Breaking News

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ!

అమరావతి (విజయవాడ):

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పరిధిలోని 11 సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకి హాజరయ్యారు.

సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన డిమాండ్లు:

  • కొత్త పీఆర్‌సీ & ఐఆర్ ప్రకటన: నూతన పే రివిజన్ కమిషన్ (PRC) కమిషనర్‌ను తక్షణమే నియమించాలని, జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కింద మధ్యంతర భృతి (Interim Relief – IR) ప్రకటించాలని జేఏసీ కోరింది.
  • డీఏ బకాయిల విడుదల: పెండింగ్‌లో ఉన్న కరవు భత్యం (DA) బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.
  • ఉద్యోగుల సంక్షేమం: కాంట్రాక్ట్, ఆట్‌సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) సమస్యల పరిష్కారం, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక సర్వీసు రూల్స్ నిబంధనలను డిమాండ్ చేశారు.

జేఏసీ స్పందన – కొనసాగుతున్న నిరసన:

ప్రభుత్వం చర్చలకు పిలవడం తమ పోరాటానికి ‘తొలి విజయం’ అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. అయితే, ముందస్తు ప్రణాళిక ప్రకారం శనివారం భోజన విరామ సమయంలో ఆర్డీవో ఆఫీసులు, కలెక్టరేట్ల వద్ద ‘డిమాండ్ల దినం’ నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని జేఏసీ వెల్లడించింది.

పరిపరివిధాల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన కోరికలను ఒకటొకటిగా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎంబారోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *