Sports
మద్నూర్ ప్రజావాణిలో వినతుల స్వీకరణ
మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ ముజీబ్, ఎంపీవో సత్యనారాయణరెడ్డితో పాటు విద్యాశాఖ, పంచాయతీరాజ్, నీటిపారుదల, అటవీ, విద్యుత్, ఉపాధిహామీ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.ప్రజావాణిలో మేనూర్ గ్రామానికి చెందిన ఒక వినతిని స్వీకరించినట్లు ఎంపీడీవో సాయిలు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో…
మద్నూరును నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని వినతి
మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS ప్రతినిధి). మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ మండల ప్రజలు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో సాయిలు, తహసీల్దార్ ముజీబ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. గతంలో మద్నూర్ మండలం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమయంలో పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల సేవలు సులభంగా అందుబాటులో ఉండేవని తెలిపారు. ప్రస్తుతం మద్నూర్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉండగా,…
జమ్మికుంటలో అంగన్వాడీ చిన్నారులకు స్లేట్లు పంపిణీ
జమ్మికుంట, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్లేట్లు, స్లేట్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వర్ణలతమాట్లాడుతూ.. చిన్నారుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి భవిష్యత్కు మంచి పునాది…
కోరపల్లి భూ వివాదంలో నకిలీ ఆర్ఓఆర్ పత్రాలపై ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
కరీంనగర్, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కోరపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో నకిలీ ఆర్.ఓ.ఆర్., 13(బి), 13(సి) సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్కు పాల్పడిన వారిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటేశ్వరపల్లికి చెందిన బోయిని లావణ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.కోరపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 553/ఎలో 4 ఎకరాల 32 గుంటల భూమిని తాను కొనుగోలు చేశానని లావణ్య తెలిపారు. తన పేరుపై మ్యూటేషన్…
22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్
ఇందూరు, ఆగస్టు 23: (E6tv NEWS: శివ ఠాకూర్). 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు…
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన…
మద్నూర్ మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించి, ఆడిట్ నివేదికను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరంలో మండల సమాఖ్యకు రూ.5,86,413 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల ఎంపీడీవో పి. సాయిలు పాల్గొని మండల సమాఖ్య సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరాలని,…
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి
కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…
భీంగల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…
లింగంపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు
పెద్దకొడప్గల్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు గ్రామానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల కారణంగా వివిధ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ను ప్రజలందరూ సద్వినియోగం…

