Breaking News

అమెరికా పౌరులే లక్ష్యంగా నకిలీ కాల్ సెంటర్లు.. సూత్రధారి వికాస్ కుమార్ నిమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!

హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల నుంచి నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను బురిడీ కొట్టించిన ప్రధాన నిందితుడు వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని 15కి పైగా ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడికి వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మోసం జరిగిన తీరు & నెట్‌వర్క్: ఈడీ…

Read More

ఆపరేషన్ సైహాక్ సైబర్ నేరగాళ్ల గుండెల్లో వణుకు 519 కోట్ల స్కామ్ బట్టబయలు

**ఆపరేషన్ సైహాక్: సైబర్ నేరగాళ్లపై ఢిల్లీ పోలీసుల చారిత్రాత్మక మెగా డ్రైవ్**
దేశ రాజధానిలో సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన **”ఆపరేషన్ సైహాక్”** సరికొత్త రికార్డు సృష్టించింది. పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా నేతృత్వంలో జరిగిన ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు **1429 మందిని** అరెస్ట్ చేయగా, ఏకంగా **519 కోట్ల రూపాయల** స్కామ్ బట్టబయలైంది. మ్యూల్ అకౌంట్లు, అక్రమ కాల్ సెంటర్లే లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో వేల సంఖ్యలో అనుమానితులను విచారించి, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సైబర్ ఫిర్యాదులకు పరిష్కారం కనుగొన్నారు. సైబర్ ప్రపంచంలో పౌరుల భద్రతే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ నేరగాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది.

Read More

వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…

వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…

Read More

TGSPDCL నుంచి వినూత్న యాప్ ‘TGNMS’: జీఐఎస్ సాంకేతికతతో విద్యుత్ సేవల్లో సరికొత్త విప్లవం!

హైదరాబాద్: విద్యుత్ రంగంలో డిజిటల్ సంస్కరణలను వేగవంతం చేస్తూ తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు పారదర్శక, నాణ్యమైన మరియు సమర్థవంతమైన విద్యుత్ సేవలను అందించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఐఎస్ ఆధారిత ‘TGNMS’ (TGSPDCL GIS Network Monitoring System) అప్లికేషన్‌ను ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) జితేష్ వి. పాటిల్ పర్యవేక్షణలో ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌లోని నెట్‌వర్క్…

Read More

ఆర్మూర్‌లో రాజకీయ వేడి.. సవాళ్లు – ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంకాపూర్ లో ఉద్రిక్త వాతావరణం, అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఆర్మూర్, జూలై 20: E6 tv NEWS, (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో బీజేపీ నిర్వహించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రణభేరి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే…

Read More

E6TV బ్రేకింగ్ న్యూస్ గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తీరని లోటు..

  భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి (శిష్ట్లా జానకి) శనివారం కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న జానకి అమ్మ, వయోసహజ అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె…

Read More

‘మా ఊరంతా మునిగిపోయింది’: అస్సాంను ముంచెత్తిన ఘోర వరదలు.. ఛాతీ లోతు నీటిలో ఐదున్నర లక్షల మంది!

గౌహతి : ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో వరద ఉధృతి అత్యంత దారుణంగా మారింది. ఎన్నడూ లేని విధంగా అప్పర్ అస్సాం జిల్లాలైన శివసాగర్, చరైదేవ్, జోర్హాట్ మరియు గోలాఘాట్‌లను ప్రళయకర వరదలు ముంచెత్తాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే బాధితుల సంఖ్య 3.6 లక్షల నుండి 5.6 లక్షలకు పెరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ప్రకృతి విపత్తుకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. “95 ఏళ్ల నా జీవితంలో ఇలాంటి…

Read More

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం..

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరయ్యారు.యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు “తెలుగు జాతికి తిరుగే లేదు… ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలుస్తుంది” అని సీఎం చంద్రబాబు…

Read More

వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధుల ముప్పు…!

జ్వరం, డెంగ్యూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే..! ఉక్కపోత, చిరుజల్లులతో వైరస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధులకు చెక్ స్వయంగా మందులు వాడొద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి ప్రత్యేక కథనం నిజామాబాద్, జూలై 12 | E6 న్యూస్ ప్రతినిధి : శివ ఠాకూర్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి….

Read More

దశాబ్దాలుగా గ్రంథాలయ పోస్టుల భర్తీ శూన్యం: ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్!

మంచిర్యాల / హైదరాబాద్: తెలంగాణలో గ్రంథాలయ (లైబ్రేరియన్) ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులు దాదాపు మూడు దశాబ్దాలుగా (30 ఏళ్లుగా) నిరీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం.. ప్రభుత్వ గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ పోస్టులను చివరిసారిగా 1981 లో భర్తీ చేశారు. ఆ తర్వాత నుంచి ఈ పోస్టుల భర్తీ ఊసే లేదు. అభ్యర్థుల ప్రధాన సమస్యలు & ఆవేదన: సమస్యల…

Read More