Breaking News

ఇమ్రాన్ ఖాన్ కు కంటిచూపు పోయే ప్రమాదం..

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కుడి కంటిలో సమస్య తీవ్రమైందని, వెంటనే సరైన చికిత్స అందించకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని పీటీఐ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జైలు అధికారులు వైద్యుల సూచనలను పట్టించుకోకుండా… ఇమ్రాన్ కు జైల్లోనే చికిత్స చేయాలని పట్టుబట్టడంతో పరిస్థితి మరింత దిగజారిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్…

Read More

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్: మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు

అమరావతి (E6TV వెబ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.తొలి మహిళా సీజేకు శుభాకాంక్షలుఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై రికార్డు సృష్టించిన జస్టిస్ లీసా గిల్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆమె రాకతో రాష్ట్ర…

Read More

“సుపరిపాలనకు
“సుపరిపాలనకు రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

అయోధ్య, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు. రాముడి పాలన, అంటే “రామరాజ్యం,” సుపరిపాలనకు ఒక బెంచ్‌మార్క్ అని ఆయన పేర్కొన్నారు.

రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాముడి పాటించిన విలువలు ఎప్పటికీ ప్రేరణగా నిలిచే విధంగా ఉన్నాయని, వాటిని ఆధునిక పాలనకు మార్గదర్శకంగా తీసుకోవచ్చని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.

మందిరం అనేక వివాదాల తర్వాత నిర్మించబడినప్పటికీ, ప్రజల కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఆలయం నిర్మాణంతో పాటు యూపీ ప్రభుత్వం సుపరిపాలనలో మంచి పని చేస్తోందని కూడా ఆయన ప్రశంసించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, అయోధ్య రామ మందిరం దేశంలోని ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యం సాధించడంలో యూపీ, బీహార్ కీలక పాత్రలు పోషిస్తాయని అన్నారు.

చంద్రబాబు ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) రాసినట్టుగా, “శ్రీరాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ప్రేరణ ఇస్తాయి. రాముని విలువలు సుపరిపాలనకు మార్గదర్శకంగా ఉంటాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు కొత్త శక్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు.రామరాజ్యం బెంచ్‌మార్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో శ్రీరామ దర్శనం”

Read More

అణిచివేత నుంచి ఆకాశమంత ఎత్తుకు..

అక్షరాయుధంతో సామాజిక విప్లవం – డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ప్రత్యేక కథనంనేడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి. కోట్లాది మంది పీడిత ప్రజల ఆశల దీపం, అగ్రవర్ణ దురహంకారాన్ని తన మేధస్సుతో ఎదిరించిన జ్ఞాన శిఖరం ఆయన. ఈ సందర్భంగా ‘E6TV వెబ్ న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.అణిచివేత నుంచి ఆకాశమంత ఎత్తుకు..ఏప్రిల్ 14, 1891న మధ్యప్రదేశ్ లోని మహో సైనిక స్థావరంలో రామ్జీ మలోజీ సాక్పాల్, భీమాబాయి…

Read More

“జగిత్యాల ఎమ్మెల్యే ఒక ఐరన్ లెగ్ శాస్త్రి!”జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళుతుండటంపై ధర్మపురి అర్వింద్ స్పందన

జగిత్యాల/మెట్‌పల్లి (E6TV ప్రతినిధి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో స్పందించారు. మెట్‌పల్లిలో బీఎస్పీ నేత నిశాంత్ కార్తికేయను బీజేపీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డిపై గౌరవం…

Read More

సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహం

సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి – రాష్ట్ర ప్రభుత్వ మౌనం పై బీజేపీ ఆగ్రహంలక్డికాపూల్ డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపు – అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఘట్కేసర్ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షక కార్యకర్త సోను (ప్రశాంత్)పై ఎంఐఎం నేత దాడి చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోనును సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా బీజేపీ…

Read More

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్ట‌ర్‌ దాసి నాగరాజు: నిజాంపేటలో ఘన సన్మానం

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్ట‌ర్‌ దాసి నాగరాజు: నిజాంపేటలో ఘన సన్మానంనిజాంపేట:కారుణ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దాసి నాగరాజు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా నిజాంపేటలో సంబరాలు మిన్నంటాయి. సిఎంసి నిజాంపేట్ 58వ సర్కిల్ బిజెపి నాయకులు డాక్టర్ రాజు, బిక్షపతి యాదవ్, ప్రసాద్ రాజు, పద్మా ప్రసాద్, సుబ్బారావు తదితరులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.సేవా దృక్పథమే…

Read More

నిజామాబాద్ లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్

నిజామాబాద్ నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపింది. శనివారం నాడు మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు పట్టణంలోని పలు క్లినిక్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ దాడులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తోటావర్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ సన్నీ డేవిస్ అయ్యాల మరియు సభ్యులు డాక్టర్ జకరయ్య నేతృత్వం వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫస్ట్ ఎయిడ్…

Read More

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పాలనలోనూ మునుపెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును దక్కించుకున్న శుభసందర్భంగా అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో డిన్నర్ విత్ ద…

Read More

రాష్ట్రానికి కనీసం రూ.30 వేల కోట్ల నష్టం

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటును మళ్లీ మంజూరు చేస్తుందని ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించింది. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏ స్థాయిలో పడిపోయిందో, పదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విశ్లేషించి చెప్పింది. అయినా,…

Read More