News
బబన్సా పహాడ్లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు,152 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
ఒక వ్యక్తి అరెస్టు.. పల్సర్ ద్విచక్ర వాహనం సీజ్ నిజామాబాద్, జూలై 14: E6 క్రైమ్ న్యూస్నిజామాబాద్ SHO పోలీస్ స్టేషన్ పరిధిలోని బబన్సా పహాడ్ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి 152 గ్రాముల ఎండు గంజాయితో పాటు…
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూతహైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజికవర్గ అగ్రనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ఆయన 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి…
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి
డీఈవో అశోక్కు ప్రెస్ క్లబ్ వినతి – సానుకూల స్పందన ఒకటి, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ కార్యదర్శి…
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలి
జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ కు ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి…
ఇందిరమ్మ ఇళ్ల ఇసుక అక్రమ దారి మళ్లింపు కేసులో చర్య
ఇసుకను అక్రమంగా దారి మళ్లించిన మెండోరా ఆర్.ఐ సస్పెన్షన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో ఇసుక మళ్లించినట్లు ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు మైనింగ్ ఏడీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట కేటాయించిన ఇసుకను అక్రమంగా దారి మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ) సదానంద్ను సస్పెండ్…
శభాష్ రుద్రూరు పోలీసులు..!
రోడ్డు మరమ్మత్తుల వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ మళ్లింపు – పోలీసుల చొరవకు ప్రజల ప్రశంసలు రుద్రూరు, జూలై 13: E6 న్యూస్, ఔరాద్ అశోక్ నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తుల పనుల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా రుద్రూరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతంలో కాంట్రాక్టర్లు తప్పనిసరిగా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ అవి లేకపోవడంతో పోలీసులు స్వయంగా చర్యలు చేపట్టారు. ప్రమాదాలను…
అంతర్జాతీయ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్ డిల్లోడ్ గన్రాజ్కు పోలీస్ కమిషనర్ సన్మానం
జాతీయ, అంతర్జాతీయ విజయాలతో నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిన యువ క్రీడాకారుడు క్రమశిక్షణ, కఠోర సాధనే విజయానికి మూలం – సీపీ సాయి చైతన్య నిజామాబాద్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్జాతీయ, అంతర్జాతీయ పవర్లిఫ్టింగ్ పోటీల్లో వరుస విజయాలు సాధిస్తూ నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకొస్తున్న యువ క్రీడాకారుడు డిల్లోడ్ గన్రాజ్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల ముంబైలో…
ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్
చట్ట ప్రకారం సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు నిజామాబాద్, జూలై 13: E6 క్రైమ్ న్యూస్ శివ ఠాకూర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టబద్ధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజల నుంచి 39 ఫిర్యాదులను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను కమిషనర్ స్వయంగా కలిసి…

