Breaking News

ప్రాణాలు వదిలిన డ్రైవర్ శంకర్ గౌడ్.. వరంగల్‌లో మిన్నంటిన రోదనలు!

ప్రాణాలు వదిలిన డ్రైవర్ శంకర్ గౌడ్.. వరంగల్‌లో మిన్నంటిన రోదనలు! తెలంగాణ ఆర్టీసీలో పెను విషాదం నెలకొంది. చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ​ముఖ్యాంశాలు: ​E6TV స్పెషల్ రిపోర్ట్: ​”ప్రభుత్వ మొండి వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సమ్మె పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడం, చర్చలు విఫలం కావడంతో శంకర్ గౌడ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే…

Read More

“డైరెక్టర్ సీట్లలో యంగ్ హీరోలు.. టాలీవుడ్‌లో కొత్త రేంజ్ ప్రయోగాలు!”

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. దర్శక నిర్మాతల కథల కోసం వేచి చూడకుండా, తమ ఐడియాలను స్వయంగా తెరకెక్కించేందుకు యంగ్ హీరోలు మెగాఫోన్ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు, కార్తికేయలు తమ స్వీయ దర్శకత్వంలో కథానాయకులుగా నటిస్తూ సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విశ్వక్ సేన్ (‘కల్ట్’), రామ్ పోతినేని (RAPO 23), కిరణ్ అబ్బవరం తమ సొంత ప్రాజెక్టులతో దర్శకులుగా మారుతున్నట్లు ప్రకటించారు. హీరోలు దర్శకులుగా…

Read More

రష్యాలో వ్యవసాయ భూముల పేరుతో రూ. 1.10 కోట్ల మోసం.. మర్చంట్ నేవీ సీమన్‌కు సైబర్ నేరగాళ్ల గాలం!

హైదరాబాద్: రష్యాలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి అధిక లాభాలు అందిస్తామంటూ సైబరాబాద్ వ్యాప్తంగా కొత్త రకం మోసానికి తెరతీశారు కేటుగాళ్లు. ఈ క్రమంలో రష్యన్ ఫెడరేషన్‌లో వ్యవసాయ భూమి యాజమాన్య హక్కులు, అధిక రాబడి ఇప్పిస్తామని నమ్మించి నల్లాగండ్లకు చెందిన 46 ఏళ్ల మర్చంట్ నేవీ సీమన్ నుంచి రూ. 1.10 కోట్లు కాజేసిన ఘటనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి తరఫున ఆయన న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు…

Read More

హైదరాబాద్‌ అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు దూకించిన నిందితుడు!

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులపైకి ఓ యువకుడు కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. అబిడ్స్ ప్రాంతంలో మత్తు పదార్థాల విక్రయం జరుగుతోందని సమాచారం అందడంతో ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ (H-NEW) బృందం రాత్రిపూట ఆకస్మిక దాడి చేపట్టింది. పోలీసులను చూడగానే నిందితుడు సైఫ్ తప్పించుకునేందుకు యత్నించాడు. ఘటన…

Read More

బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…

Read More

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 30 ఎంబిబిఎస్ సీట్లు

ఎన్ఎమ్‌సీ నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అధికారిక అనుమతి నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో శుభవార్త లభించింది. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 120 నుంచి 150కు పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్‌సీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం ఈ…

Read More

అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్!

అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్! రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన తన ప్రతిభతో దేశస్థాయిలో రాణిస్తూ, ఇప్పుడు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి భారత బృందంలో ఆమె చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. పేద కుటుంబంలో జన్మించిన అర్చనకు చిన్ననాటి నుంచి క్రీడలపై ఆసక్తి. ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లోనూ, అద్దె ఇంట్లో జీవిస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ, గెలుపే లక్ష్యంగా…

Read More

ప్రతి అర్హుడికి ఓటు హక్కు చేరేలా SIR పరిశీలన

అచ్చంపేట్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నిజాంసాగర్, జూలై 8: E6 న్యూస్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న…

Read More

తెలంగాణ అసెంబ్లీ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ : ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) భవనంలో జరుగుతున్న మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వ్యక్తిగతంగా పరిశీలించారు. అసెంబ్లీ ప్రాంగణమంతా కలియతిరిగిన సీఎం, పనుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. చారిత్రక కట్టడం యొక్క రూపురేఖలు దెబ్బతినకుండా, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి.

బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలో నెరవేరుస్తామని స్పష్టం నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష పేరుతో నాటకాలు…

Read More