News
సివిల్స్ కొట్టే ఛాన్స్.. ఉచిత శిక్షణకు గ్రీన్సిగ్నల్!
రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ రూ.3 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఈ నెల 23లోగా దరఖాస్తు భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ…
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు….
ప్రజా సమస్యలు వదిలేసి BRS అసెంబ్లీని అడ్డుకుంటోంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
హైదరాబాద్: గత మూడు రోజులుగా తెలంగాణ శాసనసభా వ్యవహారాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నిరంతరం అడ్డుకోవడాన్ని “విచారకరం” అని నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభను దారి మళ్లించేందుకు ప్రతిపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని బుధవారం ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ప్రధాన విమర్శలు
తిరుమల పర్యటనలో ఉన్న మల్లారెడ్డిని కూడా సస్పెండ్ చేశారు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటు ప్రక్రియ తీవ్ర హాస్యాస్పదంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో చిట్చాట్గా మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సభను అభాసుపాలు చేస్తోందని మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాన ఆరోపణలు పోలీసుల అరెస్టులు, ఏఐ ఫేక్ ఫొటోల కుట్ర ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను…
ప్రజా సమస్యలను వదిలేసి అసెంబ్లీని కక్ష సాధింపులకు వేదికగా మార్చారు…
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణ తీరుపై ప్రతిపక్షం భారత్ రాష్ట్ర సమితి (BRS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాల్సిన పవిత్రమైన సభను, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చిందని తీవ్ర స్థాయిలో ఆరోపించింది. మూడు రోజుల పరిణామాలు – బీఆర్ఎస్ ఆరోపణలు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన మూడు రోజుల పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు: ప్రజా సమస్యలపై ప్రభుత్వం మౌనం రాష్ట్రంలో…
పోలవరాన్ని గోదాట్లో కలిపారు..: సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం
కోనసీమ: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన కంటే తీవ్రమైన నష్టం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే, ప్రతిపక్ష ‘గొడ్డలి పార్టీ’ హింసను ప్రేరేపిస్తూ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. పోలవరం నాశనం &…
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి
గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయాలి హుజూర్నగర్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ హుజూర్నగర్ పట్టణ జర్నలిస్టులు తహసీల్దార్ బండా కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కమిషనర్ కే. సతీష్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసిన వి. పార్వతి హాథీరామ్ నాయక్
భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్హౌస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి. పార్వతి హాథీరామ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ను శాలువా, బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన రైతులకు రావాల్సిన పోడు…
BRS కార్యకర్తపై దాడి.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
పిట్లం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన BRS కార్యకర్త శివపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడిలో గాయపడిన శివకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తారని…
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజల…

