Breaking News

నిజామాబాద్ – బెంగళూరు లహరి బస్సు కు కొత్త బోర్డింగ్ పాయింట్లు

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ సీటర్ & స్లీపర్ బస్సు సర్వీసుకు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నగరంలో మెడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల…

Read More

ఉద్యమకారులపై లాఠీచార్జి కాంగ్రెస్ ప్రభుత్వ పథకానికి నాంది: కల్వకుంట్ల కవిత

ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులా?.. మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమని మండిపాటు జూలై 2: (E6 న్యూస్- శివ ఠాకూర్) ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే వారిపై లాఠీచార్జీ చేసి, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

హైదరాబాద్‌ వాతావరణ అప్‌డేట్: నేడు నగరంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం!

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈరోజు వాతావరణం చల్లబడనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈరోజు వాతావరణ వివరాలు:

Read More

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

జూలై 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపు ఇందూరు జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్‌లోని ధర్నా చౌక్ వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్…

Read More

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బోణి: పతకం ఖాయం చేసిన లవ్లీనా బొర్గోహైన్!

గ్లాస్గో : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌ తొలి పతకాన్ని ఖరారు చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. డ్రా తో కలసివచ్చిన అదృష్టం కేవలం ఐదుగురు బాక్సర్లు మాత్రమే ఉన్న డ్రాలో లవ్లీనాకు మొదటి రౌండ్‌లో ‘బై’ (Bye) లభించింది. దీనితో ఆమె…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు – కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు; ఇది తెలంగాణ రైతాంగ విజయం!by thou uyy

భీంగల్ (నిజామాబాద్ జిల్లా) – E6TV స్పెషల్ రిపోర్ట్ (శివ):కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు హైకోర్టు తీర్పుతో తెరపడిందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్, బీజేపీల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.మండల పార్టీ అధ్యక్షులు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల…

Read More

మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స…..

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కంటతడి.. మీడియా సాక్షిగా వెక్కివెక్కి ఏడ్చిన ప్రతిపక్ష నేత! విశాఖపట్నం: వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఒక్కసారిగా విలపించడం సంచలనంగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సంచలన ఆరోపణలను ఖండిస్తూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స కన్నీటి పర్యంతమయ్యారు. అచ్చెన్న వ్యాఖ్యలపై…

Read More

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా మహిళ మృతి!

హైదరాబాద్: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 44 ఏళ్ల మహిళ దుర్మరణం పాలయ్యారు. మృతురాలిని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శ్రీపతి దీపా రెడ్డిగా గుర్తించారు. సమాచారం ప్రకారం.. దీపా రెడ్డి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖల కుమార్తె. ఆమెకు ఆమన్‌గల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ రెడ్డితో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు…

Read More

వైశ్యులంతా ఐక్యతగా ఉండి రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉత్తర తిరుమలలో ఘనంగా వనభోజన కార్యక్రమం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక రంగంలో వైశ్యుల పాత్ర ఆదర్శనీయం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వనభోజనాలు నిర్వహించడం అభినందనీయం ఇందూరు, జూలై 19 : E6 tv NEWS శివ ఠాకూర్వైశ్యులంతా ఐక్యతగా ఉంటూ సమాజ అభివృద్ధితో పాటు రాజకీయంగానూ మరింత ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర…

Read More