Breaking News

అబద్ధపు ప్రచారాలు మానేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయాలి: భీంగల్ బీఆర్ఎస్ నాయకులు

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ భీంగల్ పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్ డిపో, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అసత్య ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2022 జూన్ నెలలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి…

Read More

హైదరాబాద్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా సునీల్ రాబర్ట్: తెలంగాణ యువతకు సీఎం రేవంత్ పిలుపు!

హైదరాబాద్: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రపంచంలోని 7 ఖండాల్లో పూర్తిస్థాయి మారథాన్‌లు పూర్తి చేసిన తెలుగు తేజం సునీల్ రాబర్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రమాదంలో మోకాలు తీవ్రంగా దెబ్బతిన్నా, పట్టుదలతో కోలుకుని ప్రపంచాన్ని జయించిన సునీల్ రాబర్ట్ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో క్రీడలను, ఫిట్‌నెస్ సంస్కృతిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read More

“రోజూ శునకాల దాడులే..” వీధి కుక్కల బెడదపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన — ‘సుయో మోటు’గా పిల్ స్వీకరణ!

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బెడద, నిత్యం జరుగుతున్న కుక్కల దాడి ఘటనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరంలో వీధి కుక్కల నిర్వహణ, నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు హైకోర్టు గురువారం స్వచ్ఛందంగా (Suo Motu) ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) స్వీకరించింది. “రోజూ దాడి ఘటనలే.. సామాన్యుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు” జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ రజనీష్ కుమార్ గుప్తాలతో కూడిన ధర్మాసనం…

Read More

ఖమ్మంలో భారీగా గంజాయి స్వాధీనం: ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్, రూ.11.55 లక్షల విలువైన మత్తు పదార్థం సీజ్

కల్లూరు / ఖమ్మం: రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివార్లలో భారీగా గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు ₹11.55 లక్షల విలువైన 23.10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. ఒడిశా టూ హైదరాబాద్.. అంతా పక్కా ప్లాన్! ఈ…

Read More

ఖాకీ విధుల్లో.. ‘మానస’ మార్క్

అక్రమ మద్యంపై కోరడ జూలిపిస్తున్న యువ అధికారిని క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పెద్దపీట మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్సై బి. మానసకు ప్రత్యేక గుర్తింపు స్పెషల్ స్టోరీ: ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్ మోర్తాడ్ : E6 న్యూస్ చేతిలో అధికారం ఉందని హడావుడి చేయరు.. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలకే పరిమితం కారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెడుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మోర్తాడ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి….

Read More

అణిచివేత నుంచి ఆకాశమంత ఎత్తుకు..

అక్షరాయుధంతో సామాజిక విప్లవం – డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ప్రత్యేక కథనంనేడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి. కోట్లాది మంది పీడిత ప్రజల ఆశల దీపం, అగ్రవర్ణ దురహంకారాన్ని తన మేధస్సుతో ఎదిరించిన జ్ఞాన శిఖరం ఆయన. ఈ సందర్భంగా ‘E6TV వెబ్ న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.అణిచివేత నుంచి ఆకాశమంత ఎత్తుకు..ఏప్రిల్ 14, 1891న మధ్యప్రదేశ్ లోని మహో సైనిక స్థావరంలో రామ్జీ మలోజీ సాక్పాల్, భీమాబాయి…

Read More

వరద కాలువలో నీటిని నింపి రైతులకు సాగునీరు అందించాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.

రివర్స్ పంపింగ్ ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేయాలి – సబ్ కాంట్రాక్టర్ల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం వేల్పూర్, జూలై 2: E6 న్యూస్– T, గంగాధర్ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

Read More

తెలంగాణలో చెదురుమదురు జల్లులు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

నిజామాబాద్ జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్రంలో గత 24 గంటలుగా పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విస్తృతంగా కాకుండా పరిమిత ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. టీజీడీపీఎస్ (TGDPS) వివరాల ప్రకారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 17 మిల్లీమీటర్లు, నారాయణపేట…

Read More

టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదం.. ఈసీకి వారం రోజుల్లో సమాధానం.

న్యూఢిల్లీ, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం ఈసీ ఎదుట వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరగా, నోటీసులకు సమాధానం అందిన తర్వాత పార్టీకి హియరింగ్ నిర్వహించి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది….

Read More

ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి.

బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలో నెరవేరుస్తామని స్పష్టం నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష పేరుతో నాటకాలు…

Read More