార్గంలో పట్టాలు జారీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనను సస్పెండ్ చేస్తూ…

Read More

వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధుల ముప్పు…!

జ్వరం, డెంగ్యూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే..! ఉక్కపోత, చిరుజల్లులతో వైరస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధులకు చెక్ స్వయంగా మందులు వాడొద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి ప్రత్యేక కథనం నిజామాబాద్, జూలై 12 | E6 న్యూస్ ప్రతినిధి : శివ ఠాకూర్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి….

Read More

ఏపీలో నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీల పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య, ప్రజారోగ్య రంగాల్లో పెనుమార్పులు తెచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీపీపీ (PPP) విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లోపు పట్టాలెక్కించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్‌మెంట్ సమీక్షా సమావేశంలో ఆయన ఈ దిశగా దిశానిర్దేశం చేశారు.రెండు దశల్లో 10 మెడికల్ కాలేజీల నిర్మాణంరాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం…

Read More

గుట్కా, డ్రగ్స్ వాడితే ప్రాణహాని తప్పదు: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక

హైదరాబాద్: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం రాయదుర్గంలోని సత్త్వ నాలెడ్జ్ పార్క్‌లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన **’నోటి క్యాన్సర్ మరాథాన్’**కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, 10కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.యువతకు పిలుపు: వ్యసనాలకు దూరం – ఆరోగ్యానికి ప్రాధాన్యంఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమాజానికి దిశానిర్దేశం…

Read More

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతిని- శివ ఠాకూర్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిర్మాన్‌పల్లిలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఈ నెల 4న హాజరుకానున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ స్థలాన్ని…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ XII ప్రారంభం

నిజామాబాద్, జూలై 2:(E6 క్రైమ్-శివ ఠాకూర్) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజులపాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తప్పిపోయిన చిన్నారులు, నిరాశ్రయ బాలలు, వీధి…

Read More

రాహుల్ గాంధీవి చిల్లర రాజకీయాలు..

ప్రధాని మోదీ నివాసం వద్ద అరాచకంగా వ్యవహరించడం ఖండనీయం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పార్లమెంట్‌ను పక్కనబెట్టి రాజకీయ నాటకాలకు కాంగ్రెస్ పాల్పడుతోంది ప్రజల సానుభూతి కోసం రాహుల్ గాంధీ ప్రయత్నం గాంధీ భవన్ ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ ఖండనీయం అరెస్టు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి ఇందూరు, జూలై 22:(E6 tv NEWS శివ ఠాకూర్):ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత,…

Read More

గండిపేటలో మెరిసిన నక్షత్రాలు: రేపు NTR విద్యా సంస్థల్లో ‘ర్యాంకర్ల అభినందన సభ’

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మరియు CBSE ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులను గౌరవించేందుకు గండిపేట సిద్ధమైంది. గండిపేటలోని NTR విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ నెల 21న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు భారీ ‘అభినందన సభ’ను నిర్వహించనున్నారు.ముఖ్య విశేషాలు:ముఖ్య అతిథి: NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ కార్యక్రమానికి హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి సందేశాన్ని ఇస్తారు.ఎవరు పాల్గొంటున్నారు?: తెలంగాణ ఇంటర్మీడియట్ (2024-26) ర్యాంకర్లతో పాటు, CBSE…

Read More

బాలికలకు సైకిల్.. అమ్మకు అక్షరం! కామారెడ్డిలో మంత్రి సీతక్క వినూత్న శ్రీకారం
కామారెడ్డి:

గ్రామీణ ప్రాంత మహిళలు, బాలికల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ‘స్నేహ సమ్మర్ ప్రోగ్రాం’ మరియు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా మహిళలతో అక్షరాలు దిద్దించి, బాలికల సైకిల్ రైడింగ్‌ను ప్రారంభించి వారిలో ఉత్సాహాన్ని నింపారు.వార్తా సారాంశం:లైఫ్ స్కిల్స్‌లో భాగంగా సైకిల్ రైడింగ్: టీనేజ్ బాలికల కోసం సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో…

Read More

విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం

యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…

Read More

కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం

బాసర జూలై 2: E6 న్యూస్ (తిరుపతి గౌడ్) బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల…

Read More

కొడంగల్‌లో 33 వేల ‘డూప్లికేట్’ ఓట్లు.. సీఎం గెలుపుపై కవిత సంచలన ఆరోపణలు

!హైదరాబాద్, బంజారాహిల్స్: సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఆమె తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కొడంగల్‌లో భారీగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడిన ముఖ్యాంశాలు:ఒకే ఓటరు…..

Read More

ప్రపంచం అత్యంత అస్థిరంగా ఉంది.. భారత్-ఆసియాన్ సహకారం మరింత పెరగాలి: విదేశాంగ మంత్రి జైశంకర్!

మనీలా (ఫిలిప్పీన్స్): ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అత్యంత సంక్షోభ పూరితంగా, అస్థిరంగా (Turbulent) ఉన్నాయని, వీటిని ఏ ఒక్క దేశం లేదా కూటమి ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ – ఆసియాన్ (ASEAN) దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారం మరింత బలోపేతం కావడం అత్యంతావశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. మనీలా వేదికగా ‘ఆసియాన్-ఇండియా’ సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న క్వాడ్ (Quad)…

Read More
భారత స్టాక్ మార్కెట్ మరియు బంగారం, వెండి రేట్లు

భారత స్టాక్ మార్కెట్ మరియు బంగారం, వెండి రేట్లు

భారత స్టాక్ మార్కెట్ యొక్క ప్రస్తుత స్థితి భారత దేశంలో స్టాక్ మార్కెట్ ప్రతిరోజూ తాజా ఆర్థిక సమాచారంతో పాటు మారుతుంది. వినియోగదారులు ఈ మార్కెట్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఫలితాలు సాధించవచ్చు. ప్రస్తుతం స్థానిక మరియు అంతర్జాతీయ విషయాలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చును. బంగారం ధరల చరిత్ర బంగారం ధరలు భారతదేశంలో సంపూర్ణ ఆర్థిక అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో బంగారం ధరలు పైకి వెళ్లడం కనిపిస్తుంది. ఇది విస్తృతంగా…

Read More

తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…

Read More

తిరుమలగిరిలో కాంగ్రెస్ వర్గపోరు రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే శామ్యూల్, మంత్రి వెంకటరెడ్డి అనుచరుల ఘర్షణ!

నల్గొండ / సూర్యాపేట: తుంగతుర్తి కాంగ్రెస్ నియోజకవర్గంలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. తిరుమలగిరి మండల కేంద్రంలో ఆదివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు ప్రవేశించి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు అసలు కారణం: పోలీసులకు ఫిర్యాదు: ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుదారులు ఎమ్మెల్యే శామ్యూల్ అనుచరులపై సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడానికి…

Read More

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు!

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం: పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు! ఇస్లామాబాద్/వాషింగ్టన్ (E6TVప్రతినిధి): పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశించిన తరుణంలో, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించిన ఈ డీల్‌పై ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొంది. మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ చేసిన ప్రకటనలు, అమెరికా ఇచ్చిన కౌంటర్లు దౌత్యపరమైన యుద్ధానికి దారితీస్తున్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రకటన.. రేపిన దుమారం! పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా చేసిన…

Read More