Sports
ఇరిగేషన్ జాగా కబ్జాపై అధికారుల చర్యలు
కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేత స్థలం ఖాళీ చేయకపోతే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు ఇరిగేషన్ ఏఈ రవికుమార్ హెచ్చరిక రుద్రూర్, ఆగస్టు 30:(E6tv NEWS ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని…
ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన
నిర్మల్, ఆగస్టు 30: (E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట మోచి సంఘంలో ఎస్ఐఆర్ (SIR) ఫామ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్, బీఎల్ఓ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుతో పాటు, పాత ఓటర్ జాబితా లేదా 2002…
పేదల సంక్షేమమే ధ్యేయం.. అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జుక్కల్, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల…
రూ.30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి భూమిపూజ
మారుమూల గ్రామాల్లో ధాన్యం నిల్వకు ఉపయోగకరం – సర్పంచులు, తండా పెద్దమనుషులు మానాల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ పరిధిలోని స్కూల్ తండా గ్రామపంచాయతీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ గోడౌన్కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మానాల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, తండా పెద్దమనుషులు, ప్రజాప్రతినిధులు కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొనుగోలు…
జుక్కల్లో ఘనంగా జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు
జుక్కల్, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జామియా మజీద్కు చేరుకున్నారు. ర్యాలీలో మత పెద్దలు, గ్రామ యువత, చిన్నారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు…
ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలపై సమీక్ష
మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ భీంగల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మండల పరిధిలో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ గుంతలు), ఇంకుడు గుంతల నిర్మాణాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథం CCలు, VAOలు, సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతి VAO పరిధిలో కనీసం రెండు ఫామ్ పాండ్స్ను…
ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
భీమ్గల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో భీమ్గల్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 278 మంది…
నిజామాబాద్ ఐడీఓసీ హెలిప్యాడ్కు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
నిజామాబాద్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఐడీఓసీ హెలిప్యాడ్కు చేరుకున్నారు. గవర్నర్కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం కావడంతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా…
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు బీజేపీ డిమాండ్
బాన్సువాడ, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల పక్షాన కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా “ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి” అంటూ నినాదాలు…
మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా తోట లక్ష్మీకాంతారావు
జుక్కల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేస్తానని, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

