Sports
వ్యవసాయ పరిశోధనా కేంద్రం ముధోల్లో సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల క్షేత్ర సందర్శన
ముధోల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ముధోల్లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని భైంసాకు చెందిన శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. ఆకుల దినేష్ మరియు డా. కిషోర్ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ (Soil Sampling), నేల పరీక్షల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం మరియు పంటల పెరుగుదలలో నేల పోషకాల పాత్ర గురించి అవగాహన కల్పించారు.అలాగే ఎల్ నినో (El…
స్పీకర్ గడ్డం ప్రసాద్పై తాతా మధు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంది ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న…
అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు
పదోన్నతి అర్హత పత్రాలు అందజేసిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్8:(E6tv NEWS: ప్రతినిధి).గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి, పదోన్నతి అర్హత పత్రాలను అందజేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.సోమవారం తన ఛాంబర్లో ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. వి. పృధ్వీరాజు, బి. కిరణ్లకు జూనియర్ అసిస్టెంట్లుగా, ఎస్. సత్యం, వి. సంతోష్ కుమార్, పి. రామదాస్లకు…
అసెంబ్లీనా.. కౌరవసభనా?
ప్రజాస్వామ్య సభలో పోలీసు రాజ్యం అంటూ బీఆర్ఎస్ నేతల ఆగ్రహం మఠంపల్లి, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాల్సిన అసెంబ్లీలోనే ప్రజాప్రతినిధులపై పోలీసుల దాడులు జరగడం ఏమిటని ప్రశ్నిస్తూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.మండల బీఆర్ఎస్ నాయకులు ఇరుగు పిచ్చయ్య, మన్నెం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…
శిరీష కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ
నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్లో ఇటీవల హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని కలిసి ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.శిరీష మృతిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న కవిత.. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శిరీషను హత్య…
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన
బోధన్, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బోధన్లో ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ వివిధ తరగతుల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సత్య వర ప్రసాద్తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి…
‘భారత్పై ఆ గెలుపే కొంపముంచింది’:మహమ్మద్ యూసుఫ్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలు, పతనానికి 2021 T20 ప్రపంచకప్లో భారత్పై సాధించిన 10 వికెట్ల విజయమే ప్రధాన కారణమని ఆ దేశ మాజీ స్టార్ బ్యాటర్, కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఒక్క గెలుపు జట్టు ఆటగాళ్లలో తీవ్రమైన అహంకారాన్ని, అతివిశ్వాసాన్ని నింపిందని ఆయన విమర్శించారు. సమావేశంలో యూసుఫ్ మాట్లాడిన ప్రధాన ముఖ్యాంశాలు: వరసగా ప్రపంచకప్లు, ఆసియా కప్లలో ఘోరంగా విఫలమవుతున్న వేళ యూసుఫ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్…
పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
జిల్లా వ్యాప్తంగా 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు కొత్తగూడెం, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షను ప్రశాంతంగా,…
పలువురి దశదినకర్మల్లో పాల్గొని సంతాపం తెలిపిన కొత్వాల
కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించిన కొత్వాల దంపతులు. పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ పట్టణ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ఆదివారం పరామర్శించారు. ఆయా కుటుంబాల్లో నిర్వహించిన దశదినకర్మలు, చిన్నకర్మ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాల్వంచకు చెందిన…
చెస్లో నవభారత్ విద్యార్థుల సత్తా
అండర్-10లో భట్టు జైకి ప్రథమ బహుమతి.. అండర్-15లో లిఖిత సాయికి ఐదో స్థానం పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్-10 విభాగంలో భట్టు జై ప్రథమ బహుమతి సాధించగా, అండర్-15 విభాగంలో భట్టు లిఖిత సాయి ఐదో స్థానంలో నిలిచి ప్రతిభ కనబరిచింది.గత నాలుగు నెలలుగా జిల్లాస్థాయి చెస్ పోటీల్లో వరుసగా…

