Medak
అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరా ప్రసాద్ను అరెస్ట్ చేయాలి
పాల్వంచలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్య సంఘాల నిరసన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను అవమానిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిక పాల్వంచ, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అమరా ప్రసాద్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్య సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాల్వంచలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిరసన…
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు….
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి
గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయాలి హుజూర్నగర్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ హుజూర్నగర్ పట్టణ జర్నలిస్టులు తహసీల్దార్ బండా కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కమిషనర్ కే. సతీష్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసిన వి. పార్వతి హాథీరామ్ నాయక్
భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్హౌస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి. పార్వతి హాథీరామ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ను శాలువా, బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన రైతులకు రావాల్సిన పోడు…
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజల…
సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవం ఘనంగా
మద్రాస్ తండలో జెండా ఆవిష్కరణ.. బంజారా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి టేకులపల్లి, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ గ్రామంలో సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు.సేవాలాల్ సేన సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన…
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మంగళవారం అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు, రాత్రి వేళల్లో భద్రతా చర్యలను పరిశీలించారు.అనంతరం కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించిన ఎస్పీ.. అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలర్టింగ్,…
రేషన్ కార్డుల పేరుతో కేటుగాళ్ల వసూళ్లు..
కలెక్టరేట్ ఉద్యోగి పేరుతో నకిలీ ఐడీ కార్డు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS). రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్ జూనియర్ అసిస్టెంట్ పేరుతో నకిలీ ఐడీ కార్డు చూపించి పలువురి నుంచి నగదు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. బండి మధు పేరుతో ఉన్న ఐడీ కార్డును చూపిస్తూ రేషన్ కార్డులు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్నారని తెలిపారు.అయితే కొంతకాలం గడిచినా రేషన్ కార్డులు రాకపోవడంతో బాధితులు ఆరా తీయగా, తమకు చూపించిన ఐడీ…
ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు పొదెం వీరయ్య వినతి భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు.బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్హౌస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాలు ప్రస్తుతం ఏపీ పరిధిలో…
ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు
25 మంది స్వచ్ఛందగా రక్తదానం నిజామాబాద్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, హైకోర్టు అడ్వకేట్ పుల్లెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన…

