భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి).
ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలు, చెత్తాచెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో ప్రజా ప్రతినిధి జై జై నర్యయ్య, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, హెల్త్ డిపార్ట్మెంట్, మెప్మా సిబ్బంది, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

