నింగిలో మబ్బుల దుప్పటి.. భారత్ను కప్పేసిన వర్ష మేఘాలు: ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో సంచలన దృశ్యాలు!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు చెందిన శాటిలైట్ తీసిన చిత్రాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తే అసలు భారతదేశ భూభాగమే కనిపించనంతగా.. దాదాపు 95 శాతం దేశాన్ని దట్టమైన మేఘాలు ఆవరించేశాయి.భూమధ్యరేఖకు 36,000 కి.మీ ఎత్తు నుంచి..భారత వాతావరణ శాఖ (IMD) అందించిన వివరాల ప్రకారం.. ఇస్రోకు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహాలు జూలై 22న తెల్లవారుజామున…

