అభివృద్ధి పనుల్లో నాణ్యతతో రాజీపడేది లేదు: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం!
ఖమ్మం: ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ (Underground Drainage) పనులను సోమవారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజా సౌకర్యాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు వందలాది కోట్ల రూపాయలు విడుదల చేస్తోందని ఆయన…
దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
23 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా జూలై 10: E6 న్యూస్: తిరుపతి గౌడ్ అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
కొత్త హెచ్ఐవీ కేసులను త్వరగా గుర్తించాలి
నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్: E6 న్యూస్: శివ ఠాకూర్ జిల్లాలో ఇంకా గుర్తించాల్సిన హెచ్ఐవీ కేసులను త్వరితగతిన గుర్తించి, బాధితులను చికిత్స పరిధిలోకి తీసుకురావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి…
నిజామాబాద్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్పై ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తీవ్ర విమర్శలు
నీట్ అంశంపై కాంగ్రెస్ ఆందోళనలను తప్పుబట్టిన అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్తో పాటు కొన్ని రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులతో తోపులాట ఇందూరు, జూలై 22: E6 tv NEWS శివ ఠాకూర్ నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా తప్పుబడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను…
దుబాయ్లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం..
దుబాయ్లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్లోని తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరయ్యారు.యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.దుబాయ్లోని లీ మెరిడియన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు “తెలుగు జాతికి తిరుగే లేదు… ప్రపంచంలో నెంబర్ వన్గా నిలుస్తుంది” అని సీఎం చంద్రబాబు…
తెలంగాణలో మంగళవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్లో 76.8 మిమీ వర్షపాతం నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో 51 మిమీ, కందిలో 42.5 మిమీ, కడ్పాల్లో 41.3 మిమీ వర్షపాతం రికార్డైంది. రాబోయే…
రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ | ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం!
రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ అనుమానాస్పద స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, రూం బయట ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడని డీజీపీ వెల్లడించారు. గన్ను స్వాధీనం చేసుకుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన నేపథ్యంలో, పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు పోలీసులు గట్టిగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. “రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే అక్కడున్న ప్రజల ప్రాణాలు పోయే…

