Breaking News

కొత్త పార్టీ దిశగా కొండా సురేఖ ముందడుగు?!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గం నుంచి గురువారం రాత్రి అనూహ్యంగా బర్తరఫ్ గురైన కొండా సురేఖ తన తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తికర సంకేతాలిచ్చారు. “వేచి చూసే సమయం ముగిసింది.. బిగ్ అప్‌డేట్ త్వరలోనే రాబోతోంది.. స్టే ట్యూన్డ్ తెలంగాణ” అంటూ ఆమె సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయంలో సంచలనం సృష్టిస్తోంది.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురికావడంతో ఆమె భవిష్యత్తు కార్యాచరణపై రకరకాల ఊహాగానాలు షురూ అయ్యాయి.

ప్రధానాంశాలు:

  • కొత్త పార్టీ ఆలోచన?: తెలంగాణలో సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టే యోచనలో కొండా దంపతులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
  • బీజేపీలోకి సైతం ప్రచారం: మరోవైపు ఆమె భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు కూడా జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
  • ఉత్కంఠ రేపుతున్న పోస్ట్: తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో “బిగ్ అప్‌డేట్” అని పోస్ట్ చేయడంతో పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతానికైతే భవిష్యత్తు ప్రణాళికలపై కొండా సురేఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సోషల్ మీడియా పోస్ట్‌తో ఆమె ఏ క్షణంలోనైనా సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశముందని స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *