తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు (ఆగస్టు 15) మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు మరియు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఉదయం నమోదైన వర్షాలు తగ్గుముఖం పట్టగా, మధ్యాహ్నం తర్వాత ఇతర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
వర్ష సూచన ఉన్న జిల్లాలు:
- మధ్యాహ్నం నుండి రాత్రి వరకు: అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల్లో కొత్తగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- అర్ధరాత్రి మరియు తెల్లవారుజామున: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు మరియు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము సమయాల్లో వర్షాలు పడవచ్చు.
హైదరాబాద్ వాతావరణం:
రాజధాని హైదరాబాద్ నగరం విషయానికి వస్తే, మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం నెలకుంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాతి నుంచి రాత్రి సమయంలోగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప కాల వ్యవధిలో చినుకులు లేదా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

