ఆరావళి సరిహద్దుల నిర్ధారణపై అభిప్రాయాలు కోరిన ఉన్నతాధికార కమిటీ
ప్రజలు, పర్యావరణవేత్తలు, మైనింగ్ వర్గాల నుంచి వినతులకు అవకాశం
కమిటీ స్వతంత్రత, తటస్థతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
ఆరావళి పర్వత శ్రేణుల రక్షణ, సరిహద్దుల నిర్ధారణ (Delineation) అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన ఉన్నతాధికార ‘ఆరావళి కమిటీ’ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి ప్రాంత సమస్యలు, పరిరక్షణపై ప్రజలు, పర్యావరణవేత్తలు, వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, వినతులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.
21 రోజుల్లోగా సూచనలు పంపాలి
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (NCT) పరిధిలోని రాష్ట్రాలు, పర్యావరణవేత్తలు, మైనింగ్ లీజుదారులు మరియు ఆరావళి జీవవైవిధ్యంపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజల నుంచి కమిటీ అభిప్రాయాలను కోరుతోంది.i
ఆసక్తి ఉన్నవారు తమ వద్ద ఉన్న అధికారిక ఆధారాలు లేదా ధ్రువీకరించదగిన వివరాలతో కూడిన సూచనలను అధికారిక ఇమెయిల్ లేదా గూగుల్ ఫారమ్ ద్వారా పంపవచ్చు. ఈ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోగా తమ వినతులను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఆగస్టు 31 నాటికి నివేదిక
ఆరావళి పర్వతాల నిర్వచనం మరియు సరిహద్దుల గుర్తింపుపై కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు ఈ ఉన్నత స్థాయి కమిటీని ఈ ఏడాది మే 25న సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సమగ్ర నివేదికను ఆగస్టు 31 నాటికి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంది.

